ఈ వ్యాస ప్రచురణ పూర్వరంగాన్ని కొలిచాల సురేశ్ వివరించిన దాన్ని బట్టి నేను ఇంతకు ముందు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని సవరించుకుంటున్నాను. 1999 లో సురేశ్ కూడ ఈమాట సంపాదకుల్లో ఒకరు. జయప్రభ ప్రత్యక్షంగా అనుమతించిన తర్వాతనే ఈ వ్యాస ప్రచురణ జరిగిందని అంటున్నారు. నాలాగే రచయిత్రి కూడ అప్పటి విషయాల్ని మర్చిపోయివుంటారు. ఈ వ్యవహారానికిక స్వస్తి.
1999లో సిన్సినాటి తానా సభల సందర్భంగా ప్రచురితమైన జయప్రభ గారి ఉపన్యాసాన్ని, వ్యాసాన్ని ఆవిడ అనుమతితోనే ప్రచురించాము. తానా సభల తరువాత షికాగోలో విడిది చేసిన జయప్రభగారితో నేనే స్వయంగా మాట్లాడి అనుమతి తీసుకున్నాను. వేలూరి వేంకటేశ్వర రావుగారు ఆవిడ రాతప్రతిని నాకు ఫాక్స్ చేస్తే, నేను, భట్టిప్రోలు అక్కిరాజు కలిసి టైపు చేసి, ఆలస్యంగా జులై సంచికకు జత చేశాము. జయప్రభ గారితో నేను మొట్టమొదటిసారి మాట్లాడింది ఈ సందర్భంగానేనని ఆవిడ గుర్తు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
‘కొను ధాతువు సకర్మకక్రియలకు ఆత్మనేపదార్థంలోనూ, అకర్మకక్రియలకు స్వార్థంలోనూ అనుప్రయుక్తమవుతుందన్నది సామాన్యార్థం. శరావతి యామిని నాట్యకౌశలిని ప్రశంసిస్తూ, “మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది.” అంటుంది. ‘స్వరితఞితః కర్త్రభిప్రాయే క్రియాఫలే’ అని పాణినీయం. “చోరాత్మనేపదార్థే గృహ్ణతా వాగమస్య వేత్వం స్యాత్” అని చింతామణి. ఆత్మనేపదానికి అర్థమయినటువంటి ‘గృహ్ణాతి’ ధాత్వర్థం పరమవుతుండగా ఇంచుగాగమపు చుకారానికి వైకల్పికంగా ఇకారం అవుతుంది. ‘స్వరితఞితః కర్త్రభిప్రాయే క్రియాయోగే” అన్న పాణిని సూత్రం వల్ల క్రియాఫలం కర్తృగామి అయినప్పుడు ఆత్మనేపదార్థం వస్తుంది. అందువల్ల గ్రహి ధాత్వర్థమైన ‘కొని’ అన్న శబ్దం కర్తృగామి కనుక లక్షణకర్త ‘ఆత్మనేపదార్థే’ అన్న విశేషణం ఉంచాడు. ఇక్కడ గ్రహి ధాత్వర్థమైన కొని శబ్దం ప్రదర్శించు కర్తృగామి కావటం మూలాన ఇంచుగాగమ చుకారానికి ఇకారం వచ్చి మహద్వాచకంలో ప్రదర్శించికొన్నాడు, మహతీవాచకంలో ప్రదర్శించికొన్నది అన్న రూపాలు ఏర్పడుతాయి.
అని అడిదము సూరకవి కవిసంశయవిచ్చేదం (1-100). అది ణిజర్థమైతే ప్రదర్శింపించుకొన్నది, ప్రదర్శింపించికొనియె ఇత్యాది రూపాలు ఏర్పడుతాయి. నాట్యప్రదర్శనరూపమైన ధాత్వర్థఫలాశ్రయత్వం యామినికే చెందుతున్నందువల్ల, “మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది.” అన్న రచన సలక్షణమే.
శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యులవారి సాహిత్యక్రియాకలాపం ప్రత్యక్షరంలోనూ రసప్రతీతిని సంతరించికొని ఉండటం తెలుగు పాఠకుల పుణ్యఫలం. ఆ విశేషాలు మరొకసారి!
Here is an one liner(from 20th century Joshua) that might summarize the above much more succinctly and it is not at all verbose, but conveys the same with simple elegant words.
శ్రీకామేశ్వరరావుగార్కి వారి అభిప్రాయప్రకటనకై కృతజ్ఞుడను.
1.నాటికాంతంలో సూచించినట్లుగా నేను 3 పద్యాలను చిత్రకవి సింగరాచార్యులవారి బిల్హణీయకావ్యమునుండి ఇందులో వాడుకొన్నాను. అందులో ‘హాకవిరాజశిఖామణి’ అన్న పద్యాన్ని దోషయుక్తంగా ఇందులో నా అనవధానతవల్ల వ్రాసినాను. మూలంలో ‘హాకవిరాజరాజమణి! హానవ మోహన! హా మనోహరా!’ అని చక్కగానే ఉన్నది కాని, నా అనవధానతవల్ల ఈగణభంగదోషం సంక్రమించినది. 2.వ్యాకరణం మాట ఎట్లున్నను ‘పాండిత్యం ప్రదర్శించుకొంది’ అనేవాక్యం నీచపాత్రలు మాట్లాడుకొనే సందర్భంలోనిది. ఇది పాత్రకు తగినట్లే ఉన్నది. ఇది ‘వాడు ధనము నార్జించుకొన్నాడు’ అను వాక్యంవంటి ప్రయోగం.
రసవత్తరమైన వ్యాసము. ప్రశస్తి గాంచిన పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు యిలా బోధించుకు పోతుంటే ఎప్పటికో అప్పటికి కించిత్ సంస్కృత జ్ఞానము,ఒకింత తెలుగుఎఱుక కలుగక పోతాయా ?
రవిగారు,
మీరన్నది నిజమే. ఇలాంటి వర్ణనలలో రసస్ఫూర్తి పెద్దగా ఉండదు. ఎదగడమా, ఒదగడమా అన్న మాట పక్కన పెడితే, ఇలాంటి వర్ణనలు చదివి ఆనందించడానికి బుద్ధి తప్పక సహకరించాలి. నా మటుకు నాకు ఇలాంటి కల్పనాచాతురి మనసుని ఒహో అనిపిస్తుంది. మా గిరీశాం భాషలో చెప్పాలంటే “వీడి తస్సాగొయ్యా!” అనాలనిపిస్తుంది. 🙂
చాలా హృద్యంగా రసరమ్యంగా ఉంది! ఆద్యంతం చంద్రునితో అనుసంధానం చేసి సాగిన వర్ణనలు మొత్తం నాటికకి చక్కని నేపథ్యంగా నిలిచాయి. నాటికంతటికీ నాకు బాగా నచ్చిన పద్యం, గొప్ప రసాత్మకమైనది:
అలాగే, “క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు…” అన్న సీసంలో, నాయికకు ప్రయోగించిన సాభిప్రాయ పదాలు ఆ పద్యాన్ని గొప్ప అనువాదంగా తీర్చిదిద్దాయి. బంగారానికి తావి అబ్బగల మహిమని గుర్తించలేని వారు మాత్రమే కవితానువాదాన్ని తక్కువగా చూస్తారు.
“హా కవిరాజశిఖామణీ! హా నవమోహన! హా మనోహరా!” అన్న పాదంలో గణం తప్పింది. అయినా సందర్భోచితంగానే ఉంది, యామిని తడబాటును వ్యంజింపజేస్తూ!
ఒక చిన్న సందేహం. “ఆ! మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది” – “ప్రదర్శించు” అనే క్రియను ఇలా ఆత్మనేపద రూపంలో ప్రయోగించడం వ్యాకరణసమ్మతమేనా?
కోనసీమ కథలు: కాటికాడ రుణం గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
07/08/2014 4:29 am
ఎత్తుగడ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కథలో మలుపులు మెరుపులు లేవు. చప్పాతిచప్ప!!
కొండదారిలో! గురించి Sastry అభిప్రాయం:
07/07/2014 12:42 pm
మానస గారు:
కవిత బాగానే ఉన్నది. వీటిని గమనించండి.
1. అంటుకునే ఆటకి ఆటగాళ్ళిద్దరూ పరిగెత్తాలి లేక కదలగలగాలి. ఇక్కడ కదిలేది గాలి ఒక్కటే కదా?
2. కొమ్మలు కదిలితే ఊడలు ఊగుతాయి. ఊడలు కొమ్మలని ఊపడం?
3. పాములు తమ కుబుసాలని జంటగా కూర్చుని విడుచుకోవు?
4. కడియాలకి చప్పుడు రాదు. అవి ఘల్లుమని మోగవు?
ఇటువంటి జాగ్రత్తగా చూసుకుంటూ కవిత్వం రాస్తూంటే కొన్నాళ్ళకి మంచి కవిత్వం రాయొచ్చేమో.
అభినందనలతో
శాస్త్రి.
మైదానానికి చెలియలి కట్ట గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/07/2014 9:51 am
ఈ వ్యాస ప్రచురణ పూర్వరంగాన్ని కొలిచాల సురేశ్ వివరించిన దాన్ని బట్టి నేను ఇంతకు ముందు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని సవరించుకుంటున్నాను. 1999 లో సురేశ్ కూడ ఈమాట సంపాదకుల్లో ఒకరు. జయప్రభ ప్రత్యక్షంగా అనుమతించిన తర్వాతనే ఈ వ్యాస ప్రచురణ జరిగిందని అంటున్నారు. నాలాగే రచయిత్రి కూడ అప్పటి విషయాల్ని మర్చిపోయివుంటారు. ఈ వ్యవహారానికిక స్వస్తి.
మైదానానికి చెలియలి కట్ట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/07/2014 6:54 am
1999లో సిన్సినాటి తానా సభల సందర్భంగా ప్రచురితమైన జయప్రభ గారి ఉపన్యాసాన్ని, వ్యాసాన్ని ఆవిడ అనుమతితోనే ప్రచురించాము. తానా సభల తరువాత షికాగోలో విడిది చేసిన జయప్రభగారితో నేనే స్వయంగా మాట్లాడి అనుమతి తీసుకున్నాను. వేలూరి వేంకటేశ్వర రావుగారు ఆవిడ రాతప్రతిని నాకు ఫాక్స్ చేస్తే, నేను, భట్టిప్రోలు అక్కిరాజు కలిసి టైపు చేసి, ఆలస్యంగా జులై సంచికకు జత చేశాము. జయప్రభ గారితో నేను మొట్టమొదటిసారి మాట్లాడింది ఈ సందర్భంగానేనని ఆవిడ గుర్తు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
సురేశ్.
బిల్హణీయము గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
07/07/2014 2:53 am
మాన్యులు శ్రీ కామేశ్వరరావు గారికి
నమస్కారములతో,
‘కొను ధాతువు సకర్మకక్రియలకు ఆత్మనేపదార్థంలోనూ, అకర్మకక్రియలకు స్వార్థంలోనూ అనుప్రయుక్తమవుతుందన్నది సామాన్యార్థం. శరావతి యామిని నాట్యకౌశలిని ప్రశంసిస్తూ, “మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది.” అంటుంది. ‘స్వరితఞితః కర్త్రభిప్రాయే క్రియాఫలే’ అని పాణినీయం. “చోరాత్మనేపదార్థే గృహ్ణతా వాగమస్య వేత్వం స్యాత్” అని చింతామణి. ఆత్మనేపదానికి అర్థమయినటువంటి ‘గృహ్ణాతి’ ధాత్వర్థం పరమవుతుండగా ఇంచుగాగమపు చుకారానికి వైకల్పికంగా ఇకారం అవుతుంది. ‘స్వరితఞితః కర్త్రభిప్రాయే క్రియాయోగే” అన్న పాణిని సూత్రం వల్ల క్రియాఫలం కర్తృగామి అయినప్పుడు ఆత్మనేపదార్థం వస్తుంది. అందువల్ల గ్రహి ధాత్వర్థమైన ‘కొని’ అన్న శబ్దం కర్తృగామి కనుక లక్షణకర్త ‘ఆత్మనేపదార్థే’ అన్న విశేషణం ఉంచాడు. ఇక్కడ గ్రహి ధాత్వర్థమైన కొని శబ్దం ప్రదర్శించు కర్తృగామి కావటం మూలాన ఇంచుగాగమ చుకారానికి ఇకారం వచ్చి మహద్వాచకంలో ప్రదర్శించికొన్నాడు, మహతీవాచకంలో ప్రదర్శించికొన్నది అన్న రూపాలు ఏర్పడుతాయి.
క. పెనచికొని గూడికొని యిడి
కొని యను శబ్దములఁ గృతులఁ గూరుచు చోటన్
‘కొని’ శబ్ద పూర్వవర్ణం
బున కిత్వోత్వంబు వచ్చు భుజగాభరణా!
అని అడిదము సూరకవి కవిసంశయవిచ్చేదం (1-100). అది ణిజర్థమైతే ప్రదర్శింపించుకొన్నది, ప్రదర్శింపించికొనియె ఇత్యాది రూపాలు ఏర్పడుతాయి. నాట్యప్రదర్శనరూపమైన ధాత్వర్థఫలాశ్రయత్వం యామినికే చెందుతున్నందువల్ల, “మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది.” అన్న రచన సలక్షణమే.
శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యులవారి సాహిత్యక్రియాకలాపం ప్రత్యక్షరంలోనూ రసప్రతీతిని సంతరించికొని ఉండటం తెలుగు పాఠకుల పుణ్యఫలం. ఆ విశేషాలు మరొకసారి!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం గురించి vvadi అభిప్రాయం:
07/06/2014 10:42 pm
Here is an one liner(from 20th century Joshua) that might summarize the above much more succinctly and it is not at all verbose, but conveys the same with simple elegant words.
భూనభముల కృంజీకటులు ఏనుగునకు మదము వోలె ఎసకమెసగెన్
బిల్హణీయము గురించి Desikachary అభిప్రాయం:
07/06/2014 10:14 pm
శ్రీకామేశ్వరరావుగార్కి వారి అభిప్రాయప్రకటనకై కృతజ్ఞుడను.
1.నాటికాంతంలో సూచించినట్లుగా నేను 3 పద్యాలను చిత్రకవి సింగరాచార్యులవారి బిల్హణీయకావ్యమునుండి ఇందులో వాడుకొన్నాను. అందులో ‘హాకవిరాజశిఖామణి’ అన్న పద్యాన్ని దోషయుక్తంగా ఇందులో నా అనవధానతవల్ల వ్రాసినాను. మూలంలో ‘హాకవిరాజరాజమణి! హానవ మోహన! హా మనోహరా!’ అని చక్కగానే ఉన్నది కాని, నా అనవధానతవల్ల ఈగణభంగదోషం సంక్రమించినది. 2.వ్యాకరణం మాట ఎట్లున్నను ‘పాండిత్యం ప్రదర్శించుకొంది’ అనేవాక్యం నీచపాత్రలు మాట్లాడుకొనే సందర్భంలోనిది. ఇది పాత్రకు తగినట్లే ఉన్నది. ఇది ‘వాడు ధనము నార్జించుకొన్నాడు’ అను వాక్యంవంటి ప్రయోగం.
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:
07/06/2014 1:53 pm
రసవత్తరమైన వ్యాసము. ప్రశస్తి గాంచిన పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు యిలా బోధించుకు పోతుంటే ఎప్పటికో అప్పటికి కించిత్ సంస్కృత జ్ఞానము,ఒకింత తెలుగుఎఱుక కలుగక పోతాయా ?
నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
07/06/2014 1:45 pm
సురేశ్ గారు, ధన్యవాదాలు.
రవిగారు,
మీరన్నది నిజమే. ఇలాంటి వర్ణనలలో రసస్ఫూర్తి పెద్దగా ఉండదు. ఎదగడమా, ఒదగడమా అన్న మాట పక్కన పెడితే, ఇలాంటి వర్ణనలు చదివి ఆనందించడానికి బుద్ధి తప్పక సహకరించాలి. నా మటుకు నాకు ఇలాంటి కల్పనాచాతురి మనసుని ఒహో అనిపిస్తుంది. మా గిరీశాం భాషలో చెప్పాలంటే “వీడి తస్సాగొయ్యా!” అనాలనిపిస్తుంది. 🙂
బిల్హణీయము గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
07/06/2014 1:28 pm
చాలా హృద్యంగా రసరమ్యంగా ఉంది! ఆద్యంతం చంద్రునితో అనుసంధానం చేసి సాగిన వర్ణనలు మొత్తం నాటికకి చక్కని నేపథ్యంగా నిలిచాయి. నాటికంతటికీ నాకు బాగా నచ్చిన పద్యం, గొప్ప రసాత్మకమైనది:
ఆవిమలాత్ముసఖ్యమె మదంగము నెప్పుడు చేతనత్వసం
భావితముం బొనర్పఁదగు ప్రాణము; తద్రహితాంగ మెన్నఁగా
జీవములేని కాష్ఠమగు, చేకొని దానముసేయ దాని నిం
కో వసుధాధినాథునకు యుక్తమె చెప్పుమ మానవేశ్వరా!
అలాగే, “క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు…” అన్న సీసంలో, నాయికకు ప్రయోగించిన సాభిప్రాయ పదాలు ఆ పద్యాన్ని గొప్ప అనువాదంగా తీర్చిదిద్దాయి. బంగారానికి తావి అబ్బగల మహిమని గుర్తించలేని వారు మాత్రమే కవితానువాదాన్ని తక్కువగా చూస్తారు.
“హా కవిరాజశిఖామణీ! హా నవమోహన! హా మనోహరా!” అన్న పాదంలో గణం తప్పింది. అయినా సందర్భోచితంగానే ఉంది, యామిని తడబాటును వ్యంజింపజేస్తూ!
ఒక చిన్న సందేహం. “ఆ! మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది” – “ప్రదర్శించు” అనే క్రియను ఇలా ఆత్మనేపద రూపంలో ప్రయోగించడం వ్యాకరణసమ్మతమేనా?