ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోనిది. కోరస్‌లో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు.

అడ్డం ముక్కు ఎక్కడుందంటే… ద్రావిడ ప్రాణాయామం – ఇది ప్రసిద్ధమైన జాతీయం. ద్రావిడులు ప్రాణాయామం చేసేటప్పుడు, చేతులు తల చుట్టూ తిప్పి ముక్కును పట్టుకొనే […]

గడినుడి 11ఎంతో సులభంగా కనిపిస్తూనే ఎంతో కష్టంగా అయింది పూరకులకు. ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా. చివరకు గడి పూర్తిగా చేసి పంపిన రవిచంద్ర ఇనగంటి, శ్రీవల్లీ రాధిక, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల – ఈ నలుగురు విజేతలకు మా అభినందనలు.

గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.

ఇది విఘ్నేశ్వరుని ప్రార్థన శ్లోకము. ఇది లేకుండ మనదేశములో నే కర్మలును ప్రారంభింపబడవు. క్రతువులు, నోములు, వ్రతములు అక్షరాభ్యాసములు, గృహప్రవేశములు సర్వమును విఘ్నేశ్వరపూజతోనే ప్రారంభింపబడును.

సాహిత్య విమర్శ అనేది (మనం ప్రస్తుతం వాడుతున్న అర్థంలో) తెలుగు సాహిత్య రంగానికి స్వతస్సిద్ధమైన లక్షణం కాదు. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల వచ్చినది కావడంతో ఆ ఆధునిక విమర్శాపద్ధతులు మనకు సరిగా బోధపడలేదు, మనం అలవర్చుకోలేదు కూడా. విమర్శ సాహిత్యాన్ని నిర్వచించబూనుకోదు. ఎందుకంటే నిర్వచనాలు సాహిత్యాన్ని సంకుచితం చేస్తాయి. సిసలైన విమర్శ సాహిత్యాన్ని వివరించి విస్తరిస్తుంది. పాఠకులలో సాహిత్యాభినివేశం కలిగిస్తుంది, పెంచుతుంది. ప్రస్తుత సాహిత్యరంగంలో—పొగడ్తలు తప్ప మరేమీ స్వీకరించలేని రచయితలు; ఏ రచననైనా పొగడడం లేదా తెగడడం అన్న రెండే పద్ధతులు పాటిస్తూ, రచన ఏం చెప్తున్నదో కూడా పూర్తిగా చూడకుండా వస్తువునో, శైలినో, వచనాన్నో– ఇలా తమకు నచ్చిన ఏవొక్క అంశనే ఎంచుకుని, తమ అభిప్రాయాలనే సాహిత్యసత్యాలుగా ప్రకటించే విశ్లేషకులు; రచయితల మనసులు నొప్పించకుండా వారి సాహిత్యాన్ని కేవలం ‘పరిచయం’ చేసే సమీక్షకులు, కొల్లలుగా కనిపిస్తూ—విమర్శ అన్న పదానికి, ఒక రచనను దాని సాహిత్యలక్షణ పరిథులలో వైయక్తికాభిరుచులకావలగా విశ్లేషించడం అనే అర్థం పూర్తిగా మాయమయిపోయింది. ఈ సమయంలో, సాహిత్యంలో విమర్శ అవసరాన్ని గుర్తించి ‘సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించి, ఆ దిశగా మొదటి అడుగు వేసిన డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) వారికి ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెల్చుకున్న–చామర్తి మానస, జిజ్ఞాస సోమనాథం (ప్రథమ); జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి(ద్వితీయ); రెంటాల శ్రీవేంకటేశ్వర రావు (తృతీయ)–రచయితలకు ఈమాట తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. విజేతల వ్యాసాలు, మరి కొందరు తెలుగు ప్రముఖులు ఇదే అంశంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా డిటిఎల్‌సి వారు త్వరలో తేబోతుండడం సాహితీప్రియులందరికి సంతోషం కలిగించే విషయం.

ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ళ పొగిడేవారు. అతన్ని పెళ్ళాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్ళి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.

“రాగమ్మ అసాధ్యురాలు. పత్తి వొలవడానికి చేలోకి దిగితే, ఎక్కేప్పుడు మల్లె చెండంత పత్తి కొప్పులో పెట్టుకుని గట్టెక్కేది. మేస్త్రీ కదా, అందరికీ నేర్పింది. పత్తి వొలుపులు అయ్యేసరికి రాగమ్మ క్వింటాల్ పత్తి తూకం వేసేది…” మావయ్య మాటకి అడ్డంపడి, ‘చిన్న బిడ్డలకి యివన్నీ దేనికిలే సామీ…’ అంటూ గుర్రాల పొట్లం అందించింది రాగమ్మ. మావయ్య యిచ్చిన నోట్లని కళ్ళకద్దుకుని తీసుకుంది.

“నేను ఇక్క‌డికి వ‌చ్చింది నీతో చ‌ర్చలు చేయ‌డానికి కాదు. మా టీమ్‌లో వెంకట్ ఉన్నాడు నీకు తెలుసు క‌దా, మ‌న కుల‌మే… చూడ్డానికి బాగుంటాడు.(అదోలాంటి న‌వ్వు. ఆ న‌వ్వు గురించి నాకు తెలిసినంత బాగా ఎవ‌రికీ తెలీదు.) ఇప్పుడు కెన‌డాలో జాబ్ వ‌చ్చింది. వెళ్ళేముందు నా అభిప్రాయం అడిగాడు. కాద‌ని చెప్పేందుకు కార‌ణం ఏదీ క‌నిపించ‌లేదు. వ‌చ్చే ఆదివారం వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌తో మాట్లాడేందుకు వ‌స్తున్నారు. నీ అభిప్రాయం ఏంటి?”

ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.

విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచీ, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్ళి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు?

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.

ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కిదూకడమే!

యాత్రల్లో పరాయివాళ్ళు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్ళినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్ళముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్ళందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది

మేం వుంటున్న యింటి యజమానురాలు శాకాహారి కాదు. అయినా శర్మకు అభ్యంతరం కలిగేలా ఏనాడూ ప్రవర్తించకపోవటాన మేం మరో చోటికి పోవల్సిన అవసరం కలగలేదు. ఆవిడకి బంగారపు బొమ్మలాంటి కూతురు వుండేది. రోహిణి ఆ అమ్మాయి పేరు. అప్పటికే వివాహితుడు కావటం మూలానా, పైగా పరస్త్రీని చూడకూడదనే నియమం కలవాడు కావటం మూలానా శర్మ ఆ అమ్మాయి సంగతే పట్టించుకునేవాడు కాదు. నాకు మాత్రం ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నరాలు జివ్వుమనేవి.

మరణముఖమును అరయుచున్నను ఇంత చక్కగ, నింత భావస
మంచితంబుగ నల్లినాడవు మేదినీసుర! నీదు కవితను

నీదుమహిమను నేనెఱుంగక నీకు వేసితి నిధనశిక్షను.
నాదు సుతపై నీదు ప్రేమము ఉత్తమాశయయుత మద్వితీయము.

ఈ మునిమాపు వేళ
గుబురుకున్న పొదలమధ్యలోంచి
తాటిచెట్ల నీడలు మొలిచినట్టున్న
వూరి అంచులోకి
నా నడకకు
సందిగ్ధంగా దారిగీస్తూ
అక్కడేదో ఓ మలుపు –

ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.