పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/21/2016 9:36 am

    ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారూ, మీరు సాయంచేసి చూపిన దారిలో Universal Digital Library నుండి కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం సంపాదించి దాని ప్రింటు కాపీని నాగపూర్లో ఉంటున్న మీ మిత్రులు (త్రిపుర గారికాప్తమిత్రులు) శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారికి చేరవేస్తే అందుకుని వారెంతో సంతోషించారు. కురుమెళ్ళ వెంకట్రావు గారి ఉత్తరాలు అందుకున్న పెమ్మరాజు వెంకట్రావు గారి మనుమడు (యీ వ్యాస రచయిత ) రిషీవ్యాలీ పిడూరి రాజశేఖర్ గారితో కూడా ముచ్చడించారు. యీ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన కాకినాడ వాస్థవ్యులు, అడ్వకేటు శ్రీ M.V. Saastry గారితో తనకున్న చిరు పరిచయాన్ని కూడా భజరా గారు తలపోసుకున్నారు.

    “మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం తిరిగి ఏదైనా పెద్ద సంస్థ ద్వారా పునర్ముద్రణ పొందేలా చెయ్యాలనీ ప్రయత్నిస్తున్నాము.

    మీరన్నట్లే గమ్మత్తుగా భమిడిపాటి జగన్నాథరావు గారు కూడా తెన్నేటి కోదండరామయ్య గారు రాసిన “మాబడి” (1950) పుస్తకం గురించి అడిగారు (భజరా గారూ తూర్పు గోదావరి జిల్లా వారే అనుకుంటా). నాలుగొందలు లేదా ఐదొందలు పేజీలుండే యీ “మాబడి” పుస్తకం చాలా బాగుంటుంది ఎలాగైనా సంపాదించమని, మిమ్మల్ని, మనసు రాయుడు గారు, శ్యామనారాయణ గార్లను అభ్యర్ధించమని చెప్పారు. ఆపై మీ దయ, మా ప్రాప్తమూ.

  2. నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    01/21/2016 12:30 am

    మికిమోటో ముత్యాల్లాంటివి, మూడు పద్యాలున్నూ! పద్యాలు ఎన్నుకోటంలో మీకు మేరే సాటి. అయితే మీ ఏరికలో ఒక ప్రమాదం లేకపోలేదు; హరివంశం తిరగతోడటానికి ఆపుస్తకం మనవాళ్ళల్లో ఎంతమందిదగ్గిర ఉంటుందంటారు చెప్పండి?

    నాకు తెలుసు. ఎవరో ఒకరు గూగ్లీకరించి చెప్పేస్తారు, ఈ పుస్తకం అంతర్జాలంలో దమ్మిడీ ఖర్చు పెట్టకుండా ఎల్లా కబ్జా చేసుకోవచ్చో! ఏదయితేనేం లెండి. హరివంశం చదవడానికి ప్రేరణ మీరెన్నిక చేసిన మెరికెలు!

    అయినా మీకు ఇంత తెలుగు పక్షపాతం ఎందుకబ్బా? బాలకిష్టుడి చేష్టలకి పోతన, ఎర్రన లేనా? ఎంత అన్యాయం!

    లీలాశుకుడి శ్రీ కృష్ణ కర్ణామృతంలో పద్యాలు లేవూ! చిన్ని క్రిష్ణుడి పోకిరి చేష్టలు సమర్ధిస్తూ! అవునులెండి; అవి పజ్జాలు కాదు, శ్లోకాలు, దేవభాషలోవి కూడానూ! కాని, తెలుగు వాళ్ళకి పోతన తరువాత, బిళ్వమంగళుడి కర్ణామృతమే బాగా తెలిసిన పుస్తకం, అని మా మేనమామ అనేవాడు. అని మాకు నూరి పోసాడు.

    కృష్ణే నాంబ!…
    రామో నామ భభూవ…
    కస్త్యం బాల? బలానుజః … ఎట్సెట్రా ఎట్సెట్రా

    పోతనతో పాటు ఇవ్వీ కంఠతా పట్టించే వాడు మా మేనమావ ! ఈ వయసులో హరివంశం పద్యాలు కంఠతా పట్టటం కొంచెం కష్టమే సార్‌!

    కీపిటప్‌

    వేలూరి వేంకటేశ్వర రావు

  3. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/21/2016 12:14 am

    తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచిక
    http://eemaata.com/em/category/issues/201001

  4. మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    01/20/2016 8:48 am

    Not that these trivia are unknown to Sri Paruchuri Sreenivas.

    “Kreedabhiaramamu”could be essentially a travelogue in a crude format. Jean Baptiste Tavernier’s French volume {translated by British civil servant Valentine Ball]”Travels in India” extensively describes the living conditions and modes of transport available in the late seventeenth century in Telugu speaking areas. It mentions different topographical details of places such as Kolluru, Gandikota, Bezawada, Nidomolu, Malla volu, Masulipatam, albeit, resorting to French syllabic spelling. “Enugula Veera Swamaiah Gari Kashi Yatra Charitra “was first published in 1838. Veeraswamayya travelled with an entourage of relatives, helpers for odd jobs, security guards, cooks and load bearers. His group travelled by taking the western route touching Tirupathi, Kakapo, Srishialam, Bellary, Hyderabad and Nirmal in its onward journey to Kashi. He reached Calcutta from Kashi by boat.

    In hi return journey Veraswamayya travelled by the Coramandel route, crossing the Telugu areas touching Cuttack,Ganjam, Rajahmundry , hugging close to a path which later turned into N H5. He deviated from it near Eluru and took to ,what is now called 214A.Crossing the River Krishna at Kokkiligadda[ mentioned as Kottapalem] in Divi Taluk .He resumed the present NH5 near Ongole for the rest of the journey up to Madras.

    This long journey took more than one year and three months [ May 18, 1830 to #rd September1831] . For transportation different modes , including boat, bullock carts, horses, load bearing oxen were used. Luggage and tent equipment were loaded onto carts. Women folk might have occasionally ridden the wagons. Most of the journey , men and servants followed on foot. Rarely palanquins were employed.Tavernier remarked that wheeled carriages could not be used in Telugu areas. Veeraswamayya testifies to the changes that had taken place to the tracks in the intervening 220 years. By 1830 there were some tracks that could be used by wheeled wagons.

    Veeraswamayya gives various details as to the terrain, social , economic, climatic conditions of the areas he camps at. His keen eye for detail and his exhaustive awareness of different disciplines are above the reach of a normal company servant, who happens to be an” interpreter in Madras supreme Court “The narration is carried in a colloquial Telugu, interspersed with a lot of deformed foreign terms. Any way, the narration should attract a lot of interest in terms of social sconce , economic history, history of transport, lexicography, historical linguistics, Syntax evolution, dialectology, customary practices of scripting and general grammar, especially in regard to changes that took place in using different prepositions. Kola SeshachalaKavi’s “NeelagiriYatra” is a compilation in prose of his exp[eminences in his journey to Ooty.Seshachalam was an assistant with the office of the governor. As part of the summer camp of the governor{ Field Marshal Tweedon ?}, Seshachalam recorded his journey, that was started on 16th May !846.

    As to the twentieth century , it is said, Jonnalagadda Satyanarana’s work, “Naa Maharashtra Yatra” is in existence. We hear of Chellapilla Venkata Shastri making a journey to Kashi and recoding his experinecs.[1958 or 1959] The other works that find a mention are Mallapalli Someshekhara Sharma’s”Naa Nelluru Mandala Yatra’, K.V Subbayya’s”NavaBharatha Sandarshanam” , N.Venkata Ramanayya’s “ Uttara Desha Tatra”Nayani Krishna Kumari’s”Kashmeera Deepa KaLika” and Jonnagadda Lakshinarayana’s”HmpiVihara Yatra” Not Much is known about these books. I request Sri Paruchuri Sreenivas to clarify if the thesis has been available in print.

  5. మనుషులపై మదుపు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    01/20/2016 5:38 am

    నేనిదే అభిప్రాయం వెల్లడించాను ఒకసారి స్నేహితులతో. ఇల్లు వదిలి ఉద్యోగాలు చేయని ఆడవారి జీవితం వ్యర్థం అని భావించేవారిది అమాయకత్వం. నన్ను ముట్టుకోకు నామాల కాకి అని ఏదో సామెతలా ఉండకుండా; ప్రసవాలు, శుభకార్యాల్లో సహాయాలు చేసినవారికి తమ యింటికి అవసరమైనప్పుడు ఆ అనుభవం తప్పక సహాయపడుతుంది. డబ్బులకోసం పని చేయడమే జీవితానికి సార్థకత అనుకోరాదు అని, బద్ధకస్తులు కాకుండా ఉంటే చాలు అని అన్నాను. అదే మాట ఇక్కడ కథలో నిరూపించబడింది. మంచి కథను అనువదించారు. అభినందనలు.

  6. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/19/2016 8:31 am

    శర్మ దంతుర్తి గారూ,

    పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతను ఆశ్వాదించే శక్తి గల మీరు శ్రీశ్రీని, ఆక్షేపించటం కాదు, అభ్యంతరకర విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుదు, తెలుగు సాహిత్యం లో శ్రీశ్రీకి స్థానం లేకుండా పోదు (ఏ కొద్దిమంది నిరంకుశ ఇష్టాఅయిష్టాలతో పనిలేకుండా). అంతర్జాలం బేండ్ విడ్త్ వృధాచేస్తూ తొందరపాటుతో చేస్తున్న మన వ్యాఖ్యలు మాత్రం మిగులుతాయి, కొన్ని క్షణికమైన రోజులు.

  7. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి VSTSayee అభిప్రాయం:

    01/19/2016 1:11 am

    సంపాదకులకు మనవి:

    “వ్యంగ్యం అని రచయిత హామీ ఇచ్చిన” అనే శీర్షిక గురించి కాస్తంత ఆలోచన చేయగలరు.

    రిగార్డులతో,
    శాయి.

  8. నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం గురించి విశ్వనాథ్ అభిప్రాయం:

    01/19/2016 12:58 am

    చక్కని విశ్లేషణ. చాలా బాగుంది.

  9. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! అభిప్రాయం:

    01/18/2016 5:31 pm

    అయ్యా సంపాదకుడు గారూ:

    ఈమాటలో తెలుగు పేరుతో సంస్కృతం దంచేసే మహానుభావులెందరో ఉన్నారు అన్నది జగద్విదితం. వారెవరిచేతైనా వ్యంగ్యం — గూఢంగా ఉండే వ్యంగ్యం, అగూఢంగా ఉండే వ్యంగ్యం — వీటిగురించి ఒక చిన్న వ్యాసం రాయించండి మహప్రభో!

    ముమ్మటుడిదో, కుంతకుడిదో — ఏదో ఒక లక్షణగ్రంథం నుంచి ఒక పాఠం రాయిద్దురూ! అర్థం పర్థం లేని కామెంట్లు రాసే వాళ్ళకీ,– కేవలం మెంటల్‌ రాతలు రాసేవాళ్ళకీ — ఇద్దరికీ పనికొస్తుంది!

    లేకపోతే, మీరు కథలకీ, వ్యాసాలకీ బ్లర్బులు రాస్తారుగదా! అప్పుడు, ఇల్లాంటి, “వ్యాస – కథలకీ” లేదా “కథా – వ్యాసాలకీ” బ్లర్బ్బులో, “ఇది వ్యంగ్యము. అపార్థము చేసికొనకుడు,” అని భక్తులకు, — ముఖ్యంగా మూఢభక్తులకు, బోధపడేలా చెప్పేద్దురూ!

    ఒక చిత్రకారుడెవరో తను గీసిన బొమ్మక్రింద “కుక్క బొమ్మ,” అని రాసాడట! బొమ్మని చూసి శ్రోత్రియపరులు చిరుతపులి అని భయపడతారేమోనని భయపడి!

    విధేయుడు,

    కటకటా!

  10. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/18/2016 12:35 pm

    రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.

    మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.

    అరిచే కుక్కలు కరవవు
    కరిచే కుక్కలు అరవవు
    అరవని కరిచే కుక్కలు తరమవు
    కరవని అరిచే కుక్కలు మరలవు
    అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు

    మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?

    మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.

    “పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”

    నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.