జి. నాగరాజన్


సొంత ఊరు:
మదురై
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

జి. నాగరాజన్ (1929 – 1981) ఉపాధ్యాయుడిగా కొన్నేళ్ళు, ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ళు ఉద్యోగం చేశారు. సాహిత్యంలో ఎక్కువగా రాయబడని అట్టడుగు వర్గాలవారైన సెక్స్ వర్కర్స్ జీవితాలను, కుంటెనగాళ్ళ జీవితాలను తొలిసారిగా తమిళ కథల్లో చూపించిన రచయిత. వందకు పైగా కథలూ, రెండు నవలలూ రాశారు. ‘కాలేజ్ ప్రిన్సిపాల్ మిస్ నిర్మల’ అన్న కథను ఇటీవలికాలంలో లఘుచిత్రంగా తీశారు. ఈయన రాసిన ‘నాళై మట్ఱుం ఒరు నాళే’ (రేపూ మరొక్క రోజే) అన్న నవల ఆంగ్లంలోకి అనువదించబడి మంచి గుర్తింపు పొందింది.


 

రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది. ‘ఒక నెల రోజలుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం’ అని అబద్ధమాడాను.