గూటికి చేరిన పక్షులు తమ పిల్లలకి కబుర్లు చెప్తూ పగలంతా వెతికి తెచ్చిన పళ్ళని తినిపిస్తున్నాయి. పక్షిపిల్లల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. ఆమె తల ఎంతకీ పైకెత్తడం లేదు. పొందిగ్గా, ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె రూపం ఆకర్షిస్తోంది. ఆ పూర్తి రూపాన్ని నా గుండెల్లో దాచుకోవాలనే తపన నన్ను దహించివేస్తోంది.

ఇంద్రజిత్తు వెంటనే కోపంగా చెప్పేడు, “తండ్రీ ఈ విభీషణుడు దేవతల పక్షపాతి. ఈయన్ని నమ్మకండి. ఇంద్రుణ్ణి గెల్చిన నేనూ, యముణ్ణి గెల్చిన మీరూ ఉండగా మనకి ఎవరెదురు చెప్పగలరు? లౌక్యంతో బలి మహరాజుని వంచన చేసి ఆయన ద్వార పాలకుడైన విష్ణుడేపాటి? మనం ముందు సుతలం మీదకే దండెత్తి పోదాం.”

శ్రీనాథుని యజ్ఞదత్తుడు, భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే!

ఈ రచన ముఖ్యోద్దేశము శ్రీవిష్ణుమూర్తి యెత్తిన దశావతారములను సార్థకనామవృత్తములలో వర్ణన చేయడము. శ్రీజయదేవకవిలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములను దశావతారములుగా ఎన్నుకొన్నాను.

బ్రౌన్‌తో చాలా సమస్యలు ఉన్నాయి. మనకి పొగడ్తలు వ్యక్తి గౌరవాలే ప్రధానమయి సవిమర్శకంగా ఎవరి పనినీ అంచనా వేసే అలవాటు ఇప్పటికీ ఏర్పడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే అతన్ని ఇప్పటికి సవిమర్శకంగా ఎవరూ చూడలేదు. అతనికి తెలుగు గొప్పగా వచ్చని, అతను ఇంద్రుడని చంద్రుడని పొగుడుతాం.

మచాడో తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో చూశాడు. అందులో రంగుల్ని చూశాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

త్రిపుర వెతుకులాట — ప్రతీ ప్రశ్ననీ మరో పెద్ద ప్రశ్నతో రద్దు చేసి చివరికి మిగిలిన ఒకే ఒక్క ప్రశ్నను చూసి తనపై తాను జాలితో నవ్వుకుని నలుపు తెలుపుల్ని నిండుగా కలిపేసి చివరికి అసలు నేనెవరని? నేను, ఎవరు? నుదుటిపై పుట్టుమచ్చనా? కోటేరుగా ఉన్న ముక్కునా, కోటానుకోట్ల కణాల్లోంచి ప్రమాదాల్ని తప్పించుకు పుట్టేసిన ఒక…

చిన్నప్పుడు మనమంతా ఋతువులు ఆరు అని రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించవచ్చని మనమంతా మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. అయితే, భారతీయ దేశంలో — ముఖ్యంగా దక్షిణ భారతంలో — ప్రధానంగా మనకు అనుభవమయ్యేవి ఎండకాలం, వానకాలం, చలికాలం అన్న మూడు కాలాలు మాత్రమే.

మన సౌర మండలంలో జరిగే ప్రతి మార్పుకు కారణభూతుడు సూర్యుడే. గ్రహాల గమనమైనా, వాటి ఉపగ్రహాల గమనమైనా, గ్రహాల చుట్టూ ఉండే వాతావరణం, అందులోని మార్పులూ, గ్రహణాలూ – వీటన్నిటికీ మూల కారణం సూర్యుడు. భూమి పైన జనించే సకల సృష్టికి కారణం సూర్యుడు. ఈ సృష్టిలో చేతనాచేతనమైన జీవాలకి ప్రత్యక్ష సాక్షి – సృష్టికర్త సూర్యభగవానుడు.

సినీ నటుడు నాగభూషణం నటించి సమర్పించిన సాంఘిక నాటకం రక్తకన్నీరు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత ప్రసిద్ధమైన నాటకం అది. ఎంతో అపురూపమైన ఆ నాటకం పూర్తి ఆడియో ఈమాట పాఠకుల కోసం…

ఈ సంచికలో రెండు అపురూపమైన ఉగాది కవిసమ్మేళనాలను సమర్పిస్తున్నాను. ఇవి 1964, 1969 సంవత్సరాలలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డయినవి. తల్లావఝల శివశంకరశాస్త్రి, వెంపరాల, జరుక్ శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆరుద్ర లాంటి వార్ల గొంతుకలు, వారి కవితలు వినటం ఒక ఎత్తైతే విశ్వనాథ వారి పద్యపఠనం మరొక ఎత్తు.

కందుకూరి రమేష్ బాబు సామాన్యుల జీవితాలను ఇష్టంగా రికార్డ్ చేస్తున్నారు. వారి బతుకులను తన కెమెరాతో బొమ్మలు తీస్తున్నారు.వారి జీవితాలను గానం చెయ్యడమే తనకు సంతృప్తినిస్తుందని చెబుతున్నారు. జర్నలిజంలో పుష్కరకాలం పైగా ఉన్నారు.సామాన్యుల జీవిత పరిచయాలే వీరికి వృత్తీ, వ్యాపకం.

కినిగె గురించి: 2010లో స్థాపించబడి, తెలుగు పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు అందిస్తూ, తెలుగు ఈ-బుక్ రంగంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచింది కినిగె. పాఠకులకు, ప్రచురణకర్తలకు, రచయితలకు ఒక అద్భుత ప్లాట్ ఫామ్ కినిగె.

మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక — రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి… త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం మీద తన సిద్ధాంతాన్ని మరికొంచెం వివరిస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రెండవ భాగం; మే 24-26న డాలస్‌లో జరిగిన తానా 19వ ద్వైవార్షిక సమావేశాల జ్ఞాపిక ఈమాట గ్రంథాలయంలో; ఆకాశవాణి పన్నాల సుబ్రహ్మణ్య భట్టు త్రిపురల పిచ్చాపాటీ;నాకు నచ్చిన పద్యం శీర్షికను ఇకనుంచీ కొనసాగించే భైరవభట్ల కామేశ్వర రావు మొదట చెప్పిన పద్యం దాశరథి మించుకాగడా — ఈ సంచికలో విశేషాలు.

తెలుగు పలుకు – తానా 2013 జ్ఞాపిక


ఇంకా ఈ సంచికలో: ఎలనాగ, తః తః, స్వాతికుమారి, నారాయణ, జాన్‌హైడ్, ఆర్. దమయంతి, దేశికాచార్యులు, ప్రసాద్, భాస్కర్, ఇంద్రాణి, శ్రీవల్లీ రాధిక, హెచ్చార్కెల కవితలు; రవిశంకర్, సుబ్రహ్మణ్యం, శివకుమారశర్మల కథలు; మోహన రావు, మురళీధరరావుల వ్యాసాలు; సత్యం శంకరమంచి అపురూపమైన ఆడియో రూపకం హరహరమహదేవ

కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

దానికన్నా నిరుపయోగమైనది లేదు
రూపం లేదు భాషా రాదు
నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు
కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు