మహా భక్తులు కవులు ఐన పోతన,అన్నమయ్య వంటి వారి గురించి ఒకే ఒక్క పేజీ వ్యాసం వ్రాయడం వారి అభిమానులైన మా బోటి వారికి ఆశాభంగమై నిరుత్సాహంగా అనిపిస్తుంది. వ్యాసకర్తలూ, సంపాదకులూ స్థలం కై లోభించకుండా ఇటువంటి వారిపై వ్యాసాలను బెజ్జాల వారి వ్యాసాల నిడివికన్నా రెండు మూడింతల నిడివిలో ఇంకా అనేక విషయాలను పొందుపరచి ప్రచురించాలని కోరుకుంటున్నాను. వ్యాసం అలరించింది కానీ మనస్సు ఇంకా కావాలని కలవరించింది. నా నిత్య దేవతారాధన 2-3 అన్నమయ్య సంకీర్తనలతో కానీ సంపూర్ణం కాదు. అన్నమయ్య గారు ఎక్కువ తెలుగు పదాలే వాడారు కానీ అవి వారి మాండలికాలై మండలేతరులమైన మా వంటి వారికి గ్రాహ్యం కాక ఒక్కొక్క చోట పూర్తి భావమే అవగతం కావడం లేదు. నిప్పట్టు వివరించిన లాగానే విజ్ఞులైన సహ పాఠకులు నా సందేహాలని తీరుస్తారని ఆశిస్తాను.
మూసిన ముత్యాల కేలే మొరకులు
ఆశల చిత్తాల కేలే అలవోకలూ
మొరకులు – అలవోకలు పదాల అర్ధం మొత్తం పల్లవి భావం కావాలి.
పరమ మూర్తి, హరి, ప్రహ్లాద వరదుడు, కరుణానిధి, బుధ కల్పమూ
బరగు శ్రీ వేంకట పతి తన దాసుల అరుదుగ గాచే అనంతుడితడు
ఇక్కడ అరుదు పదానికి మనకు తెలిసిన అర్ధం అన్వయం కావడంలేదు
ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహా!
ఇక్కడే గాక ఇంకో వేరే కీర్తనలో కూడా నృసింహునికి ఫాలనేత్ర ప్రశంస వున్నది. ఇందులో ఔచిత్యం.
మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామి యూయం
చింతయామి యూయం అర్ధం.
ఒకవేళ నాకు తెలిసిన సాహిత్యమే తప్పైన పక్షంలో సరిఐన పదాలను తెలుపవలసినదిగా ప్రార్ధన.
మదరాసులో బిన్నీ గాడు ఎవి తెచ్చేడో నీకేవి చెప్పేడో, అసలే వాడి ఊరు పుంగనూరు. నిప్పట్లంటే రాయలసీమ సంగతేవో గాని, నెల్లూరులో మీ అరిసెల్ని నిప్పట్లంటారు. పెద్ద పండగకి చేసుకునే అప్పచ్చులు అనమాట. రొట్టె పదం సంస్కృతవా, పారసీకవా? పిండి కొద్ది రొట్టెని, పిండి కొద్ది నిప్పటని (మా పక్క మీ ఉల్లిపాయల్ని, ఎర్ర గడ్డలంటారు, ఎర్రగా వుంటాయి కాబట్టి, అట్లనే ఎర్రగా నిప్పులా వుండే మీ అరిశలు, బెల్లపరిశలు, నెల్లూరులో నిప్పట్లయినాయి, బహుశా రాయలసీమలో కూడా నిప్పట్లంటే అరిశలే కావొచ్చు) అన్నమాచార్యులవారు (అప్పటి తెలుగుదేశంలో రొట్టెలుతినే వాళ్ళెవరు) ఆ ప్రాంతానికి అణుగుణంగా రొట్టెని, నిప్పటిగా మార్చుకున్నారెవో, సంస్కరించుకున్నారేవో?
పిండంతే నిప్పటి యన్నట్లు అంటే పిండికొద్దీ రొట్టె యన్నట్లు అని అనుకుంటున్నాను. నిప్పట్టు రాయలసీమ కారపు అప్పచ్చి. మొదటిసారి పుంగనూరు నుంచీ “బిన్నీగాడు” తీసుకొస్తే “మద్రాసు” లో రుచి చూసేను. అచ్చు సేమ్ డిటో చేగోడీ. మెటీరియలూ అదే, వేయించడవూ అదే. కనస్ట్రక్షన్ లో తేడా, అంతే. చేగోడీలు నలుపుతారు. జబ్బలు పడిపోతాయి. అదీ గాకుండా చక్కగా వ్రుత్తాల్లా చుట్టకపోతే తిట్లు తప్పవు. గొళ్ళేల్లా చుట్టెస్తే ఇంకా తిట్లు. నూనె ఎక్కువ పీల్చకుండా ఏదో టెక్నిక్ తో మా మేనత్త చేగోడీలు చేసీదికాని అవి “కటక, పటక్” మంటాయి. కరకరలాడవు. బావుండవు. అన్నట్టు నూనె బాగా పీల్చి కరకరలాడీ చేగోడీల్ని జేబులో వేసుకుని ఆడుకుందుకి వెళ్ళకూడదు. ఆ రాత్రి ఎలకలు జేబులు కొట్టెస్తాయి. నిప్పట్లు అప్పచ్చుల్లా చేస్తారు. నలపరు. బహుశా నిప్పట్లని ఉండలా చుట్టిన పిండిని అరచేతిలో పల్చగా అప్పచ్చిలా చేసి వేయిస్తారు కాబోలు. చిన్న ఉండయితే చిన్న నిప్పట్టు, పెద్ద ఉండయితే పెద్ద నిప్పట్టు.
పిండికొద్దీ రొట్టె అన్న ప్రయోగం “పిండంతే నిప్పటి” ముందుదా వెనకదా? రొట్టెలు అన్నమయ్య టైములో లేవా? వున్నా లేకపోయినా నిప్పట్ల వల్ల చేగోడీలకోసం ఏడవడం తప్పిపోయింది నాకు. చిన్నప్పటి పోగుట్టుకున్నాననుకున్న, మరి దొరకదు గాక దొరకదనుకున్న “బంతి” దొరికిందినాకు. అన్నమయ్య పాటల్లో ఇన్ని మంచి వూసులున్నాయా?
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు,ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి
తెలుగు వారందరికి
వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన
రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
ప్రాస నా బడు నగల్ దీసినారు
శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
పాత పెట్టెల పార వైచినారు
లలిత నారీకేళ రస రమ్య పాకాల
చీనాంబరాల్ చింపి చీల్చినారు
కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
మంజీరముల హత మార్చినారు
తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు
పలుభూషణంబులు వలదంటి నే గాని
తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
వస్త్రమే వలదని పలికితొక్కొ?
పలుగతులను నృత్యముల సేయ భరమంటి
నడవనే నని సుడి వడితి నొక్కొ?
భావ భాషాది భూషల బార వైచి
యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
నిలిపి నారయ్యయో మది తొలచినారు
నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.
చారి గారూ!
“నిప్పట్టు” అన్న ది రాయలసీమ ప్రాంతం వాడుక. అరిసె లేదూ అలాంటిది. ఎంత పాటి పిండి అయితే..ఆ అట్టు అంత పాటే అన్న ట్టుగా అన్నమాట. పిండి ఎంతో నిప్పట్టు కూడా అంతే అని సామెత గా అన్నమయ్య ఉపమిస్తున్నాడు. నిప్పు మీద కాల్చే అట్టు “నిప్పట్టు”..అని.
“ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన..అంత మాత్రమే నీవు ..అంతరాంతరములెంచి చూడ..పిండంతే నిప్పటు అన్న ట్టూ.”…అన్న ది
అన్నమయ్య ..అన్న మాట. అంటే ….ఎవరి భావన ఎంత మేరకు వుందో..వారి ఊహని అనుసరించే ఆ మేరకు మాత్రమే..వారికి ఆ దేముని దర్శన ప్రాప్తి సాధ్యమౌతుంది..అని చెప్పే సందర్భంలో ఈ సామెతని అన్నమయ్య వాడటం
మీరు గమనించండి. ఇప్పుడు మీకు భావం..సామెతతో కలిసి స్పష్టపడిందనుకుంటాను.
“పిండంతే నిప్పటి” అనే పలుకుబడి “పిండి కొద్ది రొట్టె” కి సమానార్థకం. బ్రౌన్ నిఘంటువు లోంచి:
నిప్పటి (p. 0654) [ nippaṭi ] or నిప్పట్టు nippati. [Tel. నిప్పు+అట్టు.] n. A sort of cake or biscuit. ఆకులలో పెట్టి కాల్చు భక్ష్యము.
(http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=nippaTi&table=brown)
ఈ నడుమనే రాముని తోక పివరుడిట్లనియె అన్నట్లు మీరు ఉదహరించిన పలుకుబడిని “పిండం తేనె ఇప్పటి అన్నట్లు” అని విరిచి చదువుకున్న శబ్ద విరించిని నేను 🙂
తెలుగు సినీ సంగీతంలో రెండు యుగాలున్నాయి. ఒకటి ఘంటసాల యుగం. ఇంకొకటి బాలు యుగం. దేనికదే ప్రత్యేకమైనది. ఘంటసాల వారిది 30 యేళ్ళ యుగం. బాలు వారిది కూడ ఇంచుమించు అంతే. ఒక యుగం మరొక యుగానికి స్వాగతం పలికే యుగ సంధి కాలంలో వారిద్దరూ కలసి పాడిన పాటలు- ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ‘ అనే ఉదయ గీతం మొదటిదైతే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే రేయి గీతం రెండవది. ఇక ఆ తర్వాత వచ్చినవి-‘భలే మజాలే భలే ఖుషీలే టయిము రోజాలే మనం రాజాలే’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా …. వినండి’. ఈ రెండు యుగాల్లో మంచి పాటలూ వచ్చాయి, ‘అయ్యో ఖర్మ’ అనుకునేలా చెడ్డ పాటలూ వచ్చాయి. ఇప్పుడు కేవలం మంచి పాటలే ముందు తరాలకు అందేలా చూడాలి. అందుకు అద్భుతమైన సాధనం- కంప్యూటరే. కంప్యూటర్ ఘంటసాల యుగంలో అంత అందుబాటులో లేదు. అందాక ఎందుకూ? క్యాసెట్లే లేవు. కాని కంప్యూటర్ యుగంలో ఘంటసాల పాట ఇంకా ఉంది. బాలు చాలా అద్రుష్టవంతులు. సాంకేతిక ప్రగతిని అంచెలంచెలుగా చూస్తూ తన గొంతును రక్షించుకుంటున్నారు. తెలుగు మాట కరువైపోతున్న ‘కన్ ఫ్యూజన్ యుగంలో తెలుగు పాట ‘రస హీనమై పోతోంది’, పాడేవారి విషయంలో ‘వారస హీనమై పోతోంది’.
– డా. తాతిరాజు వేణుగోపాల్
భాషా విజ్ఞానాల కలబోతగా సురేష్ గారు అందించిన ఈ వ్యాసమ్ ఓ వైపు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగించడమే గాక విశ్వ సామ్యాన్ని కూడా అందించడం రచయిత పటిమను స్పష్టం చేస్తొంది.. మరిన్ని జ్ఞాపకాల కోసమ్ ఎదురుచూస్తూ ..
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/26/2009 10:47 pm
మహా భక్తులు కవులు ఐన పోతన,అన్నమయ్య వంటి వారి గురించి ఒకే ఒక్క పేజీ వ్యాసం వ్రాయడం వారి అభిమానులైన మా బోటి వారికి ఆశాభంగమై నిరుత్సాహంగా అనిపిస్తుంది. వ్యాసకర్తలూ, సంపాదకులూ స్థలం కై లోభించకుండా ఇటువంటి వారిపై వ్యాసాలను బెజ్జాల వారి వ్యాసాల నిడివికన్నా రెండు మూడింతల నిడివిలో ఇంకా అనేక విషయాలను పొందుపరచి ప్రచురించాలని కోరుకుంటున్నాను. వ్యాసం అలరించింది కానీ మనస్సు ఇంకా కావాలని కలవరించింది. నా నిత్య దేవతారాధన 2-3 అన్నమయ్య సంకీర్తనలతో కానీ సంపూర్ణం కాదు. అన్నమయ్య గారు ఎక్కువ తెలుగు పదాలే వాడారు కానీ అవి వారి మాండలికాలై మండలేతరులమైన మా వంటి వారికి గ్రాహ్యం కాక ఒక్కొక్క చోట పూర్తి భావమే అవగతం కావడం లేదు. నిప్పట్టు వివరించిన లాగానే విజ్ఞులైన సహ పాఠకులు నా సందేహాలని తీరుస్తారని ఆశిస్తాను.
మూసిన ముత్యాల కేలే మొరకులు
ఆశల చిత్తాల కేలే అలవోకలూ
మొరకులు – అలవోకలు పదాల అర్ధం మొత్తం పల్లవి భావం కావాలి.
పరమ మూర్తి, హరి, ప్రహ్లాద వరదుడు, కరుణానిధి, బుధ కల్పమూ
బరగు శ్రీ వేంకట పతి తన దాసుల అరుదుగ గాచే అనంతుడితడు
ఇక్కడ అరుదు పదానికి మనకు తెలిసిన అర్ధం అన్వయం కావడంలేదు
ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహా!
ఇక్కడే గాక ఇంకో వేరే కీర్తనలో కూడా నృసింహునికి ఫాలనేత్ర ప్రశంస వున్నది. ఇందులో ఔచిత్యం.
మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామి యూయం
చింతయామి యూయం అర్ధం.
ఒకవేళ నాకు తెలిసిన సాహిత్యమే తప్పైన పక్షంలో సరిఐన పదాలను తెలుపవలసినదిగా ప్రార్ధన.
భవదీయుడు
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి ravikiran Timmireddy గారి అభిప్రాయం:
04/26/2009 7:22 pm
బాబ్జీ,
మదరాసులో బిన్నీ గాడు ఎవి తెచ్చేడో నీకేవి చెప్పేడో, అసలే వాడి ఊరు పుంగనూరు. నిప్పట్లంటే రాయలసీమ సంగతేవో గాని, నెల్లూరులో మీ అరిసెల్ని నిప్పట్లంటారు. పెద్ద పండగకి చేసుకునే అప్పచ్చులు అనమాట. రొట్టె పదం సంస్కృతవా, పారసీకవా? పిండి కొద్ది రొట్టెని, పిండి కొద్ది నిప్పటని (మా పక్క మీ ఉల్లిపాయల్ని, ఎర్ర గడ్డలంటారు, ఎర్రగా వుంటాయి కాబట్టి, అట్లనే ఎర్రగా నిప్పులా వుండే మీ అరిశలు, బెల్లపరిశలు, నెల్లూరులో నిప్పట్లయినాయి, బహుశా రాయలసీమలో కూడా నిప్పట్లంటే అరిశలే కావొచ్చు) అన్నమాచార్యులవారు (అప్పటి తెలుగుదేశంలో రొట్టెలుతినే వాళ్ళెవరు) ఆ ప్రాంతానికి అణుగుణంగా రొట్టెని, నిప్పటిగా మార్చుకున్నారెవో, సంస్కరించుకున్నారేవో?
రవి
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి baabjeelu గారి అభిప్రాయం:
04/26/2009 8:33 am
పిండంతే నిప్పటి యన్నట్లు అంటే పిండికొద్దీ రొట్టె యన్నట్లు అని అనుకుంటున్నాను. నిప్పట్టు రాయలసీమ కారపు అప్పచ్చి. మొదటిసారి పుంగనూరు నుంచీ “బిన్నీగాడు” తీసుకొస్తే “మద్రాసు” లో రుచి చూసేను. అచ్చు సేమ్ డిటో చేగోడీ. మెటీరియలూ అదే, వేయించడవూ అదే. కనస్ట్రక్షన్ లో తేడా, అంతే. చేగోడీలు నలుపుతారు. జబ్బలు పడిపోతాయి. అదీ గాకుండా చక్కగా వ్రుత్తాల్లా చుట్టకపోతే తిట్లు తప్పవు. గొళ్ళేల్లా చుట్టెస్తే ఇంకా తిట్లు. నూనె ఎక్కువ పీల్చకుండా ఏదో టెక్నిక్ తో మా మేనత్త చేగోడీలు చేసీదికాని అవి “కటక, పటక్” మంటాయి. కరకరలాడవు. బావుండవు. అన్నట్టు నూనె బాగా పీల్చి కరకరలాడీ చేగోడీల్ని జేబులో వేసుకుని ఆడుకుందుకి వెళ్ళకూడదు. ఆ రాత్రి ఎలకలు జేబులు కొట్టెస్తాయి. నిప్పట్లు అప్పచ్చుల్లా చేస్తారు. నలపరు. బహుశా నిప్పట్లని ఉండలా చుట్టిన పిండిని అరచేతిలో పల్చగా అప్పచ్చిలా చేసి వేయిస్తారు కాబోలు. చిన్న ఉండయితే చిన్న నిప్పట్టు, పెద్ద ఉండయితే పెద్ద నిప్పట్టు.
పిండికొద్దీ రొట్టె అన్న ప్రయోగం “పిండంతే నిప్పటి” ముందుదా వెనకదా? రొట్టెలు అన్నమయ్య టైములో లేవా? వున్నా లేకపోయినా నిప్పట్ల వల్ల చేగోడీలకోసం ఏడవడం తప్పిపోయింది నాకు. చిన్నప్పటి పోగుట్టుకున్నాననుకున్న, మరి దొరకదు గాక దొరకదనుకున్న “బంతి” దొరికిందినాకు. అన్నమయ్య పాటల్లో ఇన్ని మంచి వూసులున్నాయా?
రచయితలకు సూచనలు గురించి suresh గారి అభిప్రాయం:
04/26/2009 12:33 am
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు,ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/25/2009 12:01 am
తెలుగు వారందరికి
వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన
రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
ప్రాస నా బడు నగల్ దీసినారు
శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
పాత పెట్టెల పార వైచినారు
లలిత నారీకేళ రస రమ్య పాకాల
చీనాంబరాల్ చింపి చీల్చినారు
కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
మంజీరముల హత మార్చినారు
తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు
పలుభూషణంబులు వలదంటి నే గాని
తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
వస్త్రమే వలదని పలికితొక్కొ?
పలుగతులను నృత్యముల సేయ భరమంటి
నడవనే నని సుడి వడితి నొక్కొ?
భావ భాషాది భూషల బార వైచి
యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
నిలిపి నారయ్యయో మది తొలచినారు
నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
04/24/2009 10:42 pm
చారి గారూ!
“నిప్పట్టు” అన్న ది రాయలసీమ ప్రాంతం వాడుక. అరిసె లేదూ అలాంటిది. ఎంత పాటి పిండి అయితే..ఆ అట్టు అంత పాటే అన్న ట్టుగా అన్నమాట. పిండి ఎంతో నిప్పట్టు కూడా అంతే అని సామెత గా అన్నమయ్య ఉపమిస్తున్నాడు. నిప్పు మీద కాల్చే అట్టు “నిప్పట్టు”..అని.
“ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన..అంత మాత్రమే నీవు ..అంతరాంతరములెంచి చూడ..పిండంతే నిప్పటు అన్న ట్టూ.”…అన్న ది
అన్నమయ్య ..అన్న మాట. అంటే ….ఎవరి భావన ఎంత మేరకు వుందో..వారి ఊహని అనుసరించే ఆ మేరకు మాత్రమే..వారికి ఆ దేముని దర్శన ప్రాప్తి సాధ్యమౌతుంది..అని చెప్పే సందర్భంలో ఈ సామెతని అన్నమయ్య వాడటం
మీరు గమనించండి. ఇప్పుడు మీకు భావం..సామెతతో కలిసి స్పష్టపడిందనుకుంటాను.
రమ.
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
04/24/2009 8:48 pm
“పిండంతే నిప్పటి” అనే పలుకుబడి “పిండి కొద్ది రొట్టె” కి సమానార్థకం. బ్రౌన్ నిఘంటువు లోంచి:
నిప్పటి (p. 0654) [ nippaṭi ] or నిప్పట్టు nippati. [Tel. నిప్పు+అట్టు.] n. A sort of cake or biscuit. ఆకులలో పెట్టి కాల్చు భక్ష్యము.
(http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=nippaTi&table=brown)
ఈ నడుమనే రాముని తోక పివరుడిట్లనియె అన్నట్లు మీరు ఉదహరించిన పలుకుబడిని “పిండం తేనె ఇప్పటి అన్నట్లు” అని విరిచి చదువుకున్న శబ్ద విరించిని నేను 🙂
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
04/24/2009 12:03 pm
తెలుగు సినీ సంగీతంలో రెండు యుగాలున్నాయి. ఒకటి ఘంటసాల యుగం. ఇంకొకటి బాలు యుగం. దేనికదే ప్రత్యేకమైనది. ఘంటసాల వారిది 30 యేళ్ళ యుగం. బాలు వారిది కూడ ఇంచుమించు అంతే. ఒక యుగం మరొక యుగానికి స్వాగతం పలికే యుగ సంధి కాలంలో వారిద్దరూ కలసి పాడిన పాటలు- ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ‘ అనే ఉదయ గీతం మొదటిదైతే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే రేయి గీతం రెండవది. ఇక ఆ తర్వాత వచ్చినవి-‘భలే మజాలే భలే ఖుషీలే టయిము రోజాలే మనం రాజాలే’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా …. వినండి’. ఈ రెండు యుగాల్లో మంచి పాటలూ వచ్చాయి, ‘అయ్యో ఖర్మ’ అనుకునేలా చెడ్డ పాటలూ వచ్చాయి. ఇప్పుడు కేవలం మంచి పాటలే ముందు తరాలకు అందేలా చూడాలి. అందుకు అద్భుతమైన సాధనం- కంప్యూటరే. కంప్యూటర్ ఘంటసాల యుగంలో అంత అందుబాటులో లేదు. అందాక ఎందుకూ? క్యాసెట్లే లేవు. కాని కంప్యూటర్ యుగంలో ఘంటసాల పాట ఇంకా ఉంది. బాలు చాలా అద్రుష్టవంతులు. సాంకేతిక ప్రగతిని అంచెలంచెలుగా చూస్తూ తన గొంతును రక్షించుకుంటున్నారు. తెలుగు మాట కరువైపోతున్న ‘కన్ ఫ్యూజన్ యుగంలో తెలుగు పాట ‘రస హీనమై పోతోంది’, పాడేవారి విషయంలో ‘వారస హీనమై పోతోంది’.
– డా. తాతిరాజు వేణుగోపాల్
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి D Srinivasa Chary గారి అభిప్రాయం:
04/23/2009 11:12 pm
చాలా బాగా అభివర్ణించారు అన్నమయ్య కీర్తనలోని తెలుగుతనాన్ని.
చిన్న సందేహం. పిండంతే నిప్పటి యన్నట్లు అనే పలుకుబడికి అర్థం చెపతారా?
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి ranganath middela గారి అభిప్రాయం:
04/23/2009 2:13 am
భాషా విజ్ఞానాల కలబోతగా సురేష్ గారు అందించిన ఈ వ్యాసమ్ ఓ వైపు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగించడమే గాక విశ్వ సామ్యాన్ని కూడా అందించడం రచయిత పటిమను స్పష్టం చేస్తొంది.. మరిన్ని జ్ఞాపకాల కోసమ్ ఎదురుచూస్తూ ..
రంగనాథ్ మిద్దెల