సాహిత్య వాతావరణంలో స్తబ్దత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అయితే, వచ్చే ప్రతి రచనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణ నిస్తుంది.

రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ అంతంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది. జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్ళూ భాషలవాళ్ళూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం. నిజానికి అదో గొప్ప అవకాశం.

సోమరాజు సుశీల పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని డబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.

మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్‌ విన్నాన్‌ చదివాన్‌ చదివాన్‌!

ఒక పెద్ద భూకంపం, నా ఊహల్లో కూడా లేనంతటి పెద్ద భూకంపం వచ్చి, ఈ ప్రపంచం తలకిందులైపోతే ఇప్పుడున్నవన్నీ అర్థంలేనివైపోతాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఐఫోన్లు, సాఫ్ట్‌వేర్లు… అప్పుడు నాలుగ్గింజలు పండించుకోవడమే ప్రధానం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ దానికనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. స్కిల్స్‌ రీడిఫైన్‌ అవుతాయి. బలంగా తవ్వేవాడే అవసరం అవుతాడు. పంట పండించినవాడే మొనగాడు అవుతాడు.

అంతా బానే ఉంది గానీ, ఇన్నాళ్ళూ చేతులు కట్టుకు కూచుని, ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం, ఓవర్టేక్ చేసి పెద్దపీట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్‌లుక్ చెయ్యడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కనీసం కొన్నాళ్ళపాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు. అదే నాలాంటి వాళ్ళకి పదివేలు.

నీ కోపం అంతా దినకరన్ మీద. దినకరన్ నిన్ను అవమానించాడు. పీరియడ్. అంతకు మించి ఆలోచించడం వేస్ట్! అవమానం అనే దావానలం ముందు సింపతీలూ, ఓదార్పులూ నీటిబొట్టులాంటివి. ఎంత వద్దనుకున్నా నీకు దినకరన్ రూపమే మనసులో మెదులుతోంది. అతన్ని తలచుకుంటేనే నీకు అసహ్యం. దినకరన్‌ని నువ్వు తిట్టుకోని క్షణం లేదు. అతను కొట్టిన దెబ్బ నువ్వు ఎప్పటికీ మరచిపోలేవు, చిన్నప్పుడు మీ మాస్టారు చేసిన అవమానంలా. కాని వద్దనుకున్నా పదే పదే గుర్తొస్తున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.

ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం

హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం

ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది. మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.

ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.