తడి పచ్చిక పలకలపై,
మాటలు విసురుగా కదులుతాయి.
వెచ్చని దీపపు మెరుపులో
నీటి తంబూరా
దూరంగా వినపడుతుంది.
జ్యోత్స్నాఫణిజ
జీవిత విశేషాలు
డాక్టర్ జ్యోత్స్న ఫణిజ, ఏఆర్ఎస్డీ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం)లో ఆంగ్ల సహాయ ఆచార్యురాలు. 25 సంవత్సరాల వయస్సులో, 2016లో హైదరాబాద్లోని ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయంనుండి ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఆమె మొదటి కవితా సంకలనం, ‘ సెరామిక్ ఈవినింగ్ ‘, 2016లో రైటర్స్ వర్క్షాప్ ద్వారా ప్రచురించబడింది . రచయిత్రి నివేదిత ఎన్. తో కలిసి, ఆమె దృష్టి లోపం ఉన్న కవులు మరియు కథా రచయితల సంకలనాన్ని సంపాదకత్వం వహించారు, దీని పేరు ‘ ది వరల్డ్ ఐ రైట్ ఇన్’ , ఇది 2016లో ప్రచురించబడింది. ఆమె ‘క్రిమ్సన్ ల్యాంప్’ (2015),’స్టోన్డ్ సాంగ్’ (2019) అనే రెండు కవితా సంకలనాలను తెలుగునుండి ఆంగ్లంలోకి అనువదించారు. ఆమె పాటలు పాడడంతోబాటు కథానికలు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ వ్యాసాలు రాస్తుంటారు.