ఈ సంచికలోని ఈ వ్యాసమూ, తదితర రచనలే కాక ఈమధ్య ఈమాట సంచికల్లో ప్రచురితమవుతున్న మరికొన్ని రచనలూ చదువుతుంటే, భర్తృహరి సుభాషితములలో (తెనుగు అనువాదం ఏనుగు లక్ష్మణ కవి)ఈ పద్యం స్ఫురణకు వచ్చింది.
ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కు భంగుల వివేకభ్రష్ట సంపాతముల్
(గంగానది ప్రధమమున ఆకాశమునుండి ఈశ్వరుని తల మీదను, అచ్చట నుండి హిమవత్పర్వతము మీదను, ఆ పర్వతము నుండి భూమి మీదను, భూమి నుండి సముద్రమునకును, అచ్చట నుండి పాతాళమునకు వచ్చెను. గొప్పస్థితి నుండి తొలిగినవారికి ఇదేవిధముగ పలు విధములుగు పాట్లు సంభవించును.)
“మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి” అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక సారి. దానికి వారు “ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్రుసిక్త నేత్రులు కావడం” అని అన్నారట.
20వ శతాబ్దిలో తెలుగు సాహిత్య గమనాన్ని మార్చివేసిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితను భారతి పత్రిక తిరస్కరించింది! ప్రమాదో ధీమతామపి. తరువాత భారతి తన తప్పిదాన్ని ఒప్పుకొని, “కవితా, ఓ కవితా” ప్రచురించింది. ఇటువంటి తిరస్కారలేఖలు అందుకున్న ప్రముఖ రచనలెన్నో. ప్రముఖ ఆంగ్ల రచనలను మొదట తిరస్కరించిన సంపాదకుల వ్యాఖ్యలకు కొన్ని ఉదాహరణలు:
“I recommend that it be buried under a stone for a thousand years.” — an editor about Vladimir Nabokov’s Lolita.
“Nobody will want to read a book about a seagull.” on Richard Bach‘s Jonathan Livingston Seagull
“The girl doesn’t, it seems to me, have a special perception or feeling which would lift that book above the ‘curiosity’ level.” — about The Diary of Anne Frank .
“Too radical of a departure from traditional juvenile literature.” on Frank Baum’s The Wonderful Wizard of Oz.
“An endless nightmare. I think the verdict would be ‘Oh don’t read that horrid book.” on H. G. Wells’ The War of The Worlds
“An absurd story as romance, melodrama or record of New York high life.” on Fitzgerald’s The Great Gatsby
“I haven’t the foggiest idea about what the man is trying to say. Apparently the author intends it to be funny.” on Heller’s Catch-22
“We are not interested in science fiction which deals with negative utopias. They do not sell.” on Stephen King’s Carrie. This book apparently sold 1 million copies in the first year alone.
“I rack my brains why a chap should need thirty pages to describe how he turns over in bed before going to sleep.” French editor comments rejecting Remembrance of Things Pasts by Marcel Proust.
“This author is beyond psychiatric help. Do not publish.” Publisher rejects Crash by J.G. Ballard.
Robert M. Pirsig‘s Zen & the Art of Motorcycle Maintenance is in the Guinness Book Of Records for 121 rejections, more than any other best-seller.
తీర్చలేని బాధ అది. మనసులో మాట బయటకు చెప్పుకోలేరు అంత తొందరగా. అందుకే కథలో తెలిసినంత బాగా (చెప్పి చెప్పకుండా చెప్పినా) నిజజీవితంలో చూస్తున్నా కూడా తెలియదు.
కళ్యాణిగారూ ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యంలో వేశ్యల జీవితచిత్రణ గురించి చాలా ఆలోచనాత్మకంగా, స్పష్టంగా, చెప్పారు. విశ్లేషణ బాధితులవైపు నుంచి సాగడంతో వాళ్ల గొంతుక బలంగా వినిపించింది. మీరు ప్రస్తావించిన రచన్లో కన్యాశుల్కం, అంధకారంలో వంటి ప్రముఖ రచనలు తప్ప చాలా వాటిని చదవలేదు. కొకువి మళ్లీ చదవాలి. పెద్దిభొట్ల సతీసావిత్ర కథను తప్పక చదువుతాను. పరిచయమే పొగిలే దుఖం తెప్పించింది.
మీ వ్యాసంతో కొన్ని సందేహాలు తీరాయి. సెక్స్ వర్కర్లు వాళ్ల మానాన వాళ్లు బతికితే ఎవరికేం నష్టమ అని నాలోనూ ఒక సందిగ్ధ రాజీ ఉండేది, ఈ సబ్జెక్టుపై లోతుగా ఆలోచించకపోవడం వల్ల. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ పురాతన వ్రుత్తి ఏదో ఇష్టంతో తీసుకున్నది కాదు. దాన్ని కొనసాగించాలనే అధర్మవడ్డీ వాదులు నాకు తెలిసి గతంలో కంటే ఎక్కువయ్యారు. ప్రగతివాదులం అని చెప్పేవాళ్లూ ఉన్నారు వీళ్లలో. వేశ్యా వ్యవస్థకు మూలమైన పరిస్థితులను మార్చకుండా ఆ వ్యవస్థను తీసేయలేమని చక్కగా విశ్లేషించారు.
డబ్బు కేవలం దానంతట అదే త్రుప్తి నివ్వదు. సుఖాలు కోరుతుంది. దాంట్లోంచి మొదలవుతాయి జాడ్యాలు. ధనవంతులకు సుఖం, పేదలకు దుఖం.
ఈ వ్యాసంలో మీరు ముఖ్యమైన చాలా రచనలకు కవర్ చేశారు. విస్త్రుతి పెరడగం వల్ల కొన్ని లేకపోవచ్చు. సీమవైపు కొన్ని మంచికథలు వచ్చాయి. చక్రవేణు కువైట్ సావిత్రమ్మ, నిర్మలారాణి గాజు కళ్లు వంటివి. మీకు దొరికి ఉండకపోవచ్చు. కరువుపీడిత కడప, అనంతపురం జిల్లాల్లో ఈ అభాగినులు ఎక్కువ. పైగా దేశంకాని దేశంలో హింస. ఇదో కొత్తకోణం. మన సమాజానికి పతనానికి ఎన్ని ముఖాలో…
ఈ వ్యాసం చాలా ఆలోచనలు రేకిత్తించింది. నా అభిమాన భావవిప్లవకారుడు వోల్టేర్ తన కాండీడ్లో ఈ వ్రుత్తిలోని బీభత్సాన్ని చూపాడు. కన్యాశుల్కం, కాండీడ్ లో చాలా పోలికలు ఉన్నాయి. ఈ నవల్లోని ఇలాంటి విధివంచితలు కథనాయిక క్యూనెగొండ్ సహా ముగ్గురు వున్నారు. పకెట్ అనే దాసి కథానాయకుడైన కాండీడ్తో ఏం చెబుతోందో చదవండి.
‘నా యజమానులకు, ఆ ముచ్చటైన క్యూనెగొండ్ చిన్నమ్మకు జరిగిన దారుణాల గురించి విన్నాను. అయితే నా పరిస్థితి అంతకంటే దారుణం. నేనప్పుడు చిన్నప్పుడు అమాయకురాలి కదా, అందుకే మన గురువు ననుశీ సులభంగా బుట్టలో వేసుకుని పాడు చేశాడు. మిమ్మల్ని అయ్యాగారు చావుదెబ్బలు కొట్టి తరిమేశాక నేనూ బలవంతంగా ఇంట్లోంచి బయటపడాల్సి వచ్చింది. ఓ పెద్ద వైద్యుడు నాపై జాలిపడకుండా ఉన్నట్లయితే నేనప్పుడే చచ్చిపోయేదాన్ని. ప్రాణాలు పోశాడనే కృతజ్ఞతతో కొన్నాళ్లు ఆయనతో గడపాల్సి వచ్చింది. అయితే ఆయన కఁళ్లుబోతు పెళ్లాం నన్ను రోజూ చావగొట్టి చంపేది. అబ్బ! ఎంత గయ్యాళిగంప! ఆ వైద్యుడు కురూపి. అతనిపై ప్రేమ లేకపోయినా, కృతజ్ఞతతో పడుండి అతని పెళ్లాంతో తన్ను తింటూ ఉండేదాన్ని. ఆ రాక్షసిముండ పీడ భరించలేక అతడు ఓ రోజు ఆమెకు చలిజ్వరానికి మందు వేశాడు. అది బాగా పనిచేసి రెండుగంటలు తిరక్కముందే ఆమె నరకయాతన అనుభవించి చచ్చిపోయింది. ఆమె బంధువులు అతనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడు పారిపోయాడు. అతనికి బదులు నన్ను ఖైదు చేశారు. అయ్యా! నేను గనుక కాస్త అందంగా లేకపోయినట్లయితే నా అమాయకత్వం నన్ను ఏమాత్రం కాపాడేది కాదు. వైద్యుడి స్థానాన్ని తాను తీసుకునే షరతుపై న్యాయమూర్తి నన్ను విడుదల చేయించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత మరొకామెను చేరదీసి నన్ను వెళ్లగొట్టాడు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వీధిలో పడ్డాను. అప్పటినుంచి ఈ కంపరం పుట్టించే బతుకు బతుకుతున్నాను. అయ్యా! మీ మగవాళ్లకు ఇందులో ఏదో మజా ఉందఁపించవచ్చు కానీ మాకు మాత్రం యమకూపమే. ఈ దరిద్రపు బతుకు బతకడానికే వెనిస్ వచ్చాను. పడుపుగత్తె బతుకు ఎంత దారుణవెూ మీకు తెలుసకుంటా. కాళ్లు కాటికి చాపుకున్న ముసలి వ్యాపారి, న్యాయవాది, సన్యాసి, సరంగు, ఇలా ప్రతి అడ్డమైన వాడిమీదా ఒకే రకంగా ప్రేమ ఒలకబోయాలి. లెక్కలేనన్ని బాధలు, అవమానాలు పడాలి. తరచూ లంగాను అరువు తెచ్చుకోవాలి… మధ్యలో న్యాయాధికారుల, రక్షకభటుల వేధింపులు, దందాలు షరా మామూలే. చివరకు దుర్భరమైన ముసలితనం, తర్వాత శరణాలయాల్లో, చస్తే ఏ పెంటకుప్పలోనో తేలడం.. లోకంలో నాకంటే దౌర్భాగ్యురాలు లేదు బాబూ..’
మీ వ్యాసం చదుతోంటే నాకు మహానది, సలాం బాంబే వంటి సినిమాలు, జోనా నానా, యమకూపం వంటివెన్నో గుర్తుకొస్తున్నాయి… మళ్లీ చదవాలి ఈ వ్యాసాన్ని.. మీరు ఇలాంటి మరెన్నో రాయాలని కోరుతూ…
పి.మోహన్
The new year has begun with a spate of pseudonyms and anonymous names, as far as this journal is concerned. I am amazed at the creativity of the human mind. While LoL, ROFL are just acronyms to describe situations, this is more than all those. While the old year had names like aSmAchaM, the new year has gOgOrA. It looks even like a song
go go raa
go go raa
let us all
go go raa
gOmgUrA
go go raa
Where are the tunesmiths?
Not to be outdone, even the commentators turned to very interesting names! kaTakaTA reminds me of the song in the age old gramaphone drama set records like anasUya.
కటా యెటుల్ భరింతు ని ఘోర పాప బాధ !
Then we have another one kEkE. I am immediately reminded of
కాకీక కాకికేకాక కేకికా,
కేకేకే !
I am waiting for the next comment on this parody-cum-essay-cum-story-cum-sketch-cum-fill-in-the-blanks.
Yes, I am real, still explaining the glories of ఛందస్సు which kEkE does not seem to be very fond of.
ఇప్పుడే జనవరి సంచిక చూడటం మొదలుపెట్టాను. సంచిక మొదటిలోనే నాకు బాగా తెలిసిన పాత పుస్తకం పేరు చూడగానే మీ పుస్తక పరిచయం చదివాను. ముందుగా ఈ పుస్తకం (1966లో ప్రచురించబడింది) చాలా కాలంగా DLIలో ఉంది. గత 20 ఏళ్లలో నన్నీపుస్తకం గురించి ముగ్గురు, నలుగురు అడిగారు. గమ్మత్తేమంటే అడిగిన వారందరూ దీనితో పాటు తెన్నేటి కోదండరామయ్య రాసిన “మాబడి” (1950) అనే పుస్తకం గురించి అడగటం, పైగా అందరూ తూర్పు గోదావరి జిల్లా వాళ్లే కావడం! 🙂
ఇంక పుస్తకం విషయానికొస్తే నాకు గొప్పగా అనిపించలేదు. ఆమాటకొస్తే తెలుగులో చెప్పుకోదగ్గ యాత్రా చరిత్రలేమీ (travellogues) రాలేదు – ఏనుగుల “కాశీయాత్రా చరిత్ర”, కోలా శేషాచలకవి “నీలగిరి యాత్ర” లను మినహాయిస్తే. (ఈ విషయంపైన ఆసక్తి ఉన్నవారు మచ్చా హరిదాసుగారి సిద్ధాంత గ్రంథం చూడవచ్చు.)
క్రింద కామెంట్లలో సంపాదకులు రాసిన మాటలు చూడకనే ఈ రచన చదివాను. Haughty prima donna లకి ఉండే iconoclastic దురుసుతనం అనిపించింది. శ్రీశ్రీ మీద రాళ్ళురువ్వాలన్న దుగ్ధ కనిపించింది. “నేనొక దుర్గం” అన్నంత మాత్రాన రాళ్ళురువ్వకూడదనేం లేదు గాని, ఇదే సంచికలో ఇలాంటి రచనలు (ఇస్మాయిల్ కవిత్వం మీద ఒక ఎన్నారై కుర్రాడు పాల్పడిన బాడ్ టేస్టు తో సహా కలుపుకుని) రెండు ఉండటం చూస్తే ఇది ప్రత్యేకించి ఈమాట లాంటి ఎన్నారై పత్రికకే అబ్బుతున్న అలవాటుగా తోస్తోంది. రచయితల ప్రవాసం సాహిత్యానికి మంచి చేస్తుందంటారు. దాంతె నుంచి జాయ్స్ దాకా ప్రవాసం వల్ల వారి భాషల సాహిత్యానికి మంచి జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన తెలుగు రచయితల ప్రవాసం తెలుగు సాహిత్యానికి ఏ చేర్పూ చేయకుండా ఇలా పాతవాసనలతో, పాండిత్యప్రకర్షతో కుంగిపోతోందేమా అని బాధ కలుగుతోంది. దూరం వల్ల మాతృభూమి అంతఃసారం ప్రబలంగా బోధపడుతుంది అంటారే. మరి తెలుగు ఎన్నారైలకు వారి దూరం మన తెలుగుతనపు సారాన్ని అవగతం చేసి పెట్టాలి కదా. ఇప్పటి తెలుగునేల పరిస్థితి పట్ల పదునైన పరిశీలనలు రావాలి కదా. దాని పట్ల వ్యంగ్యమో, వేదనో, కరుణో, కోపమో, కనీసం నైరాశ్యమో ఏదో ఒకటి బయటపడాలి కదా. కానీ ఇక్కడి నూతులు చాలవన్నట్టు అక్కడికి వెళ్ళి కొత్త నూతులు తవ్వుకుంటూ, వినపడని మాతృభాష మీద సహజంగా కలిగే నేలబారు మమకారంతో “తెలుగు భాషో! పాత సాహిత్యమో! ఛందస్సులో! పద్యాలో!” అంటూ ఇంకా పాతనే పట్టుకు వేలాడటం చూస్తే ఆశ చల్లారుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా తెలుగు ప్రవాసం నికరంగా మిగిలే ఒక్క రచయితనీ పుట్టించలేకపోవడం చూస్తే ప్రవాసం మంచి చేయటమన్న సిద్ధాంతం తెలుగువారికి నప్పదేమో అనిపిస్తోంది. ఎందుకు నప్పదా అని ఆలోచిస్తే ఒకటి తోస్తోంది: దాంతే, జాయ్స్ లాంటి వాళ్ళకు ప్రవాసమనేది రాజకీయ, తాత్త్విక, వైయక్తిక సంఘర్షణల ఫలితం; కానీ తెలుగు ఎన్నారైలకు మాత్రం అది మామూలు మధ్యతరగతి ఆకాంక్షల ఫలితం. అదలా ఉంచుదాం. పై రచన చదివిన తర్వాత క్రింద కామెంట్లలో ‘ఇది కథే’ అన్న సంపాదకుల వ్యాఖ్యానం చూస్తే – శ్రీశ్రీ మీద రాళ్ళు రువ్వటానికి అసలు ఒక సందర్భమూ, అవసరమూ కనపడక ఈ వేషము ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. అది పిరికి వేషము అనిపించటానికి కారణం ఏమంటే – ఈ గోపాలుని గోవిందరావు ఒక కల్పిత పాత్ర కాబట్టి అతని మాటలకు ఏ జవాబు చెప్పినా అది కేరక్టర్ బేస్డ్ క్రిటిసిజం అయి కూర్చుంటుంది. కానీ శ్రీశ్రీ నిజం మనిషే కాబట్టి ఈ కాస్తా రాయాలనిపిస్తోంది. ఆయన నా అభిమాన రచయితేం కాదు, ‘కవితా ఓ కవితా’ లో పౌనఃపున్య దోషం హెచ్చు, కానీ ఆస్వాదించేందుకు అంతకుమించిన గుణాలూ ఎన్నో ఉన్నాయి.
ఈ గోగోరా అనే “పాత్ర” ఈ ఉత్తరం సూచిస్తున్న కాలానికి చెందిన సంపాదకునిలా లేడు. నేటి కాలపు pedantic అంతర్జాల తెలుగుపత్రికలు కొన్నింటికి సంపాదకుని వలె ఉన్నాడు (శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ ను తిరస్కరించగలిగేంతటి గొప్ప కంటెంటును అవి అన్యథా ఇవ్వటం లేదన్నది అప్రస్తుతమే అయినా ప్రస్తావనార్హం). ఈ ఉత్తరంలో, “కేవలం సంస్కృతంలో రాసి పారేసే జనం పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్నారు” అన్నది ఒక anachronistic వాక్యం. ఎందుకంటే 1937 లో రాసిన ఉత్తరంలో ఒక సంపాదకుడు అలా వాపోతున్నాడూ అనటానికి అంతకుముందేమన్నా సంస్కృత ఛాయలు లేని అచ్చతెలుగు కవిత్వ సంప్రదాయం డామినేట్ చేస్తూ వచ్చిందా? ఆదికవి ఆదిగా దాదాపు అంతా కలగాపులగం బాటే కదా. కాబట్టి సంపాదకుని ఆ అభ్యంతరంలో కథాపరమైన ఔచిత్యం లేదు. అంతేకాదు, ఈ కాలపు ఇంగ్లీషు వర్డుకౌంటు సాఫ్టువేర్ల స్పృహ లేనివాడే అయితే సంధుల కూడికతోనే పదాల లెక్క చెప్తాడు తప్ప, మళ్ళీ సంధులు విడదీస్తే పెరిగే పదాల గురించి ఆలోచించడు. “లోహశ్యేనం”, “ఫిరంగిజ్వరం” వంటి పదాలు ఇస్తున్న అపూర్వ భావచిత్ర సాక్షాత్కారాలకు గుడ్డివాడై అర్థాలు అడుగుతున్న తీరు చూస్తే ఈ గోగోరా కవిత్వంలో పదాల juxtaposition పట్ల కనీస అవగాహన లేనివాడనిపిస్తుంది. అలాగే కొద్దిగా tone deaf కూడా. అలాంటి పాత్రను ఒక సాహిత్య పత్రికకు, అందులోనూ కవిత్వ విభాగానికి సంపాదకుడిగా చూపటం నప్పలేదు. అసలు ఈ కథే వాడి స్థాయిని వెక్కిరించటానికి ఐతే తప్ప.
“బిగుతైన పద్యం”, “ఓ పదం వేయలేని తీయలేని పద్యం” అన్నవి ఆధునిక భావనలు. కాలగమనంలో వచ్చే ప్రతి మార్పూ అభివృద్ధే అన్నది ఒక భ్రమ. వర్తమానం అంతిమం కాదు. చరిత్ర చక్రరూపం. హోమర్ బిగుతైన కవి కాబట్టి అలరిస్తున్నాడా, రామాయణం ఓ పదం వేయలేని తీయలేని కావ్యం కాబట్టి రమణీయమా? కాదు, “నానృషిః కురుతే కావ్యం” కాబట్టి అవి గొప్పవి. మన జైసేకే తైసే సీజనల్ కవులు వందమందికి “పునరుక్తి”, “దుష్టసమాసం”, “ప్రాసానుప్రాసల” గురించి పాఠాలు చెప్పవచ్చు. కానీ ఋషులకు, ఋషిత్వం నుంచి వలికిన కవితలకూ పాఠాలు చెప్తామా. ఈ కవిత చెప్తున్న కవి – తెలుగు విప్లవరాజకీయాల అంటురోగంతో యోగభ్రష్టుడైన శ్రీశ్రీ కాదు; గుహ వంటి కుటిలో చీకటిలో చిరదీక్షా తపస్సమీక్షణలో స్రుక్కిన శ్రీశ్రీ. అనుభవ తీక్ష్ణతకు తాళ లేక కవిత పొంగినపుడు దానికి లావా లాంటి వేడీ వెలుతురూ ఉంటాయి. దాని దగ్గరకు మూసలు తీసుకుని వెళ్ళటం అమాయకత్వం. మూసలు కమ్మరికొలిమి దగ్గర పనికొస్తాయి, అగ్నిపర్వతాల దగ్గర కాదు.
వర్డుకౌంటు ద్వారా ఈ ‘గోగోరా’నే పసిగట్టినట్టు ‘కవితా ఓ కవితా’లో ఉన్న నాలుగువందల పైచిలుగు పదాల్లో “పేశలము, శ్యేనము, ఘూకం, భేకం, సర్పం, భేరుండము..” లాంటి ఆరేడు మాత్రమే జంతు సంబంధమైన పోలికలు ఉన్నవి. రోచిర్నివహాలు, ఝంఝూ ప్రభంజనాలు, చేలాంచలాలూ, కుసుమపరాగాలు, రథాలూ, వజ్రాలు, ఫిరంగులూ, మృదంగాలూ, తాగుబోతులూ, పడుపుకత్తెలూ, శిశువులూ, శస్త్రకారులూ, సమ్మెకూలీలు, ఉరితీయబడ్డ శిరస్సులూ ఇలా భూమి నుంచి అంతరిక్షం దాకా లెక్కలేనన్ని ఉపమానాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ గోగోరా కి కేవలం జంతుసంబంధమైన పోలికలే కనపడుతున్నాయంటే… అవి అతని ఆసక్తులే తప్ప శ్రీశ్రీవి కాదు కదా. “జనానికి మస్కాకొట్టడానికి వాడారా” అంటూ ఆ పదాలకు శబ్దరత్నాకరములో ఉన్న కొన్ని అర్థాలనే ఎత్తిచూపించి వెక్కిరించారు. ఆ పాపం శ్రీశ్రీది కాదు, తెలుగు నిఘంటువులది అని తెలియదా. అర్థాల దుర్బలత్వం ఎరిగిన కవి కనుకనే శ్మశానాల వంటి నిఘంటువులు అన్నాడు. శ్మశానమూ-నిఘంటువూ! ఇలాంటి ఉపమలెన్నో మనకు అలవాటైపోయాయి కాబట్టి బహుశా వాటి పూర్ణభావవిస్ఫోటనం మన చూపుకు అందటం లేదు. “బ్రదుకును ప్రచండభేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం” (కవిత ఒక ప్రచండ భేరుండమై తన రెక్కల కౌగిలింత కింద కవి జీవితాన్ని చుట్టేయడం) అన్న ఒక్క పోలిక చాలదూ అతడ్ని కవిత్వ జ్వరం ఎలా పట్టుకుంటుందో సమర్థంగా చెప్పటానికి? కామాలు వేసుకుంటూ అలవోకగా పేర్చినట్టున్న “అమోఘ, మగాధ, మచింత్య, మమేయం” లాంటి పదాల అర్థాల్ని ఒక్కసారి ఆగి తరచి చూసి వాటిని కవిత్వానికి అన్వయిస్తే కదా వాటి సందర్భశుద్ధి తెలిసేది? “శంఖా రావం, ఢంకా ధ్వానం”, “ఘూకం కేకా, భేకం బాకా” అన్నీ కవిని ఆవహించుకున్న, అతడ్ని పట్టి ఊపుతున్న వాతావరణాన్ని సమర్థంగా పట్టిస్తున్నాయి. ఈ సంపాదకుడు ‘గోగోరా’ పదచిత్రాలకు గుడ్డివాడూ, లయకు చెవిటివాడూ మాత్రమే కాదు – ఉపమ, రూపకం ఇత్యాది కవితాసామాగ్రి పని చేసే తీరు కూడా తెలియని పామరునిగా తోస్తున్నాడు.
ఏ విషయంలోనైనా చులకన సులువు, వత్తాసు కష్టం. ఈ కవితలో ఊకదంపుడు లేకపోలేదు. అవే దృశ్యాలు వేర్వేరు పదాల ముసుగులో మల్టిప్లికేట్ కావటం కొంత ఉంది. కొన్ని పదాలు అర్థాన్ని జత చేయకుండా వట్టి నాదాన్ని మాత్రమే తెచ్చి పేర్చడం ఉంది. అయిననూ…. ఇందాకే చెప్పినట్టు – పంక్తి పంక్తికీ పట్టిక వేసి గుణ నిర్ణయం చేయటం కొన్ని కవితల విషయంలో సబబే. కానీ కొన్ని కవితల్ని వాటి శరీరం మొత్తంలో ప్రసరిస్తోన్న చైతన్యం ఆధారంగా నిర్ణయించాలి. ఈ కవితల గుణం ఒక్కొక్క పదంలోనూ, ఒక్కొక్క పంక్తిలోనూ ఉండదు. వాటి కూడిక కలగజేసే యావద్భావనలో ఉంటుంది.
శ్రీశ్రీ ‘మహాకవి’ బిరుదును అంత తేలిగ్గా కొట్టిపారేయనీయకుండా అడ్డుతగిలే కవితల్లో ఇదొకటి. ఈ కవితకి తిరస్కారపత్రం రాసిన సంపాదకుడు నడిపే పత్రికలోని మిగతా రచనలు ఎలా ఉంటాయోనన్న కుతూహలం మాత్రం నాకు లేదు. పాండిత్యం తప్ప రసికత్వం లేదని పైన ఇన్ని నిరూపణలతో తేలుతున్నందువల్ల ఆ పత్రిక స్థితి కళ్ళకుకడుతోంది. చెళ్ళపిళ్ళ వారు ఒకచోట ‘కవి’ – ‘విమర్శకుల’ గురించి మాట్లాడతారు. కవి తప్పనిసరై రాస్తున్నవాడు. విమర్శకునికి ఆ బలవంతం లేదు. కాబట్టి విమర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తను విసిరే ప్రతి రాయికీ జవాబు చెప్పుకోవాలసి ఉంటుంది. అంతేకాదు, అన్ని విసుర్లలో ఏ ఒక్క విసురు నిర్హేతుకమని తేలినా మొత్తం దాడి అభాసుపాలవుతుంది.
బైబిలులో పాపపంకిలమైన నగరాలు ‘సొడోం అండ్ గొమొరాహ్’ లను నాశనం చేయటానికి వచ్చిన దేవుడ్ని మధ్యలో ఆపి అబ్రహాం అడుగుతాడు: “మొత్తం నగరంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నగరాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావా” అని. దేవుడు వదిలేస్తానంటాడు. “మొత్తం నగరంలో 45 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా” అని అడుగుతాడు అబ్రహం. దేవుడు వదిలేస్తాననే అంటాడు. అబ్రహాం లెక్క తగ్గిస్తూ పోతాడు, దేవుడు చివరకు 10 మంది నీతిమంతులు ఉన్నా వదిలేస్తాననే దాకా వస్తాడు. అక్కడితో అబ్రహాం ఆపేస్తాడు. కానీ నా ఉద్దేశంలో 1 నీతిమంతుడు ఉన్నాడన్నా దేవుడు వదిలేస్తాననే అని ఉండేవాడు.
ప్రణామాలు. ఎంతో దయతో చదివి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఉత్సాహమూ, తపన తప్ప పాండిత్యమూ, ఇతర సమగ్రసాధనాసంపత్తి లేని పరిస్థితి నాది. మీరు ఉటంకించిన రాధాగోవింద బసక్ గారి పుస్తకమూ, ఇతర సమాచారమూ ఇప్పుడే తెలిసింది.
కావ్యమాలాసిరీస్ వారి సేతుబంధంలో అపపాఠాలు అలానే ఉన్నాయి. వాటిని సవరించే ధైర్యం లేకపోయింది. మీరు చూపించిన సవరణలు, స్ఖాలిత్యాలు ఇకపై దిద్దుకుంటాను.
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
01/03/2016 12:02 pm
ఈ సంచికలోని ఈ వ్యాసమూ, తదితర రచనలే కాక ఈమధ్య ఈమాట సంచికల్లో ప్రచురితమవుతున్న మరికొన్ని రచనలూ చదువుతుంటే, భర్తృహరి సుభాషితములలో (తెనుగు అనువాదం ఏనుగు లక్ష్మణ కవి)ఈ పద్యం స్ఫురణకు వచ్చింది.
ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కు భంగుల వివేకభ్రష్ట సంపాతముల్
(గంగానది ప్రధమమున ఆకాశమునుండి ఈశ్వరుని తల మీదను, అచ్చట నుండి హిమవత్పర్వతము మీదను, ఆ పర్వతము నుండి భూమి మీదను, భూమి నుండి సముద్రమునకును, అచ్చట నుండి పాతాళమునకు వచ్చెను. గొప్పస్థితి నుండి తొలిగినవారికి ఇదేవిధముగ పలు విధములుగు పాట్లు సంభవించును.)
ఈమాటకి ముందుముందు మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ,
విష్ణుభొట్ల లక్ష్మన్న
అజంతా రెండు కవితలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/03/2016 11:45 am
అజంతా తో ఆకాశవాణిలో “సజీవ స్వరాలు” శీర్షికన ప్రసారమయిన కార్యక్రమం ఇక్కడ:
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
01/03/2016 9:06 am
“మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి” అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక సారి. దానికి వారు “ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్రుసిక్త నేత్రులు కావడం” అని అన్నారట.
20వ శతాబ్దిలో తెలుగు సాహిత్య గమనాన్ని మార్చివేసిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితను భారతి పత్రిక తిరస్కరించింది! ప్రమాదో ధీమతామపి. తరువాత భారతి తన తప్పిదాన్ని ఒప్పుకొని, “కవితా, ఓ కవితా” ప్రచురించింది. ఇటువంటి తిరస్కారలేఖలు అందుకున్న ప్రముఖ రచనలెన్నో. ప్రముఖ ఆంగ్ల రచనలను మొదట తిరస్కరించిన సంపాదకుల వ్యాఖ్యలకు కొన్ని ఉదాహరణలు:
“I recommend that it be buried under a stone for a thousand years.” — an editor about Vladimir Nabokov’s Lolita.
“Nobody will want to read a book about a seagull.” on Richard Bach‘s Jonathan Livingston Seagull
“The girl doesn’t, it seems to me, have a special perception or feeling which would lift that book above the ‘curiosity’ level.” — about The Diary of Anne Frank .
“Too radical of a departure from traditional juvenile literature.” on Frank Baum’s The Wonderful Wizard of Oz.
“An endless nightmare. I think the verdict would be ‘Oh don’t read that horrid book.” on H. G. Wells’ The War of The Worlds
“An absurd story as romance, melodrama or record of New York high life.” on Fitzgerald’s The Great Gatsby
“I haven’t the foggiest idea about what the man is trying to say. Apparently the author intends it to be funny.” on Heller’s Catch-22
“We are not interested in science fiction which deals with negative utopias. They do not sell.” on Stephen King’s Carrie. This book apparently sold 1 million copies in the first year alone.
“I rack my brains why a chap should need thirty pages to describe how he turns over in bed before going to sleep.” French editor comments rejecting Remembrance of Things Pasts by Marcel Proust.
“This author is beyond psychiatric help. Do not publish.” Publisher rejects Crash by J.G. Ballard.
Robert M. Pirsig‘s Zen & the Art of Motorcycle Maintenance is in the Guinness Book Of Records for 121 rejections, more than any other best-seller.
రాంగ్ నంబర్! గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
01/03/2016 2:04 am
తీర్చలేని బాధ అది. మనసులో మాట బయటకు చెప్పుకోలేరు అంత తొందరగా. అందుకే కథలో తెలిసినంత బాగా (చెప్పి చెప్పకుండా చెప్పినా) నిజజీవితంలో చూస్తున్నా కూడా తెలియదు.
సాహిత్యంలో వేశ్యా వృత్తి గురించి పి.మోహన్ అభిప్రాయం:
01/02/2016 7:02 pm
కళ్యాణిగారూ ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యంలో వేశ్యల జీవితచిత్రణ గురించి చాలా ఆలోచనాత్మకంగా, స్పష్టంగా, చెప్పారు. విశ్లేషణ బాధితులవైపు నుంచి సాగడంతో వాళ్ల గొంతుక బలంగా వినిపించింది. మీరు ప్రస్తావించిన రచన్లో కన్యాశుల్కం, అంధకారంలో వంటి ప్రముఖ రచనలు తప్ప చాలా వాటిని చదవలేదు. కొకువి మళ్లీ చదవాలి. పెద్దిభొట్ల సతీసావిత్ర కథను తప్పక చదువుతాను. పరిచయమే పొగిలే దుఖం తెప్పించింది.
మీ వ్యాసంతో కొన్ని సందేహాలు తీరాయి. సెక్స్ వర్కర్లు వాళ్ల మానాన వాళ్లు బతికితే ఎవరికేం నష్టమ అని నాలోనూ ఒక సందిగ్ధ రాజీ ఉండేది, ఈ సబ్జెక్టుపై లోతుగా ఆలోచించకపోవడం వల్ల. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ పురాతన వ్రుత్తి ఏదో ఇష్టంతో తీసుకున్నది కాదు. దాన్ని కొనసాగించాలనే అధర్మవడ్డీ వాదులు నాకు తెలిసి గతంలో కంటే ఎక్కువయ్యారు. ప్రగతివాదులం అని చెప్పేవాళ్లూ ఉన్నారు వీళ్లలో. వేశ్యా వ్యవస్థకు మూలమైన పరిస్థితులను మార్చకుండా ఆ వ్యవస్థను తీసేయలేమని చక్కగా విశ్లేషించారు.
డబ్బు కేవలం దానంతట అదే త్రుప్తి నివ్వదు. సుఖాలు కోరుతుంది. దాంట్లోంచి మొదలవుతాయి జాడ్యాలు. ధనవంతులకు సుఖం, పేదలకు దుఖం.
ఈ వ్యాసంలో మీరు ముఖ్యమైన చాలా రచనలకు కవర్ చేశారు. విస్త్రుతి పెరడగం వల్ల కొన్ని లేకపోవచ్చు. సీమవైపు కొన్ని మంచికథలు వచ్చాయి. చక్రవేణు కువైట్ సావిత్రమ్మ, నిర్మలారాణి గాజు కళ్లు వంటివి. మీకు దొరికి ఉండకపోవచ్చు. కరువుపీడిత కడప, అనంతపురం జిల్లాల్లో ఈ అభాగినులు ఎక్కువ. పైగా దేశంకాని దేశంలో హింస. ఇదో కొత్తకోణం. మన సమాజానికి పతనానికి ఎన్ని ముఖాలో…
ఈ వ్యాసం చాలా ఆలోచనలు రేకిత్తించింది. నా అభిమాన భావవిప్లవకారుడు వోల్టేర్ తన కాండీడ్లో ఈ వ్రుత్తిలోని బీభత్సాన్ని చూపాడు. కన్యాశుల్కం, కాండీడ్ లో చాలా పోలికలు ఉన్నాయి. ఈ నవల్లోని ఇలాంటి విధివంచితలు కథనాయిక క్యూనెగొండ్ సహా ముగ్గురు వున్నారు. పకెట్ అనే దాసి కథానాయకుడైన కాండీడ్తో ఏం చెబుతోందో చదవండి.
‘నా యజమానులకు, ఆ ముచ్చటైన క్యూనెగొండ్ చిన్నమ్మకు జరిగిన దారుణాల గురించి విన్నాను. అయితే నా పరిస్థితి అంతకంటే దారుణం. నేనప్పుడు చిన్నప్పుడు అమాయకురాలి కదా, అందుకే మన గురువు ననుశీ సులభంగా బుట్టలో వేసుకుని పాడు చేశాడు. మిమ్మల్ని అయ్యాగారు చావుదెబ్బలు కొట్టి తరిమేశాక నేనూ బలవంతంగా ఇంట్లోంచి బయటపడాల్సి వచ్చింది. ఓ పెద్ద వైద్యుడు నాపై జాలిపడకుండా ఉన్నట్లయితే నేనప్పుడే చచ్చిపోయేదాన్ని. ప్రాణాలు పోశాడనే కృతజ్ఞతతో కొన్నాళ్లు ఆయనతో గడపాల్సి వచ్చింది. అయితే ఆయన కఁళ్లుబోతు పెళ్లాం నన్ను రోజూ చావగొట్టి చంపేది. అబ్బ! ఎంత గయ్యాళిగంప! ఆ వైద్యుడు కురూపి. అతనిపై ప్రేమ లేకపోయినా, కృతజ్ఞతతో పడుండి అతని పెళ్లాంతో తన్ను తింటూ ఉండేదాన్ని. ఆ రాక్షసిముండ పీడ భరించలేక అతడు ఓ రోజు ఆమెకు చలిజ్వరానికి మందు వేశాడు. అది బాగా పనిచేసి రెండుగంటలు తిరక్కముందే ఆమె నరకయాతన అనుభవించి చచ్చిపోయింది. ఆమె బంధువులు అతనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడు పారిపోయాడు. అతనికి బదులు నన్ను ఖైదు చేశారు. అయ్యా! నేను గనుక కాస్త అందంగా లేకపోయినట్లయితే నా అమాయకత్వం నన్ను ఏమాత్రం కాపాడేది కాదు. వైద్యుడి స్థానాన్ని తాను తీసుకునే షరతుపై న్యాయమూర్తి నన్ను విడుదల చేయించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత మరొకామెను చేరదీసి నన్ను వెళ్లగొట్టాడు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వీధిలో పడ్డాను. అప్పటినుంచి ఈ కంపరం పుట్టించే బతుకు బతుకుతున్నాను. అయ్యా! మీ మగవాళ్లకు ఇందులో ఏదో మజా ఉందఁపించవచ్చు కానీ మాకు మాత్రం యమకూపమే. ఈ దరిద్రపు బతుకు బతకడానికే వెనిస్ వచ్చాను. పడుపుగత్తె బతుకు ఎంత దారుణవెూ మీకు తెలుసకుంటా. కాళ్లు కాటికి చాపుకున్న ముసలి వ్యాపారి, న్యాయవాది, సన్యాసి, సరంగు, ఇలా ప్రతి అడ్డమైన వాడిమీదా ఒకే రకంగా ప్రేమ ఒలకబోయాలి. లెక్కలేనన్ని బాధలు, అవమానాలు పడాలి. తరచూ లంగాను అరువు తెచ్చుకోవాలి… మధ్యలో న్యాయాధికారుల, రక్షకభటుల వేధింపులు, దందాలు షరా మామూలే. చివరకు దుర్భరమైన ముసలితనం, తర్వాత శరణాలయాల్లో, చస్తే ఏ పెంటకుప్పలోనో తేలడం.. లోకంలో నాకంటే దౌర్భాగ్యురాలు లేదు బాబూ..’
పకెట్ గొంతులో మధురవాణి, శేషాచలాలు వినిపించడం లేదూ..
మీ వ్యాసం చదుతోంటే నాకు మహానది, సలాం బాంబే వంటి సినిమాలు, జోనా నానా, యమకూపం వంటివెన్నో గుర్తుకొస్తున్నాయి… మళ్లీ చదవాలి ఈ వ్యాసాన్ని.. మీరు ఇలాంటి మరెన్నో రాయాలని కోరుతూ…
పి.మోహన్
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి మోహన అభిప్రాయం:
01/02/2016 10:57 am
Dear editor,
The new year has begun with a spate of pseudonyms and anonymous names, as far as this journal is concerned. I am amazed at the creativity of the human mind. While LoL, ROFL are just acronyms to describe situations, this is more than all those. While the old year had names like aSmAchaM, the new year has gOgOrA. It looks even like a song
go go raa
go go raa
let us all
go go raa
gOmgUrA
go go raa
Where are the tunesmiths?
Not to be outdone, even the commentators turned to very interesting names! kaTakaTA reminds me of the song in the age old gramaphone drama set records like anasUya.
కటా యెటుల్ భరింతు ని ఘోర పాప బాధ !
Then we have another one kEkE. I am immediately reminded of
కాకీక కాకికేకాక కేకికా,
కేకేకే !
I am waiting for the next comment on this parody-cum-essay-cum-story-cum-sketch-cum-fill-in-the-blanks.
Yes, I am real, still explaining the glories of ఛందస్సు which kEkE does not seem to be very fond of.
J K Mohana Rao
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/02/2016 10:42 am
ఇప్పుడే జనవరి సంచిక చూడటం మొదలుపెట్టాను. సంచిక మొదటిలోనే నాకు బాగా తెలిసిన పాత పుస్తకం పేరు చూడగానే మీ పుస్తక పరిచయం చదివాను. ముందుగా ఈ పుస్తకం (1966లో ప్రచురించబడింది) చాలా కాలంగా DLIలో ఉంది. గత 20 ఏళ్లలో నన్నీపుస్తకం గురించి ముగ్గురు, నలుగురు అడిగారు. గమ్మత్తేమంటే అడిగిన వారందరూ దీనితో పాటు తెన్నేటి కోదండరామయ్య రాసిన “మాబడి” (1950) అనే పుస్తకం గురించి అడగటం, పైగా అందరూ తూర్పు గోదావరి జిల్లా వాళ్లే కావడం! 🙂
ఇంక పుస్తకం విషయానికొస్తే నాకు గొప్పగా అనిపించలేదు. ఆమాటకొస్తే తెలుగులో చెప్పుకోదగ్గ యాత్రా చరిత్రలేమీ (travellogues) రాలేదు – ఏనుగుల “కాశీయాత్రా చరిత్ర”, కోలా శేషాచలకవి “నీలగిరి యాత్ర” లను మినహాయిస్తే. (ఈ విషయంపైన ఆసక్తి ఉన్నవారు మచ్చా హరిదాసుగారి సిద్ధాంత గ్రంథం చూడవచ్చు.)
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కేశవరం కేశవులు అభిప్రాయం:
01/02/2016 10:03 am
క్రింద కామెంట్లలో సంపాదకులు రాసిన మాటలు చూడకనే ఈ రచన చదివాను. Haughty prima donna లకి ఉండే iconoclastic దురుసుతనం అనిపించింది. శ్రీశ్రీ మీద రాళ్ళురువ్వాలన్న దుగ్ధ కనిపించింది. “నేనొక దుర్గం” అన్నంత మాత్రాన రాళ్ళురువ్వకూడదనేం లేదు గాని, ఇదే సంచికలో ఇలాంటి రచనలు (ఇస్మాయిల్ కవిత్వం మీద ఒక ఎన్నారై కుర్రాడు పాల్పడిన బాడ్ టేస్టు తో సహా కలుపుకుని) రెండు ఉండటం చూస్తే ఇది ప్రత్యేకించి ఈమాట లాంటి ఎన్నారై పత్రికకే అబ్బుతున్న అలవాటుగా తోస్తోంది. రచయితల ప్రవాసం సాహిత్యానికి మంచి చేస్తుందంటారు. దాంతె నుంచి జాయ్స్ దాకా ప్రవాసం వల్ల వారి భాషల సాహిత్యానికి మంచి జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన తెలుగు రచయితల ప్రవాసం తెలుగు సాహిత్యానికి ఏ చేర్పూ చేయకుండా ఇలా పాతవాసనలతో, పాండిత్యప్రకర్షతో కుంగిపోతోందేమా అని బాధ కలుగుతోంది. దూరం వల్ల మాతృభూమి అంతఃసారం ప్రబలంగా బోధపడుతుంది అంటారే. మరి తెలుగు ఎన్నారైలకు వారి దూరం మన తెలుగుతనపు సారాన్ని అవగతం చేసి పెట్టాలి కదా. ఇప్పటి తెలుగునేల పరిస్థితి పట్ల పదునైన పరిశీలనలు రావాలి కదా. దాని పట్ల వ్యంగ్యమో, వేదనో, కరుణో, కోపమో, కనీసం నైరాశ్యమో ఏదో ఒకటి బయటపడాలి కదా. కానీ ఇక్కడి నూతులు చాలవన్నట్టు అక్కడికి వెళ్ళి కొత్త నూతులు తవ్వుకుంటూ, వినపడని మాతృభాష మీద సహజంగా కలిగే నేలబారు మమకారంతో “తెలుగు భాషో! పాత సాహిత్యమో! ఛందస్సులో! పద్యాలో!” అంటూ ఇంకా పాతనే పట్టుకు వేలాడటం చూస్తే ఆశ చల్లారుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా తెలుగు ప్రవాసం నికరంగా మిగిలే ఒక్క రచయితనీ పుట్టించలేకపోవడం చూస్తే ప్రవాసం మంచి చేయటమన్న సిద్ధాంతం తెలుగువారికి నప్పదేమో అనిపిస్తోంది. ఎందుకు నప్పదా అని ఆలోచిస్తే ఒకటి తోస్తోంది: దాంతే, జాయ్స్ లాంటి వాళ్ళకు ప్రవాసమనేది రాజకీయ, తాత్త్విక, వైయక్తిక సంఘర్షణల ఫలితం; కానీ తెలుగు ఎన్నారైలకు మాత్రం అది మామూలు మధ్యతరగతి ఆకాంక్షల ఫలితం. అదలా ఉంచుదాం. పై రచన చదివిన తర్వాత క్రింద కామెంట్లలో ‘ఇది కథే’ అన్న సంపాదకుల వ్యాఖ్యానం చూస్తే – శ్రీశ్రీ మీద రాళ్ళు రువ్వటానికి అసలు ఒక సందర్భమూ, అవసరమూ కనపడక ఈ వేషము ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. అది పిరికి వేషము అనిపించటానికి కారణం ఏమంటే – ఈ గోపాలుని గోవిందరావు ఒక కల్పిత పాత్ర కాబట్టి అతని మాటలకు ఏ జవాబు చెప్పినా అది కేరక్టర్ బేస్డ్ క్రిటిసిజం అయి కూర్చుంటుంది. కానీ శ్రీశ్రీ నిజం మనిషే కాబట్టి ఈ కాస్తా రాయాలనిపిస్తోంది. ఆయన నా అభిమాన రచయితేం కాదు, ‘కవితా ఓ కవితా’ లో పౌనఃపున్య దోషం హెచ్చు, కానీ ఆస్వాదించేందుకు అంతకుమించిన గుణాలూ ఎన్నో ఉన్నాయి.
ఈ గోగోరా అనే “పాత్ర” ఈ ఉత్తరం సూచిస్తున్న కాలానికి చెందిన సంపాదకునిలా లేడు. నేటి కాలపు pedantic అంతర్జాల తెలుగుపత్రికలు కొన్నింటికి సంపాదకుని వలె ఉన్నాడు (శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ ను తిరస్కరించగలిగేంతటి గొప్ప కంటెంటును అవి అన్యథా ఇవ్వటం లేదన్నది అప్రస్తుతమే అయినా ప్రస్తావనార్హం). ఈ ఉత్తరంలో, “కేవలం సంస్కృతంలో రాసి పారేసే జనం పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్నారు” అన్నది ఒక anachronistic వాక్యం. ఎందుకంటే 1937 లో రాసిన ఉత్తరంలో ఒక సంపాదకుడు అలా వాపోతున్నాడూ అనటానికి అంతకుముందేమన్నా సంస్కృత ఛాయలు లేని అచ్చతెలుగు కవిత్వ సంప్రదాయం డామినేట్ చేస్తూ వచ్చిందా? ఆదికవి ఆదిగా దాదాపు అంతా కలగాపులగం బాటే కదా. కాబట్టి సంపాదకుని ఆ అభ్యంతరంలో కథాపరమైన ఔచిత్యం లేదు. అంతేకాదు, ఈ కాలపు ఇంగ్లీషు వర్డుకౌంటు సాఫ్టువేర్ల స్పృహ లేనివాడే అయితే సంధుల కూడికతోనే పదాల లెక్క చెప్తాడు తప్ప, మళ్ళీ సంధులు విడదీస్తే పెరిగే పదాల గురించి ఆలోచించడు. “లోహశ్యేనం”, “ఫిరంగిజ్వరం” వంటి పదాలు ఇస్తున్న అపూర్వ భావచిత్ర సాక్షాత్కారాలకు గుడ్డివాడై అర్థాలు అడుగుతున్న తీరు చూస్తే ఈ గోగోరా కవిత్వంలో పదాల juxtaposition పట్ల కనీస అవగాహన లేనివాడనిపిస్తుంది. అలాగే కొద్దిగా tone deaf కూడా. అలాంటి పాత్రను ఒక సాహిత్య పత్రికకు, అందులోనూ కవిత్వ విభాగానికి సంపాదకుడిగా చూపటం నప్పలేదు. అసలు ఈ కథే వాడి స్థాయిని వెక్కిరించటానికి ఐతే తప్ప.
“బిగుతైన పద్యం”, “ఓ పదం వేయలేని తీయలేని పద్యం” అన్నవి ఆధునిక భావనలు. కాలగమనంలో వచ్చే ప్రతి మార్పూ అభివృద్ధే అన్నది ఒక భ్రమ. వర్తమానం అంతిమం కాదు. చరిత్ర చక్రరూపం. హోమర్ బిగుతైన కవి కాబట్టి అలరిస్తున్నాడా, రామాయణం ఓ పదం వేయలేని తీయలేని కావ్యం కాబట్టి రమణీయమా? కాదు, “నానృషిః కురుతే కావ్యం” కాబట్టి అవి గొప్పవి. మన జైసేకే తైసే సీజనల్ కవులు వందమందికి “పునరుక్తి”, “దుష్టసమాసం”, “ప్రాసానుప్రాసల” గురించి పాఠాలు చెప్పవచ్చు. కానీ ఋషులకు, ఋషిత్వం నుంచి వలికిన కవితలకూ పాఠాలు చెప్తామా. ఈ కవిత చెప్తున్న కవి – తెలుగు విప్లవరాజకీయాల అంటురోగంతో యోగభ్రష్టుడైన శ్రీశ్రీ కాదు; గుహ వంటి కుటిలో చీకటిలో చిరదీక్షా తపస్సమీక్షణలో స్రుక్కిన శ్రీశ్రీ. అనుభవ తీక్ష్ణతకు తాళ లేక కవిత పొంగినపుడు దానికి లావా లాంటి వేడీ వెలుతురూ ఉంటాయి. దాని దగ్గరకు మూసలు తీసుకుని వెళ్ళటం అమాయకత్వం. మూసలు కమ్మరికొలిమి దగ్గర పనికొస్తాయి, అగ్నిపర్వతాల దగ్గర కాదు.
వర్డుకౌంటు ద్వారా ఈ ‘గోగోరా’నే పసిగట్టినట్టు ‘కవితా ఓ కవితా’లో ఉన్న నాలుగువందల పైచిలుగు పదాల్లో “పేశలము, శ్యేనము, ఘూకం, భేకం, సర్పం, భేరుండము..” లాంటి ఆరేడు మాత్రమే జంతు సంబంధమైన పోలికలు ఉన్నవి. రోచిర్నివహాలు, ఝంఝూ ప్రభంజనాలు, చేలాంచలాలూ, కుసుమపరాగాలు, రథాలూ, వజ్రాలు, ఫిరంగులూ, మృదంగాలూ, తాగుబోతులూ, పడుపుకత్తెలూ, శిశువులూ, శస్త్రకారులూ, సమ్మెకూలీలు, ఉరితీయబడ్డ శిరస్సులూ ఇలా భూమి నుంచి అంతరిక్షం దాకా లెక్కలేనన్ని ఉపమానాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ గోగోరా కి కేవలం జంతుసంబంధమైన పోలికలే కనపడుతున్నాయంటే… అవి అతని ఆసక్తులే తప్ప శ్రీశ్రీవి కాదు కదా. “జనానికి మస్కాకొట్టడానికి వాడారా” అంటూ ఆ పదాలకు శబ్దరత్నాకరములో ఉన్న కొన్ని అర్థాలనే ఎత్తిచూపించి వెక్కిరించారు. ఆ పాపం శ్రీశ్రీది కాదు, తెలుగు నిఘంటువులది అని తెలియదా. అర్థాల దుర్బలత్వం ఎరిగిన కవి కనుకనే శ్మశానాల వంటి నిఘంటువులు అన్నాడు. శ్మశానమూ-నిఘంటువూ! ఇలాంటి ఉపమలెన్నో మనకు అలవాటైపోయాయి కాబట్టి బహుశా వాటి పూర్ణభావవిస్ఫోటనం మన చూపుకు అందటం లేదు. “బ్రదుకును ప్రచండభేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం” (కవిత ఒక ప్రచండ భేరుండమై తన రెక్కల కౌగిలింత కింద కవి జీవితాన్ని చుట్టేయడం) అన్న ఒక్క పోలిక చాలదూ అతడ్ని కవిత్వ జ్వరం ఎలా పట్టుకుంటుందో సమర్థంగా చెప్పటానికి? కామాలు వేసుకుంటూ అలవోకగా పేర్చినట్టున్న “అమోఘ, మగాధ, మచింత్య, మమేయం” లాంటి పదాల అర్థాల్ని ఒక్కసారి ఆగి తరచి చూసి వాటిని కవిత్వానికి అన్వయిస్తే కదా వాటి సందర్భశుద్ధి తెలిసేది? “శంఖా రావం, ఢంకా ధ్వానం”, “ఘూకం కేకా, భేకం బాకా” అన్నీ కవిని ఆవహించుకున్న, అతడ్ని పట్టి ఊపుతున్న వాతావరణాన్ని సమర్థంగా పట్టిస్తున్నాయి. ఈ సంపాదకుడు ‘గోగోరా’ పదచిత్రాలకు గుడ్డివాడూ, లయకు చెవిటివాడూ మాత్రమే కాదు – ఉపమ, రూపకం ఇత్యాది కవితాసామాగ్రి పని చేసే తీరు కూడా తెలియని పామరునిగా తోస్తున్నాడు.
ఏ విషయంలోనైనా చులకన సులువు, వత్తాసు కష్టం. ఈ కవితలో ఊకదంపుడు లేకపోలేదు. అవే దృశ్యాలు వేర్వేరు పదాల ముసుగులో మల్టిప్లికేట్ కావటం కొంత ఉంది. కొన్ని పదాలు అర్థాన్ని జత చేయకుండా వట్టి నాదాన్ని మాత్రమే తెచ్చి పేర్చడం ఉంది. అయిననూ…. ఇందాకే చెప్పినట్టు – పంక్తి పంక్తికీ పట్టిక వేసి గుణ నిర్ణయం చేయటం కొన్ని కవితల విషయంలో సబబే. కానీ కొన్ని కవితల్ని వాటి శరీరం మొత్తంలో ప్రసరిస్తోన్న చైతన్యం ఆధారంగా నిర్ణయించాలి. ఈ కవితల గుణం ఒక్కొక్క పదంలోనూ, ఒక్కొక్క పంక్తిలోనూ ఉండదు. వాటి కూడిక కలగజేసే యావద్భావనలో ఉంటుంది.
శ్రీశ్రీ ‘మహాకవి’ బిరుదును అంత తేలిగ్గా కొట్టిపారేయనీయకుండా అడ్డుతగిలే కవితల్లో ఇదొకటి. ఈ కవితకి తిరస్కారపత్రం రాసిన సంపాదకుడు నడిపే పత్రికలోని మిగతా రచనలు ఎలా ఉంటాయోనన్న కుతూహలం మాత్రం నాకు లేదు. పాండిత్యం తప్ప రసికత్వం లేదని పైన ఇన్ని నిరూపణలతో తేలుతున్నందువల్ల ఆ పత్రిక స్థితి కళ్ళకుకడుతోంది. చెళ్ళపిళ్ళ వారు ఒకచోట ‘కవి’ – ‘విమర్శకుల’ గురించి మాట్లాడతారు. కవి తప్పనిసరై రాస్తున్నవాడు. విమర్శకునికి ఆ బలవంతం లేదు. కాబట్టి విమర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తను విసిరే ప్రతి రాయికీ జవాబు చెప్పుకోవాలసి ఉంటుంది. అంతేకాదు, అన్ని విసుర్లలో ఏ ఒక్క విసురు నిర్హేతుకమని తేలినా మొత్తం దాడి అభాసుపాలవుతుంది.
బైబిలులో పాపపంకిలమైన నగరాలు ‘సొడోం అండ్ గొమొరాహ్’ లను నాశనం చేయటానికి వచ్చిన దేవుడ్ని మధ్యలో ఆపి అబ్రహాం అడుగుతాడు: “మొత్తం నగరంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నగరాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావా” అని. దేవుడు వదిలేస్తానంటాడు. “మొత్తం నగరంలో 45 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా” అని అడుగుతాడు అబ్రహం. దేవుడు వదిలేస్తాననే అంటాడు. అబ్రహాం లెక్క తగ్గిస్తూ పోతాడు, దేవుడు చివరకు 10 మంది నీతిమంతులు ఉన్నా వదిలేస్తాననే దాకా వస్తాడు. అక్కడితో అబ్రహాం ఆపేస్తాడు. కానీ నా ఉద్దేశంలో 1 నీతిమంతుడు ఉన్నాడన్నా దేవుడు వదిలేస్తాననే అని ఉండేవాడు.
రాంగ్ నంబర్! గురించి Venkat Suresh అభిప్రాయం:
01/02/2016 4:17 am
చాలా బాగుంది మీ అనువాధం. ముగింపు చదివాక బాధగా అయిపొయింది మనసు.
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము గురించి రవి అభిప్రాయం:
01/01/2016 10:33 pm
మాన్యులు మురళీధరరావు గారికి,
ప్రణామాలు. ఎంతో దయతో చదివి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఉత్సాహమూ, తపన తప్ప పాండిత్యమూ, ఇతర సమగ్రసాధనాసంపత్తి లేని పరిస్థితి నాది. మీరు ఉటంకించిన రాధాగోవింద బసక్ గారి పుస్తకమూ, ఇతర సమాచారమూ ఇప్పుడే తెలిసింది.
కావ్యమాలాసిరీస్ వారి సేతుబంధంలో అపపాఠాలు అలానే ఉన్నాయి. వాటిని సవరించే ధైర్యం లేకపోయింది. మీరు చూపించిన సవరణలు, స్ఖాలిత్యాలు ఇకపై దిద్దుకుంటాను.
జిజ్ఞాసువు,
రవి.