ఈ పుస్తక రచయితలు కథన శైలిని అనుసరించడం వల్ల, బౌద్ధ సాహిత్యం ఆధారంగా లభించిన బుద్ధుడి సంభాషణలను యథాతథంగా పేర్కొనే ప్రయత్నం చెయ్యడం వల్ల ఈ రచనను ఒకటికి రెండుసార్లు చదవాలనిపిస్తుంది. తమ కథన క్రమంలో పాఠకుల జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించే అనేక సంఘటనలను వారు విస్మరించలేదు.
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి
జీవిత విశేషాలు
తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి రచయిత, పర్యావరణవేత్త. తెలుగు సాహిత్యాన్ని ఆధునీకరించిన వారిలో ఒకరైన తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి వీరి పితామహుడు. మొక్కపాటి నరసింహశాస్త్రి వీరి మాతామహుడు. అమలాపురంలోని డిగ్రీ కళా శాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసి ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యావరణవేత్తగా పనిచేస్తున్నారు. రాజమండ్రిలో \”ఎన్విరాన్మెంటల్ సెంటర్\” అనే పర్యావరణ సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నాడు.