ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.
కె.ఎ. మునిసురేష్ పిళ్లె
జీవిత విశేషాలు
మౌలికంగా జర్నలిస్టు కావడంవల్ల రాయడం పట్ల కూడా ఆసక్తి, ప్రవేశం ఏర్పడిన మునిసురేష్ పిళ్ళే గారికి రాయడమే ఆసక్తి, అభిరుచి, బతుకుతెరువు. వీరు రచించిన మూడు కథా సంపుటాలు ‘పూర్ణమూ నిరంతరమూ’, ‘రాతితయారీ’, గారడీవాడు, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ‘పుత్రికాశత్రుః’, ఒక కవిత్వం సంపుటి ‘షష్ఠముడు’, ఒక సంపాదకీయ వ్యాసాల సంపుటి ‘మునివాక్యం’ ప్రచురణ అయ్యాయి. వీటిలో కొన్ని పుస్తకాలకు వివిధ పురస్కారాలు లభించాయి. అనువాద సాహిత్యంకోసం ప్రత్యేకించిన ‘కథావసుధ’ వెబ్ మేగజైన్ ను తన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.
కె.ఎ. మునిసురేష్ పిళ్లె రచనలు
‘మా అమ్మ బంగారం’ అంటారందరూ
పోల్చడానికి ఈ ప్రపంచంలో
అంతకంటె విలువైనది మరొకటి లేదన్నట్టు