శతావధాని రా. గణేశ్


సొంత ఊరు:
కోలార్, కర్ణాటక
ప్రస్తుత నివాసం:
బెంగళూరు
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

భారతదేశంలోని అగ్రగణ్యులైన సంస్కృత కవులు, పండితులలో ఒకరైన శతావధాని రా. గణేశ్‌గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్‌లో జన్మించారు. కన్నడ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు భాషలలో రచనలు చేసిన వీరు యూవీసీఈ (UVCE) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మెటలర్జీ మరియు మెటీరియల్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పట్టాలు పొందారు. అలాగే ఆయనకు సంస్కృతంలో ఎంఏ పట్టా కూడా ఉంది. భారతీయ ప్రాచీన సాహిత్యం, తాత్త్విక, ఆలంకారిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా రచనలు, ఉపన్యాసాలు చేసారు. ప్రాచీన అవధాన కళలో నిష్ణాతులైన ఈయన, కన్నడంలో ఈ కళకు పునరుజ్జీవనం కలిగించిన ఘనతను పొందారు. సంస్కృతభాషకు ఆయన చేసిన సేవకుగాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘బాదరాయణ-వ్యాస’ పురస్కారాన్ని అందుకున్నారు.


 

. కన్నడంలో ‘మంకుతిమ్మన కగ్గ’ వెలువబడి ఎనిమిది దశాబ్దాలే దొర్లినవి. అయినా ఇలాంటి మహాగ్రంథం కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న తెలుగునాట సాహితీప్రియులకి అందలేదంటే అది ఉభయభాషల బాంధవ్యానికే తీరని తలవంపు.

స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.