పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. కథ దేని గురించి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/14/2009 10:33 pm

    బాబ్జీలు గారూ ! సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు. అది కవిత్వమైనా..కధ అయినా!! కధకుల్ని కవులు చిన్న చూపు చూస్తారన్నది దేని ఆధారంగా మీరు అంత సునాయాసంగా అనీసిందీ ..అభాండాలు వేసిందీ నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే నిజమైతే రావిశాస్త్రి..శ్రీశ్రీ కి అంత అభిమానిగా ఉండగలిగేవారా?? కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ కి ..కాశీభట్ల వేణుగోపాల్ ‘ తపన’ కీ జయప్రభ గారు ముందుమాట రాసేవారా?

    కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభవం భిన్నమైంది. క్లుప్తంగా ఉంటూనే గాఢంగా మనసు మీద ఒక ముద్ర వేయగలదు కవిత్వం.నేను చెప్పేది మంచి పోయెమ్ గురించి. మంచి కధ కూడా చాలా ఆలోచనల్ని రేకెత్తించగలదు. తెలుగులో ఈ గాడత పరిధిలోకి వచ్చే కవులు.. రచయితలు..అన్ని కాలాల్లోనూ కొందరే !!

    సిధ్ధాంతాలు సృజనకి ప్రేరణనిస్తాయి. అదే లేకపోతే గోర్కీ..’అమ్మ’ వచ్చేదే కాదు. సిధ్ధాంతాన్ని సృజనాత్మక సాహిత్యం ఎలా ప్రతిఫలించాలి అన్న విషయంలో తెలుగులో రావిశాస్త్రీ..కాళీపట్నం…చాసో…కేశవరెడ్డి వంటి వారిలో తప్ప మిగిలిన అనేకుల్లో ఏ స్పష్టతా కనిపించదు.ఫెమినిస్టుల కధల్లోనూ ఇది ఉంది. బ హుశా యదుకులభూషణ్ గారి కోపం వెనక ఉద్దేశ్యం ఇదే కావొచ్చు.మీరు ‘విరసం’ ప్రభావాన్ని గురించి అన్న నిష్టూరం కూడా ఇదే కావొచ్చు. అప్పటికీ తప్పు సిధ్ధాంతాలదే కాలేదు. సృజన లేమి ఉన్న వాళ్ళు చేసే రచనలకి సిధ్ధాంతాలూ..సంస్థలూ బాధ్యత ఎంత వరకూ తీసుకోగలవూ?? వాళ్ళు మేలైన రచయితల్ని ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చును కదా? ఖాదిర్ బాబు ఏ సిధ్ధాంత చట్రాలకీ లోబడకుండా మంచి కధలు రాస్తున్నాడు కదా?ఇదే దృష్టాంతం.

    అందువల్ల నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు.
    రమ.

  2. నన్నెచోడుని క్రౌంచపదము గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    03/14/2009 8:14 pm

    అభిప్రాయాలకు సంబంధించి ఒక విషయం చెప్పడం మరిచాను.ఈమాట ప్రమాణాలకు సరితూగని అభిప్రాయాలను పూర్తిగా వేయకపోవడమే మంచిది. అలాకాక, సంపాదకులు కత్తిరిస్తారులే అన్న భావం పాఠకులకు కలిగిస్తే ఇష్టానుసారం
    రాస్తారు.పాఠకుల అభిప్రాయాలను ఎడిట్ చేయడం కూడా అంత సులువైన పనేమీ కాదు..అలానే,పెద్దలు వేమూరి గారు సెలవిచ్చినట్టు- (“ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు.” రచయితలు-ఎడిటర్లు- జనవరి 2009). పాఠకులతో సంప్రదించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఉదాహరణకు ఎడిట్ చేయబడ్డ పెద్దలు మాగంటి(www.maganti.org) గారి అభిప్రాయంలో (ఎమర్జెన్సీ కాలపు వార్తాపత్రికలోని నలుపు చేసిన columnsలా ఉన్నవి మనకు తెలియవు)“తాత్పర్యమే లేదు వెంకోజీ” అన్న వాక్యం అస్సలు అతకలేదు. ఇలా అతికీ అతకని వాక్యాలు ప్రచురించడం కన్నా సదరు అభిప్రాయాలను పూర్తిగా తొలగించడమే మేలు.

    గరికపాటి పవన్ కుమార్

  3. ముగ్గురు ముసలమ్మలు గురించి అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:

    03/14/2009 12:56 pm

    ఈ కథ గురించి నా బ్లాగులో చర్చించాను గమనించండి.
    http://after3beers.com/teluguhome/?p=165

    అక్కిరాజు

  4. ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:

    03/14/2009 10:24 am

    సంపాదకీయం అంటే పత్రిక లేదా పత్రిక నడిపే వారి ఆభిప్రాయాలను వెల్లడి జేయడం. సంపాదకీయాలు, Routine వ్యాసాలకి భిన్నంగా ఉండాలి. ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ వ్యక్తీకరణే కాబట్టి, చారిత్రక రుజువులతో పని లేదు. ఈ పరిధిలోకి ఇమడక పోతే, సంపాదకీయం అన్న పేరు తొలగించి మామూలు వ్యాసంగా ప్రకటించడమే సబబు.

    గరికపాటి పవన్ కుమార్.

  5. కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:

    03/14/2009 8:29 am

    సీతారామయ్యగారూ, ఇప్పుడు మంచి కథలు రావటం లేదని నా అభిప్రాయం కాదు. కిందటి ఆదివారం ఖదీర్ బాబు రాసిన మంచి కథ చదివేను ఒక ఆదివారం అనుబంధంలో. కేశవరెడ్డి గారి మునెమ్మ, చివరిగుడిశె లాటి కథలూ వచ్చేయి ఈ మధ్యనే. పసలపూడి కథలూ వచ్చేయి. డెభ్భైల తరవాత విరసం ప్రభావం వల్ల “రొటీను” కథలు ఎక్కువైపోయేయి. కథలు రాసే వారి నిజాయితీ కథలో కనబడదు. అదీ నా వ్యధ. ఇంకొహ విషయం కథలు రాసీవారంటే కవులకూ, నవలా రచయిత(త్రు)లకూ, విమర్శకులకూ ఆఖరికి చదివే వాళ్ళకూ చిన్న చూపు కదా? అప్పుడూ ఇప్పుడూ కూడాను.

  6. కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య అభిప్రాయం:

    03/14/2009 5:32 am

    ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.

    బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.

    వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.

    సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.

    భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.

  7. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి Sudhakar అభిప్రాయం:

    03/14/2009 2:31 am

    Suresh gaaru,
    Your article is an excellent insight into the origins of internet and eemaata. By using the quotations of telugu writers you have created a genuine telugu work.
    Wouldn’t it be a nice idea to encourage famous telugu people to treasure their memories on Eeemata for the future generations?.
    Best wishes.
    Sudhakar

  8. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:

    03/13/2009 6:50 pm

    అభిప్రాయాలకు చర్చలకు మధ్య చాలా తేడా ఉంది.
    పాఠకులు వ్యక్తం చేయవలసింది వ్యాసం మీది అభిప్రాయాలను,
    అంతేగాని, ఇతరుల అభిప్రాయాల మీద అభిప్రాయాలను కాదు.
    ఖండన ముండనలు అంతకన్నా కాదు.ఇది అభిప్రాయ వేదికే కాని చర్చా వేదికని నేననుకోను.ఈ మాట సంపాదకులు రచయితకు సూచనలు లాగానే అభిప్రాయాల ప్రకటనలకు కూడా సూచనలు చేయడం వల్ల ఈ ఆరణ్యకాండ (ఒకరినొకరు వేటాడుకోవడం ) సుందరకాండగా (ఒకరితో ఒకరు మాటాడుకోవడం) మారుతుంది.

    అస్మదీయుని సూచనలు (నాకు ఏ వీరతాళ్లు అవసరం లేదు)

    1.అభిప్రాయం రచనకే పరిమితం కావాలి.

    2.ఇతరుల అభిప్రాయాల్లోకి వెళ్ళరాదు.

    3.చర్చలకు వేరొక వేదిక పెట్టుకోవచ్చు.

    (అందులో కొంత వేడి పుట్టినా ఫర్వాలేదు,ఒకరినొకరు
    సమర్థించుకోవడం,ఖండించుకోవడం గట్రా ఉండవచ్చు)

    గరికపాటి పవన్ కుమార్.

    [మీ సూచనలకు కృతజ్ఞతలు. పాఠకుల అభిప్రాయాలు ప్రకటించే విధానంపై కొంతకాలంగా ఈమాట సంపాదకులలో చర్చ జరుగుతున్నది. త్వరలోనే కొన్ని మార్పులు ప్రవేశపెట్టబోతున్నాం. – సం.]

  9. నాచన సోమన చతుర వచో విలాసం గురించి baabjeelu అభిప్రాయం:

    03/13/2009 8:41 am

    దండాలు కావేఁశ్వర్రావు గారూ, సిలక్కి సెప్పినట్టు సెప్పేరు. దండాలు.
    దండాలు “మోహన” గారూ, కవి సార్వభౌముడు ప్రశ్నార్థకము మీరు పెట్టిన జాగాలో పెట్టేడా? ఆయన ప్రకారం సింగభూపాలుడు సర్వగ్యుఁడు కదా ఈ కథా కమామీషు మీరిద్దరే విశదీకరించగలరు.
    ఈ మాట, నాలాటివాళ్ళకి చేస్తున్న వుపకారం: కడుపులోని చల్ల కదలకుండా సాహిత్య ధర్మ సందేహాలని తీర్చడం. అదీ కూడా గురుతుల్యులిద్దరితో.
    మీర్రాసినట్టే ఈ మాట పాఠకులకి సాహిత్యం, అది ప్రాచీనవైఁనా, ఆధునికవైఁనా, చాలా యిష్టం. అయితే ప్రాచీన సాహిత్యం మీద మీరిద్దరూ, మీతో బృందావనరావు గారూ అద్భుతంగా రాస్తున్నారు. మీర్రాసిన వ్యాసాలకి, రమ గారూ, లైలా గారూ మరియు నాగులపల్లి గారు లాటివారు, అప్పుడప్పుడు మిగిలిన వాళ్ళూ ఓ చెయ్యి వేస్తున్నారు. అర్థం పర్థం లేని రాతలూ వుంటాయి (నాకీ సంగతి బాగా తెలుసు). అయితే మీరిద్దరూ కలిసి మంచి పాత సాహిత్యం మీద అందరికీ “మోహాన్ని” మరియు “కామాన్ని” మరీ ఎక్కువ చేసెస్తున్నారు. “పాచ్చింతకాయ పచ్చడి రుచి” నాకు అనుభవైకవేద్యము. మరో సారి మీ యిద్దరికీ మనఃపూర్వక దండాలు. అయితే మీరిద్దరూ/ముగ్గురూ “ప్రాచీన” సాహిత్యం గురించి విమర్శనాత్మకవైఁన వ్యాసాలు ఎందుకు రాయరూ? ఎందుకు రాయకూడదు? వాటిలోని “అబ్బో అబ్బో” ల గురించే ఎందుకు రాయాలి? లేకపోతే పెద్దలను విమర్శించకూడదు అనే సంస్కారం వల్ల రాయట్లేదా? అదీ కాదు అప్పటి కావ్యాలని ఇప్పటి కొలతలతో ఎలా తూయగలం అంటే ఇప్పటి కొలతలకి తూగలేని అప్పటి కావ్యాలని ఇప్పటివాళ్ళు ఎలా ఆనందించాలో కూడా మీరే చెప్పాలి. ఇందులో “ఇగటాలేటీ లేవు” తాపత్రయం తప్ప.

  10. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    03/13/2009 7:19 am

    మోహనగారు
    అందుబాటులోలేని పద్యాలను అందించినందుకు మనసారా కృతజ్ఞతలు.

    ఇప్పుడు క్రమంలో పద్యాలను చదివినప్పుడు, “లలితగతి మెఱయు శివుడజుడు” దగ్గరకు రాగానే, మీరు లలితగతిపై చెప్పింది ఇంకా సముచితంగా అనిపిస్తుంది. మొదటిసారి చదివినప్పుడు అర్థమే అయింది, ఇప్పుడు ఆనందాన్నిచ్చింది.

    “సర్వగతు, సర్వమయు, శర్వు నుతింతున్”, “పరమపరు, పరమగురు, పరము నుతింతున్” అన్న పదబంధాలు అలలవలె లయాన్వయంగా లయకారున్ని నుతిస్తున్నట్లున్నాయి.

    ఆ. కావ్యమంత చదువ కాలంబు లేకున్న
    రసము చూపినారు రయము గాను
    ఎవరి చేతి రచనొ యెఱుగక పోయినా
    చేతులిచ్చువాడు శివుడె యెపుడు

    విధేయుడు
    -Srinivas