శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
ఒక నానుడిగా మారిపోయిన ‘లక్ష్మణదేవర నవ్వు’కు మూలంగా ఉన్న పాట గురించి ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను. వెల్చేరు నారాయణరావు గారికి కృతజ్ఞతలు.
ఈ కథ గురించి స్థూలంగా తెలుసు కానీ, శివుడూ, ఆదిశేషువూ, జాంబవంతుడూ, నీలుడూ కూడా భుజాలు తడుంకున్నారనేది కొత్త విషయం. అసలు లక్ష్మణుడే ఆదిశేషుడి అవతారమంటారు కదా? తను శివుడికి సేవకుడిగా రావటమేమిటో, శివుడికీ విష్ణువుకూ విరోధమేమిటో బోధపడలేదు. (శైవులకూ వైష్ణవులకూ గొడవలుండేవి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఉన్నాయా? యుద్ధానికి ముందు శివుణ్ణి రాముడు పూజిస్తాడు కదా? ) నేను విన్న కథలో రాముడు కూడా లక్ష్మణుడి నవ్వుకు తలవొంచుకుంటాడు.
దేవర అంటే భర్త తోబట్టువు అనే అర్థం ఉందని ఈ వ్యాసం ద్వారానే తెలిసింది!
రోహిణీప్రసాద్ గార్కి:
నమస్తే. నాన్నగారి ‘కినిమా’ స్కెచ్ లు అపురూపం. కేవలం బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడే సినిమా పత్రికల్ని తప్పనిసరైనప్పుడు మాత్రమే చూసే అలవాటున్న నాకు, సినిమా పత్రికల్లో ఇంత quality రచనలుంటాయని నాన్నగారి రచనలవల్లనే నమ్మకం కలుగుతోంది. ఇంత సరళమైన ఆరోగ్యకరమైన రచనలు ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలబడగలిగే అర్హత కలిగి వుంటాయి. నాన్న గారు తెలుగు సాహిత్యం లో గల్పికలు మొదలైన ఎన్నో ప్రక్రియలకు జీవం పోసిన ఆద్యులు. ‘సినిమా సాహిత్యం’ లో వారి అడుగుజాడలున్నా, అవి ఆయనవేనని ఇంకా ముందు తరాల వారికి రుజువు చేసి వుంచ వల్సిన చారిత్రక అవసరం వుందని నా అభిప్రాయం.
1. సాంకేతిక పరిశోధనా పత్రాలకి ఒక వ్యవస్థ, పద్ధతీ ఉన్నాయి. సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు తీసుకుంటే మనకా వ్యవస్థా లేదు; పద్ధతి అంతకన్నా లేదు. ఏం రాసినా రచయిత ఆశ్రయించేడి పత్రికలనే! అంటే రచయిత వ్యాసాలకి స్థాయి ఆశించినట్లే పత్రికలకీ ఒక స్థాయి ఉండాలి. రచనలో వాసి ఆశించినట్లే, పత్రికలు తమ స్థాయిని పెంచుకునే మార్గాన వెళ్ళాలి. లేదా ప్రయత్నించాలి. కథలూ, కబుర్లూ రాస్తే వేయడానికి తెలుగునాట పత్రికలు సిద్ధమే కానీ వ్యాసాల వరకూ వస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉండరు – ముఖ్యంగా సాహిత్య పరిశోధనా వ్యాసాలు. వారి దృష్టిలో అది యూనివర్శిటీల బాధ్యత. ప్రస్తుతం యూనివర్శిటీలకి ఆ తీరికా, వెసులుబాటూ కరువయ్యాయి. చర్చించుకోడానికి అది వేరే విషయం. వదిలేద్దాం.
ఇలాంటప్పుడు మోహన గారి వ్యాసం కానీ, జయప్రభ గారి అన్నమయ్య పుస్తకం గానీ పాఠకులకి చేరేదెలా? మీరు చెప్పినట్లు దాన్ని చదివి తప్పొప్పులు సవరించీ, కాస్త కూర్పులూ, మార్పులూ చేసే పరిశీలకులు ఏరీ? ఒకవేళ ఉన్నారనుకున్నా, దానికి ఒప్పుకునే రచయితలూ ఉండాలి కదా? రచనని బేరీజు వేసే స్థాయి పరిశీలకులకీ వుండనవసరం లేదా? అంటే పరిశీలకుల స్థాయి మీద రచయితలకీ నమ్మకం ఉండాలి. విశ్వాసం కుదరాలి. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కుదిరే విషయాలా? తాము రాసిందే వేదమూ, ఎదుటివారి జ్ఞానం శూన్యమూ అనుకునే వాతావరణంలో ఇవన్నీ కుదరని విషయాలు. ఎవరికివారే పెద్ద మేధావులుగా చెలామణీ అవ్వడానికే ప్రయత్నించే నేటి సాహిత్య వ్యవస్థలో రామారావు గారు ఆశించేది జరగని పని.
2. సాహిత్యంలో ప్రమాణాలు అవసరమని పత్రికలూ, పాఠకులూ, ముఖ్యంగా ఔత్సాహిక రచయితలూ భావించిన నాడు మంచి సరుకు పాఠకులకి రవాణా అయ్యే అవకాశం ఉంది. ఔత్సాహిక రచయితలు అని ఎందుకన్నానంటే చెయ్యి తిరిగిన రచయితలు వారేం రాసినా ప్రమాణంగానే భావిస్తారు కనుక. పత్రికలూ వీరి పట్ల సడలింపు ధోరణే అమలుపరస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. పేరొచ్చే వరకూ రాయి, అదొచ్చాక పత్రికలే మోస్తాయి అన్న సాహిత్య వాతావరణమ్లో కూరుకుపోయాం.
3. పోనీ ప్రచురణ కర్తలూ లేదా సంస్థలూ అయినా పైన చెప్పిన విషయాలమీద శ్రద్ధ చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. వాదాలూ, రాజకీయల ఊబిలో పీకల్లోతు అవి మునిగున్నాయి. అమ్మకాలకి అవకాశం ఉండే పుస్తకాల మీదే వారి గురి. ఇలాంటి సందర్భాల్లో రచయితలే పుస్తకాలు అచ్చేసుకునే దౌర్భాగ్యపు సాహిత్య సమాజంలో ఉన్నాం. రాయడమూ, దిద్దుకోవడమూ, ప్రచురించుకోవడమూ, ప్రచారం చేసుకోవడమూ, ఆ పైన పంచుకోవడమూ అన్నీ రచయిత బాధ్యతలే అవుతున్నాయి. పాఠకులూ అదే తీరులో ఉంటున్నారు.
4. ఇహ వ్యాఖ్యలంటారా? ఎవరికి వారు పండుతులనీ, మేధావులనీ భ్రమించే నేపధ్యంలో అందరూ, అంటే ముఖ్యంగా రాసేవాళ్ళు, అన్నీ చదువుతారు. చదవనట్లు నటిస్తారు. వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండరు. అవే కారణాలు పునరావృత్తం అవుతాయి.
5. రాయగలిగిన వాళ్ళు రాస్తూ ఉండాలి. కానీ అభిప్రాయాలు ఆలంబన అవుతాయి. ఊతం ఇస్తాయి. మరింత మెరుగ్గా రాయలన్న ప్రేరణ కలిగిస్తాయి. చేసిన పనికి ఆనందాన్నిస్తాయి. ఇది పేరున్న రచయితలకీ వర్తిస్తుంది. పేరున్న రచయితలు పేరులేని వారివి చదవరు. చదివినా నోరు మెదపరు. అవే సమస్యలూ; అవే కారణాలూ.
సాహిత్య మార్జాలం గంట కట్టే వారికోసం వెతుక్కుంటోంది.
రామారావుగారు, మీ అభిప్రాయలతో చాలవరకు నేను ఏకీభవిస్తాను. ఔత్సహికుల పరిశోధనలని మనము త్రోసివేయకూడదు. అన్ని పరిశోధన వ్యాసాలలాగే వాటిని కూడ పరీక్షించాలి. నా ఈ వ్యాసములోని కొత్త అంశాలను వ్యాసము చివర చెప్పి ఉండాలి, యిక మీద అలా చేస్తాను. ప్రస్తుతము వాటిని క్రింద విశదీకరిస్తున్నాను –
(1) ఇది మందాక్రాంతముపైన ఒక సమీక్షవ్యాసము లేక రెవ్యూ లాటిది. ఇందులో ఇతరుల కృషిని సంక్షిప్తముగా తెలిపి నేను కనుగొన్న కొత్త విషయాలను చర్చించాను. నేను ఉపయోగించిన గ్రంథాలను కూడ అందరి సౌలభ్యానికోసం వివరాలతో చెప్పాను.
(2) మందాక్రాంతపు జననము, శాసనాలలో ఆ వృత్తపు వాడుక ఈ రంగములో ఉండే కొందరికి తెలిసి ఉన్నా, అవి అంతగా అందుబాటులో లేనందువలన, ప్రయాగప్రశస్తి, వియత్నాం శాసనాలను సంగ్రహముగా తెలిపినాను.
(3) మందాక్రాంతవృత్తము వాడబడిన ఐదు సందేశకావ్యాలను గురించి సంక్షిప్త వివరణ, అందులో ఉండే కొన్ని పద్యాలకు అదే వృత్తములో తెలుగు అనువాదమును తెలిపినాను. సందేశకావ్యాలకు మందాక్రాంతవృత్తములో (యతిప్రాసలు లేకున్నా కూడ) తెలుగు అనువాదాలు నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు అనువాదాలే లేనప్పుడు, ఈ అనువాదాలు ఉత్తమ స్థాయిలో ఉన్నదో లేదో అన్నది వేరే విషయము.
(4) మందాక్రాంత వృత్తపు చర్చ చాలవరకు కొత్తదే. మందాక్రాంతమును బోలిన వృత్తాల పట్టిక చిత్రము పూర్తిగా కొత్తదే. చాల పుస్తకాలను తిరగవేసి ఈ వృత్తాలనుగురించి తెలిసికొని వాటి లక్షణాలను వివరించే ఈ పట్టికను వాటి నిర్మాణశిలలు లేక లెగోల ద్వారా తెలియబరచాను. వీటన్నిటికీ పద్యరూపముగా ఉదాహరణలను ఛందస్సు, రచ్చబండ గుంపులలో ఇచ్చి ఉన్నాను. ఇలాటి పట్టిక proteins, nucleic acids రంగములో amino acid or nucleotide sequence similarity వంటిది. ఛందశ్శాస్త్రములో కూడ వృత్తస్వరూపాలను ఇలా విశదీకరించడానికి వీలవుతుందన్నది ఒక కొత్త విషయమే.
(5) ఒక గురువును రెండు లఘువులుగా మార్చి మందాక్రాంతపు లయ గలిగిన నాలుగు వృత్తాల సృష్టి కూడ నవీనమే. అందులో ఒకటి మాత్రమే పాత లక్షణగ్రంథాలలో ఉన్నది.
(6) మందాక్రాంతపు లయను మందాకిని అనే ఒక జాతి పద్యముగా సృష్టించడము, వాటిని ఉపయోగించి సంస్కృత వృత్తాలను అనువదించడము కూడ సంపూర్ణముగా నూతనమే. ఇలాటి ప్రయత్నము మిగిలినవారికి మార్గదర్శి అవడానికి అవకాశము ఉన్నది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మందాక్రాంతవృత్తముపై సుమారు ఐదారు సంవత్సరాలుగా చేసిన నా పరిశోధనల సారాంశాన్ని యిక్కడ పొందుపరచాను. ఇంకా ఎన్నో వివరాలను వ్యాసపు నిడివిని దృష్టిలో నుంచుకొని విడిచివేయవలసి వచ్చింది.
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
05/07/2012 9:45 am
మోహనరావు గారి వ్యాసం చాలా బాగుంది నాకు.
శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
లక్ష్మణదేవర నవ్వు గురించి వేణు అభిప్రాయం:
05/07/2012 9:21 am
ఒక నానుడిగా మారిపోయిన ‘లక్ష్మణదేవర నవ్వు’కు మూలంగా ఉన్న పాట గురించి ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను. వెల్చేరు నారాయణరావు గారికి కృతజ్ఞతలు.
ఈ కథ గురించి స్థూలంగా తెలుసు కానీ, శివుడూ, ఆదిశేషువూ, జాంబవంతుడూ, నీలుడూ కూడా భుజాలు తడుంకున్నారనేది కొత్త విషయం. అసలు లక్ష్మణుడే ఆదిశేషుడి అవతారమంటారు కదా? తను శివుడికి సేవకుడిగా రావటమేమిటో, శివుడికీ విష్ణువుకూ విరోధమేమిటో బోధపడలేదు. (శైవులకూ వైష్ణవులకూ గొడవలుండేవి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఉన్నాయా? యుద్ధానికి ముందు శివుణ్ణి రాముడు పూజిస్తాడు కదా? ) నేను విన్న కథలో రాముడు కూడా లక్ష్మణుడి నవ్వుకు తలవొంచుకుంటాడు.
దేవర అంటే భర్త తోబట్టువు అనే అర్థం ఉందని ఈ వ్యాసం ద్వారానే తెలిసింది!
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి mallikarjuna sarma అభిప్రాయం:
05/07/2012 6:20 am
ప్రధాన చర్చ నుండి ఈ నా deviation కు క్షంతవ్యుణ్ని. తిలక్ ‘నల్లజర్ల రోడ్డు’ radio నాటికగా వచ్చిందా! సందేహాన్ని విజ్ఞులు తీర్చగలరు.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి mallikarjuna sarma అభిప్రాయం:
05/07/2012 5:58 am
రోహిణీప్రసాద్ గార్కి:
నమస్తే. నాన్నగారి ‘కినిమా’ స్కెచ్ లు అపురూపం. కేవలం బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడే సినిమా పత్రికల్ని తప్పనిసరైనప్పుడు మాత్రమే చూసే అలవాటున్న నాకు, సినిమా పత్రికల్లో ఇంత quality రచనలుంటాయని నాన్నగారి రచనలవల్లనే నమ్మకం కలుగుతోంది. ఇంత సరళమైన ఆరోగ్యకరమైన రచనలు ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలబడగలిగే అర్హత కలిగి వుంటాయి. నాన్న గారు తెలుగు సాహిత్యం లో గల్పికలు మొదలైన ఎన్నో ప్రక్రియలకు జీవం పోసిన ఆద్యులు. ‘సినిమా సాహిత్యం’ లో వారి అడుగుజాడలున్నా, అవి ఆయనవేనని ఇంకా ముందు తరాల వారికి రుజువు చేసి వుంచ వల్సిన చారిత్రక అవసరం వుందని నా అభిప్రాయం.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota అభిప్రాయం:
05/07/2012 3:18 am
మోహనగారు,
మీ సలహాలకు క్రుతజ్ణతలు.
వికాస్.విన్నకోట
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
05/07/2012 2:35 am
రామారావు గారి స్పందన చూసాకా మరో రెండు మాటలు:
1. సాంకేతిక పరిశోధనా పత్రాలకి ఒక వ్యవస్థ, పద్ధతీ ఉన్నాయి. సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు తీసుకుంటే మనకా వ్యవస్థా లేదు; పద్ధతి అంతకన్నా లేదు. ఏం రాసినా రచయిత ఆశ్రయించేడి పత్రికలనే! అంటే రచయిత వ్యాసాలకి స్థాయి ఆశించినట్లే పత్రికలకీ ఒక స్థాయి ఉండాలి. రచనలో వాసి ఆశించినట్లే, పత్రికలు తమ స్థాయిని పెంచుకునే మార్గాన వెళ్ళాలి. లేదా ప్రయత్నించాలి. కథలూ, కబుర్లూ రాస్తే వేయడానికి తెలుగునాట పత్రికలు సిద్ధమే కానీ వ్యాసాల వరకూ వస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉండరు – ముఖ్యంగా సాహిత్య పరిశోధనా వ్యాసాలు. వారి దృష్టిలో అది యూనివర్శిటీల బాధ్యత. ప్రస్తుతం యూనివర్శిటీలకి ఆ తీరికా, వెసులుబాటూ కరువయ్యాయి. చర్చించుకోడానికి అది వేరే విషయం. వదిలేద్దాం.
ఇలాంటప్పుడు మోహన గారి వ్యాసం కానీ, జయప్రభ గారి అన్నమయ్య పుస్తకం గానీ పాఠకులకి చేరేదెలా? మీరు చెప్పినట్లు దాన్ని చదివి తప్పొప్పులు సవరించీ, కాస్త కూర్పులూ, మార్పులూ చేసే పరిశీలకులు ఏరీ? ఒకవేళ ఉన్నారనుకున్నా, దానికి ఒప్పుకునే రచయితలూ ఉండాలి కదా? రచనని బేరీజు వేసే స్థాయి పరిశీలకులకీ వుండనవసరం లేదా? అంటే పరిశీలకుల స్థాయి మీద రచయితలకీ నమ్మకం ఉండాలి. విశ్వాసం కుదరాలి. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కుదిరే విషయాలా? తాము రాసిందే వేదమూ, ఎదుటివారి జ్ఞానం శూన్యమూ అనుకునే వాతావరణంలో ఇవన్నీ కుదరని విషయాలు. ఎవరికివారే పెద్ద మేధావులుగా చెలామణీ అవ్వడానికే ప్రయత్నించే నేటి సాహిత్య వ్యవస్థలో రామారావు గారు ఆశించేది జరగని పని.
2. సాహిత్యంలో ప్రమాణాలు అవసరమని పత్రికలూ, పాఠకులూ, ముఖ్యంగా ఔత్సాహిక రచయితలూ భావించిన నాడు మంచి సరుకు పాఠకులకి రవాణా అయ్యే అవకాశం ఉంది. ఔత్సాహిక రచయితలు అని ఎందుకన్నానంటే చెయ్యి తిరిగిన రచయితలు వారేం రాసినా ప్రమాణంగానే భావిస్తారు కనుక. పత్రికలూ వీరి పట్ల సడలింపు ధోరణే అమలుపరస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. పేరొచ్చే వరకూ రాయి, అదొచ్చాక పత్రికలే మోస్తాయి అన్న సాహిత్య వాతావరణమ్లో కూరుకుపోయాం.
3. పోనీ ప్రచురణ కర్తలూ లేదా సంస్థలూ అయినా పైన చెప్పిన విషయాలమీద శ్రద్ధ చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. వాదాలూ, రాజకీయల ఊబిలో పీకల్లోతు అవి మునిగున్నాయి. అమ్మకాలకి అవకాశం ఉండే పుస్తకాల మీదే వారి గురి. ఇలాంటి సందర్భాల్లో రచయితలే పుస్తకాలు అచ్చేసుకునే దౌర్భాగ్యపు సాహిత్య సమాజంలో ఉన్నాం. రాయడమూ, దిద్దుకోవడమూ, ప్రచురించుకోవడమూ, ప్రచారం చేసుకోవడమూ, ఆ పైన పంచుకోవడమూ అన్నీ రచయిత బాధ్యతలే అవుతున్నాయి. పాఠకులూ అదే తీరులో ఉంటున్నారు.
4. ఇహ వ్యాఖ్యలంటారా? ఎవరికి వారు పండుతులనీ, మేధావులనీ భ్రమించే నేపధ్యంలో అందరూ, అంటే ముఖ్యంగా రాసేవాళ్ళు, అన్నీ చదువుతారు. చదవనట్లు నటిస్తారు. వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండరు. అవే కారణాలు పునరావృత్తం అవుతాయి.
5. రాయగలిగిన వాళ్ళు రాస్తూ ఉండాలి. కానీ అభిప్రాయాలు ఆలంబన అవుతాయి. ఊతం ఇస్తాయి. మరింత మెరుగ్గా రాయలన్న ప్రేరణ కలిగిస్తాయి. చేసిన పనికి ఆనందాన్నిస్తాయి. ఇది పేరున్న రచయితలకీ వర్తిస్తుంది. పేరున్న రచయితలు పేరులేని వారివి చదవరు. చదివినా నోరు మెదపరు. అవే సమస్యలూ; అవే కారణాలూ.
సాహిత్య మార్జాలం గంట కట్టే వారికోసం వెతుక్కుంటోంది.
-బ్రహ్మానందం గొర్తి
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/06/2012 11:22 pm
రామారావుగారు, మీ అభిప్రాయలతో చాలవరకు నేను ఏకీభవిస్తాను. ఔత్సహికుల పరిశోధనలని మనము త్రోసివేయకూడదు. అన్ని పరిశోధన వ్యాసాలలాగే వాటిని కూడ పరీక్షించాలి. నా ఈ వ్యాసములోని కొత్త అంశాలను వ్యాసము చివర చెప్పి ఉండాలి, యిక మీద అలా చేస్తాను. ప్రస్తుతము వాటిని క్రింద విశదీకరిస్తున్నాను –
(1) ఇది మందాక్రాంతముపైన ఒక సమీక్షవ్యాసము లేక రెవ్యూ లాటిది. ఇందులో ఇతరుల కృషిని సంక్షిప్తముగా తెలిపి నేను కనుగొన్న కొత్త విషయాలను చర్చించాను. నేను ఉపయోగించిన గ్రంథాలను కూడ అందరి సౌలభ్యానికోసం వివరాలతో చెప్పాను.
(2) మందాక్రాంతపు జననము, శాసనాలలో ఆ వృత్తపు వాడుక ఈ రంగములో ఉండే కొందరికి తెలిసి ఉన్నా, అవి అంతగా అందుబాటులో లేనందువలన, ప్రయాగప్రశస్తి, వియత్నాం శాసనాలను సంగ్రహముగా తెలిపినాను.
(3) మందాక్రాంతవృత్తము వాడబడిన ఐదు సందేశకావ్యాలను గురించి సంక్షిప్త వివరణ, అందులో ఉండే కొన్ని పద్యాలకు అదే వృత్తములో తెలుగు అనువాదమును తెలిపినాను. సందేశకావ్యాలకు మందాక్రాంతవృత్తములో (యతిప్రాసలు లేకున్నా కూడ) తెలుగు అనువాదాలు నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు అనువాదాలే లేనప్పుడు, ఈ అనువాదాలు ఉత్తమ స్థాయిలో ఉన్నదో లేదో అన్నది వేరే విషయము.
(4) మందాక్రాంత వృత్తపు చర్చ చాలవరకు కొత్తదే. మందాక్రాంతమును బోలిన వృత్తాల పట్టిక చిత్రము పూర్తిగా కొత్తదే. చాల పుస్తకాలను తిరగవేసి ఈ వృత్తాలనుగురించి తెలిసికొని వాటి లక్షణాలను వివరించే ఈ పట్టికను వాటి నిర్మాణశిలలు లేక లెగోల ద్వారా తెలియబరచాను. వీటన్నిటికీ పద్యరూపముగా ఉదాహరణలను ఛందస్సు, రచ్చబండ గుంపులలో ఇచ్చి ఉన్నాను. ఇలాటి పట్టిక proteins, nucleic acids రంగములో amino acid or nucleotide sequence similarity వంటిది. ఛందశ్శాస్త్రములో కూడ వృత్తస్వరూపాలను ఇలా విశదీకరించడానికి వీలవుతుందన్నది ఒక కొత్త విషయమే.
(5) ఒక గురువును రెండు లఘువులుగా మార్చి మందాక్రాంతపు లయ గలిగిన నాలుగు వృత్తాల సృష్టి కూడ నవీనమే. అందులో ఒకటి మాత్రమే పాత లక్షణగ్రంథాలలో ఉన్నది.
(6) మందాక్రాంతపు లయను మందాకిని అనే ఒక జాతి పద్యముగా సృష్టించడము, వాటిని ఉపయోగించి సంస్కృత వృత్తాలను అనువదించడము కూడ సంపూర్ణముగా నూతనమే. ఇలాటి ప్రయత్నము మిగిలినవారికి మార్గదర్శి అవడానికి అవకాశము ఉన్నది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మందాక్రాంతవృత్తముపై సుమారు ఐదారు సంవత్సరాలుగా చేసిన నా పరిశోధనల సారాంశాన్ని యిక్కడ పొందుపరచాను. ఇంకా ఎన్నో వివరాలను వ్యాసపు నిడివిని దృష్టిలో నుంచుకొని విడిచివేయవలసి వచ్చింది.
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/06/2012 7:20 pm
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
05/06/2012 6:13 pm
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Ramakrishna Reddy అభిప్రాయం:
05/06/2012 6:00 pm
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.