వేమన, వీరబ్రహ్మం ఇద్దరిదీ దాదాపు ఒకటే మార్గం. దీన్ని అద్భుతంగా ప్రదర్శించే గ్రంథం “కాళికాంబ సప్తశతి”. వీరబ్రహ్మం ఆధ్యాత్మిక జీవితం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు కోరుకున్నాడో, కులమతాల అసమానతలను ఎలా ఎత్తిచూపారో ఈ శతక పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు.
తోకల రాజేశం
జీవిత విశేషాలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విద్యావేత్త తోకల రాజేశంగారు 9వ తరగతి నుంచే పద్యాలు రాయడం ప్రారంభించారు. కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు, సాహిత్య సమీక్షలు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన స్వగ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఇరవైమంది విద్యార్థులతో స్వయంగా శతక పద్యాలు రాయించి, వారిలో సాహిత్య స్పూర్తిని నింపారు.