పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు – ఆంధ్రభాషలో చారిత్రక నవల గురించి నోరి నరసింహశాస్త్రి పరిచయ వ్యాసం, కొల్లాయి గట్టితేనేమి నవలపై రారా సమీక్షావ్యాసం, ఇర్వింగ్ స్టోన్ వ్రాసిన జీవిత నవల వ్యాసానువాదం ఈ సంచికలో మీకోసం.


ఈ సంచికలో: పాలపర్తి ఇంద్రాణి, తః తః, వైదేహి శశిధర్, విన్నకోట రవిశంకర్, కనకప్రసాద్‌ల కవితలు; సి. ఎస్. రావ్, జెజ్జాల కృష్ణ మోహన రావు, సురేశ్‌ కొలిచాల, వేలూరి వేంకటేశ్వర రావు, పప్పు నాగరాజుల వ్యాసాలు;గౌరి కృపానందన్, మాధవ్‌ మాచవరం, కొల్లూరి సోమ శంకర్, ఆర్. దమయంతిల కథలు; చీమలమర్రి బృందావనరావు, కనకప్రసాద్‌ల శీర్షికా వ్యాసాలు – నాకు నచ్చిన పద్యం, మూడు లాంతర్లు, రెండు కవితలకు గిరిధరరావు ప్రశంస, వేలూరి చెప్పే కథ నచ్చిన కారణం

ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్‌గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత రావు రచన, సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రధాన గాయకుడిగా ఆలిండియా రేడియో, బెంగళూరు నుంచి 1978లో ప్రసారమైన ఈ రూపకం అపురూపమైనదని అనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే, స్త్రీల రామాయణపు పాటల విశ్లేషణలో భాగంగా వెల్చేరు నారాయణ రావుగారి ఇంకో వ్యాసం లక్ష్మణదేవర నవ్వు ఈ సంచికలో మీకోసం.


సంగీత్ నాటక్ అకాడెమీ టాగోర్ సమ్మాన్ పురస్కారానికి పట్రాయని సంగీత రావుగారినీ, టాగోర్ రత్న పురస్కారానికి బాలాంత్రపు రజనీకాంత రావుగారినీ ఎన్నుకొన్నారు. వారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఈమాటలో వీరి గురించిన పరిచయ వ్యాసం 88 యేళ్ళ యువకులు.


ఇంకా: ఇంద్రాణి, తః తః, వైదేహి, ముకుంద రామారావు, హెచ్చార్కెల కవితలు; వేలూరి కథ; గౌరి, పూర్ణిమ, మాధవ్‌ల అనువాదాలు; జయప్రభ పుస్తకం అన్నమయ్య పదపరిచయం పై సాయి బ్రహ్మానందం సమీక్ష; పాత కినిమా సంచికలనుండి రోహిణీప్రసాద్ అందించిన సినిమా సంగతులు; పలుకుబడి, మూడు లాంతర్లు, నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం ధారావాహిక శీర్షికలు; కనకప్రసాద్ శబ్ద రచన బాల బేలవు ముద్దరాల. …

తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట ‘సీత గడియ‘పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్ శబ్ద రచన త్రిపురాంతకేశ్వరా!; టంగుటూరి సూర్యకుమారి పాడిన నిర్వాణ షట్కం అపురూపమైన ఆడియో, ఈ సంచికలో ప్రత్యేకతలు.


ఈ సంచికలో: ఇంద్రాణి, దమయంతి, కనకప్రసాద్‌, తఃతః, రవి, ఉదయకళల కవితలు; రోహిణీప్రసాద్ పిలూ రాగ పరిచయం; కొక్కొండ పంతులుగారిపై కృష్ణ మోహన రావు సాహిత్య వ్యాసం; పూర్ణిమ, సాయి బ్రహ్మానందం, శారద, మాధవ్, గౌరిల కథలు; బ్రహ్మానందం పుస్తక సమీక్ష, వేంకటేశ్వరరావు వ్యంగ్య రచన, గిరిధరరావు చెప్తున్న కథ నచ్చిన కారణం, కినిమా పత్రిక ముచ్చట్లు; కనకప్రసాద్, సురేశ్, బృందావనరావుల ధారావాహికా వ్యాసాలు…

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఊర్మిళాదేవి నిద్ర: మన ప్రాచ్య సంస్కృతులలో రామాయణం కేవలం ఒక కావ్యం కాదు. సీతారాముళ్ళు కేవలం దేవతలూ కారు. రామాయాణంలో పాత్రలన్నీ మన జీవితాల్లోని పాత్రలు. మన జీవితాల్లో ఉండే కష్ట నష్టాలు, సుఖదుఃఖాలను మనలాగే అనుభవించే మామూలు మనవాళ్ళు. అందుకేనేమో, మనకెన్ని వందల రామాయణాలో! ఒక్కో రామాయణం చెప్పే కథ ఇంకో రామాయణం చెప్పదందుకే మరి! తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాలుగా తెలుగు స్త్రీల పాటలలో ఒక విడదీయరాని భాగమైపోయిన అచ్చు అలాంటి ఒక రామాయణపు కథే ఊర్మిళాదేవి నిద్ర. ఈ కథ ఇతర భాషల్లో కూడా వున్నా, ఈ పాట నిస్సంశయంగా తెలుగు కవయిత్రి సృష్టి. తెలుగు మహిళావరణంలో మౌఖికసారస్వతంగా మొదట రూపుదిద్దుకున్న ఈ అపూర్వమైన జానపద సాహిత్యం గురించి వివరిస్తున్న వెల్చేరు నారాయణ రావు విశిష్ట వ్యాసం, బి. సుబ్బులు, కోలవెన్ను మలయవాసినిగార్లు పాడిన ఈ పాట, ఈ సంచిక ప్రత్యేక ఆకర్షణలు.


09 జనవరి: ఆకస్మిక ప్రచురణ – వేణునాదం ఆగింది! ఏల్చూరి విజయరాఘవరావుగారికి రోహిణీప్రసాద్ నివాళి.

ఈ సంచికలో మీకోసం: చంద్ర, సుబ్రహ్మణ్యం, దమయంతి, రామసీత, గౌరి తదితరుల కథలు; కనకప్రసాద్, వంశీకృష్ణ, హెచ్చార్కె, జాన్‌హైడ్, తః తః, దేశికాచార్యుల కవితలు; మోహనరావు, వెంకటరమణ, నారాయణ రావు, రోహిణీప్రసాద్ తదితరుల వ్యాసాలు; మలయవాసిని, సుబ్బులు, కనకప్రసాద్ శబ్ద తరంగాలు; నాకు నచ్చిన పద్యం, పలుకుబడి, కథ నచ్చిన కారణం తదితర శీర్షికలు… …

అత్తిపట్ కృష్ణస్వామి రామానుజన్ (A. K. Ramanujan, 1929-93) మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉంటూ దక్షిణ భారత భాషల సాహిత్య స్వరూప పరిణామాలని నిశితంగా పరిశీలించిన విద్యాధికుడు. “భారతీయ చింతన అంటూ ఒకటున్నదా?” అనే ఒక ప్రముఖ వ్యాసం ద్వారా భారతీయ చింతనలో సందర్భ గ్రాహ్యత (Context sensitivity) గురించి విశ్లేషించాడు. భారతీయ సాహిత్యంలో మౌఖిక, లిఖిత పార్శ్వాల అనుబంధంపై విశేషమైన పరిశోధనలు చేశాడు.

చర్చ, విమర్శ, తర్క మీమాంసలకు దోహదం చేస్తూ విద్యార్థుల వివేచనకు పదును పెట్టవలసిన విశ్వవిద్యాలయాలే అతివాదశక్తుల ఒత్తిడికి లోనై తమ గురుతర బాధ్యతను, భావ స్వతంత్రతను విస్మరించి పుస్తకాలని, వ్యాసాలని నిషేధించడం గర్హణీయం. ఈమధ్యనే ముంబయి విశ్వవిద్యాలయం రోహింటన్ మిస్త్రీ వ్రాసిన పుస్తకాన్ని పాఠ్యక్రమం నుండి తొలగించింది. ఇప్పుడు రామాయణాన్ని దూషిస్తున్నదన్న అకారణంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎ. కె. రామానుజన్ వ్రాసిన మూడువందల రామాయణాలు అన్న వ్యాసాన్ని చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించింది. నిజానిజాలు మనం తెలుసుకోవడం కోసం ఆ తొలగించిన వ్యాసాన్ని సురేశ్ కొలిచాల తెలుగులోకి అనువాదం చేసి ఈ సంచికలో అందిస్తున్నాడు.


ఈ సంచికలో: దేవులపల్లి కృష్ణశాస్త్రి నాటికలనుంచి ఆనాటి పాటలు; మెలికముగ్గులపై కృష్ణ మోహనరావు శాస్త్రవ్యాసం; రోహిణీప్రసాద్, సాయి బ్రహ్మానందం, కనకప్రసాద్ వ్యాసాలు. కొత్త రచయిత చంద్రశేఖర్ కథ అనుభవం, ఇతర కథలు; భగవంతం, నారాయణ, రవిశంకర్ తదితరుల కవితలు; పద్యం, పలుకు, పాట, కథ ఇతరత్రా శీర్షికలు, మీకోసం.

వేగుంట మోహన ప్రసాద్ (05జనవరి 1942 – 03ఆగస్ట్ 2011): మో’ గా సుప్రసిద్ధుడైన అపరిచితుడు కవి వేగుంట మోహనప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు. మొట్టమొదట ప్రచురించబడ్డ కవిత హిమానీహృది, 1960 మే నెల భారతిలో. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ ‘చితి-చింత’ (1969) మో’కి తెలుగు కవుల్లో ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. ‘రహస్తంత్రి’, ‘సాంధ్యభాష’, ‘పునరపి’, ‘నిషాదం’, ఇలా ఎన్నో ‘నీడలూ జాడ’ల్లో ఆయన ‘బతికిన క్షణా’ల్లో ఆయన ‘కరచాలనాల’ నుంచి వెలువడినై. తెలుగు కవిత్వపు కాన్వాసు మీద అరాచకంగా ఒలికి అద్భుతమైన ప్రశ్నగా పరిణమించిన రంగు పదం మో’.
 


ఈ సంచికలో – కొత్త రచయిత బులుసు సుబ్రహ్మణ్యం, లైలా యెర్నేని, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి, కె.వి. గిరిధరరావుల కథలు; గౌరి కృపానందన్ అనువాద కథ; కృష్ణదేశికాచార్యులు, పాలపర్తి ఇంద్రాణిల కవితలు; భీమ్‌సేన్‌జోషీ రావు బాలసరస్వతీదేవి గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీత వ్యాసాలు; జెజ్జాల కృష్ణ మోహనరావు, కనకప్రసాద్, వేలూరి వేంకటేశ్వరరావు, భద్రిరాజు కృష్ణమూర్తుల వ్యాసాలు; ఒక మో కవిత; తానా 2011 సమావేశపు సాహిత్య ప్రసంగాల చిత్రతరంగాలు, ఇంకా…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకుంటున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఈ సమావేశాలకు తెలుగు దేశం నుంచి ఎందరో రాజకీయ కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. తానా సాహిత్య సమావేశంలో మేడసాని మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాత్యాయనీ విద్మహే, మృణాలిని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొంటున్నారు. బాపూ బొమ్మల కొలువు ఈ సమావేశంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.

ఈ సందర్భంగా కె.వి. గిరిధరరావు సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకు లోని సాహిత్యాన్ని ఈమాట గ్రంథాలయంలో పొందు పరిచాము. ఇలా సావనీరులో ప్రచురించబడిన రచనలను మరెందరో పాఠకులు చదవగలిగే ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు.

తెలుగు పలుకు – తానా 2011 ప్రత్యేక సంచిక


ఈ సంచికలో మీకోసం – ఆర్. దమయంతి వానజల్లుల జ్ఞాపకాలు; వేలూరి చెప్పిన కథ నచ్చిన కారణం; భైరవి రాగంపై రోహిణీప్రసాద్ సంగీత వ్యాసం; ఇంద్రాణి, ఉదయకళ, కృష్ణదేశికాచార్యుల కవితలు; మరి కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం; పాత సినిమా పత్రిక కినిమా నుంచి సేన్ గుప్తా వ్యాసం; తదితర రచనలు.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ (7 మే 1861 – 7 ఆగస్ట్ 1941) 150వ జన్మదిన వార్షికోత్సవం (మే 7 – మే 9) శాంతినికేతన ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది. ఈ సందర్భంగా కవయిత్రి కేతకి కుషారి డైసన్ చేసిన టాగోర్ కవితల అనువాదాల సంకలనం పెంగ్విన్ ఇండియా వారు విడుదల చేస్తున్నారు. టాగోర్ పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ కవులచే గీతాంజలి కవితల పఠనం, వాచికాంజలి, నృత్యాంజలి, కావ్యాంజలి తదితర సాహిత్య లలిత కళా కార్యక్రమాలను ప్రదర్శించబోతున్నారు.
 


 

  • ఇంద్రాణి, సుబ్రహ్మణ్యం, స్వాతికుమారి, దేశికాచారి కవితలు; సాయి బ్రహ్మానందం చెప్పే కోనసీమ కథ; గిరిధరరావు చెప్పిన ‘నల్లతోలు’ కథ నచ్చిన కారణం; సోమ శంకర్ అనువాద కథ గాంధీ అభిమాని.
  • పలుకుబడి లో వ్యుత్పత్తి, నిరుక్తములపై సురేశ్ కొలిచాల భాషా శాస్త్ర వ్యాసం; కనకప్రసాద్ సాహిత్య చింతన ‘మూడు లాంతర్ల’లో మరొక భాగం; మందుల పరిశోధన గురించి మోహనరావు వ్యాసం; బృందావనరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం.
  • మోహనరావు టాగోర్ గీతాలకు చేసిన అనువాదాలు, మాతృకలు; శ్రీనివాస్ సేకరించి పంపిన కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం లోపలి పిలుపు విని, ఈ సంచికలో మీకోసం.

ముళ్ళపూడి వెంకట రమణ (28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011): సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం – ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత – ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ పెన్ను మూశారు. వారికి మా శ్రద్ధాంజలి.

  • ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు ప్రవేశపెడుతున్నాం.
  • పలుకుబడి – తెలుగు పదాలపై సురేశ్ కొలిచాల కొత్త శీర్షిక ప్రారంభం.
  • ఒక కథ చెప్పిన కథ; కనకప్రసాద్ కవిత, వ్యాసం, శబ్ద సాహిత్యం; సత్య పెట్లూరి మొదటి కథ కాలనీ భోగి; ఇంద్రాణి, దమయంతి, ఉదయకళ, రవిశంకర్, కృష్ణదేశికాచార్యుల కవితలు, వేలూరి వేంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందంల కథలూ, ఇతర శీర్షికలు, వ్యాసాలు – ఈ సంచికలో మీకోసం.

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

కోవెల సంపత్కుమారాచార్య (26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010): శ్రీ కోవెల జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ‘తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము’ అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ – లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం కవితా కావ్యాలు; విశ్వనాథ కవిత్వ విమర్శ, కన్యాశుల్క నాటక విమర్శ, వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ, అనేక తదితర సాహిత్య వ్యాసాలు – తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు, కవి, విమర్శకుడు, నిగర్వి, స్నేహశీలి, ఒక మామంచి మనిషీయన. సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం ‘విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార‘ సహితంగా ఈ స్మారక సంచికలో మీకోసం…

ఈ సంచికలో:

  • ‘కథ నచ్చిన కారణం’ కొత్త శీర్షిక ప్రారంభం. పాల్గొనమని మా పాఠకులకు ఆహ్వానం.
  • విన్నకోట రవిశంకర్ కవిత్వ పరిశీలన, నాటికి నేడు రేడియో నాటిక, దేశికాచారి, వైదేహి శశిధర్, పాలపర్తి ఇంద్రాణి తదితరుల కవితలు. జెజ్జాల కృష్ణ మోహనరావు తిరుక్కుఱళ్ అనువాదం కామవేదం. ఇంకా…

నువ్వు లేవు నీ పాట వుంది, ఇంటి ముందు జూకా మల్లెల్లో చుట్టుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని.. అంటూ అద్భుతమైన వచన కవిత్వాన్ని మనకందించి అకాలంగా కాలం చేసినా మన మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన ఇలా గుర్తు రావడానికి ఏ సందర్భమూ లేదు, అక్కర్లేదు. ఆ కవితా సతి నొసటి రసగంగాధర తిలకపు చుక్కలు కొన్ని ప్రత్యేకంగా, శబ్దతరంగాలు, కథలు, కవితలు, వ్యాసాలతో కలిసి ఈ సంచికలో ఈమాట పాఠకుల కోసం.

సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఈ యేటికి ఐదువందల సంవత్సరాలయింది. కృష్ణరాయని కాలంలో తెలుగు వారికి ప్రసాదమైన అపురూప సాహిత్యమూ, దక్షిణాపథ చరిత్రలో ఆ కాలానికి గల విశిష్టతల ప్రభావంతో, ఈ సంచికను శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాం. ఈ సంచికలో కథలు, కవితలు, శీర్షికలతో పాటుగా విజయనగర సామ్రాజ్యం గురించిన చారిత్రాత్మక వ్యాసాలు; కీ. శే. వేటూరి సుందరరామమూర్తి రచించిన సంగీత నాటిక ఆడియో ప్రత్యేకంగా ఈమాట పాఠకుల కోసం పొందుపరిచాం. ఈ సంచికలో మీకోసం…

ఈ సంచికలో మీకోసం:       సుప్రసిద్ధ హిందీ కవి బాబా నాగార్జున కవిత్వాన్ని, అంతస్సు – బాహ్యప్రపంచాల సంబంధాల్ని విశ్లేషిస్తూ చాకిరేవు ఉపేంద్ర సమగ్ర వ్యాసం; శబ్దతరంగాలలో రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో; వసంత ఋతువుని సాహిత్యంలో సంగీతంలో పరిచయం చేస్తూ జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం; ఇంకా ఎన్నో కవితలు, కథలు, శీర్షికలూ…

ఈ సంచికలో మీకోసం…

ద్రౌపది నవల పై చెలరేగుతున్న వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం ఇతిహాసాలూ, ప్రబంధాలూ; జయదేవుని అష్టపది సా విరహే తవదీనా పై పాటలతో, అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసం; సహజగాయని ఎస్.వరలక్ష్మి పాడిన అపురూపమైన పాటలు కొన్ని అందిస్తూ పరుచూరి శ్రీనివాస్ శబ్దతరంగాలలో; ఇంకా కవితలు, వ్యాసాలూ, శీర్షికలూ….

!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
!!!

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత, కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ, శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఇంకా…

గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 – ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి రాసిన ఉత్తరాలు, విమర్శకుల వ్యాసాలు, పాలగుమ్మి రేడియో చర్చ, అలాగే రోహిణీప్రసాద్, లక్ష్మన్న, హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం. ఇంకా…

సెప్టెంబరు 2009 సంచికలో మీకోసం –
శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ; ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది – వేమూరి వెంకటేశ్వర రావు వ్యాసం; శాశ్వత్, వింధ్యవాసిని కన్నడ మూలం నుంచి అనువాదం చేసిన కథ కెంధూళి; పాబ్లో నెరూడా కవితకు తెనుగు సేత ఈ రాత్రి నేను రాయగలను – బొల్లోజు బాబా కవిత.

జులై 2009 సంచికలో–
నిద్రిత నగరం – వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్ష, వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో ‘ప్రభావం’ అంటే ఏమిటి?, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం: ఫాదర్స్ డే. ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు.

వస్తున్న వసంత ఋతు శుభాకాంక్షలతో ఈమాట మే 2009 సంచికకు స్వాగతం.

కొత్తగా:

– ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం.
– అభిప్రాయ నియమావళి అవసరాన్ని వివరిస్తూ పాఠకుల కోసం ఈమాట సంపాదకుల వ్యాసం. చర్చకు ఆహ్వానం.
– పొరపాటున బహిర్గతమైన ప్రైవేటు ఉత్తరం– ఈమాట ముఖ్య సంపాదకుడు, ప్రచురణకు వచ్చే రచనలపై తన   సంపాదక బృందానికి రాసిన మెమో. ఇంకా…