వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము.

ఆ సంధియుగములో తెలుగు సాహిత్యములో ముగ్గురు హేమహేమీలు ఉండేవారు, వారు – కొక్కొండ వేంకటరత్నము పంతులు, కందుకూరి వీరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి. అందరూ చిన్నయ సూరి విధానమే అనుసరించారు. కాని వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ. ముగ్గురికీ మూడు పత్రికలు ఉండేవి.

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.

ఆమెని గుర్తు పట్టగానే అక్కడున్న మిగతా స్త్రీలందరూ నిర్ఘాంత పోయారు. మెల్లిగా వారిలో వారు గుస గుసలు పెట్టుకున్నారు. “సిగ్గులేని మొహం”, “తగుదునమ్మా అంటూ వీధిలోకొచ్చింది” పెద్దగానే మాటలు వినపడటంతో ఆమె తలెత్తి చూసింది.

ఓసారి పండక్కి అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వీళ్ళని కలవడానికి వెళ్ళాను. అబ్బులు రాలేదు. ఏవిటాని ఆరా తీస్తే అతని ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనీ, ఆ బాధ భరించలేక దేవదాసయ్యాడనీ విన్నాను. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్ళికుదిరిందనీ తెలిసింది. నేనూ, వకీలూ, కన్నబాబూ అబ్బులింటికి వెళ్ళాం.

ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు.

అప్పల్నర్సిమ్మడికి తర్కం బోధపడలేదు. “సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.

న-కార, ణ-కారాల గురించి, నతిసూత్రం గురించి ఈ మధ్య ఈమాట-అభిప్రాయవేదికపై చర్చ జరిగింది కాబట్టి ఋగ్వేద ప్రాతిశాఖ్యలోని పంచమపటలంలో నతిసూత్రం వివరించిన సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదం ఈ విడత పలుకుబడిలో భాగంగా అందజేస్తున్నాను. అలాగే కళింగత్తుపరణిలో కరునాడు ప్రస్తావన ఉన్న పద్యం గురించి నా అభిప్రాయం కూడా.

శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం.

ఒక ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనస్వి స్వానుభవపు తీవ్రత దీనిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. గుండెలోని బాధని గుదిగుచ్చి పోసిన కవిత ఎంత ఆర్ద్రంగా, హృదయస్పర్శిగా వుంటుందో చెప్పడానికి ఈ చక్కని పద్యం ఒక మంచి ఉదాహరణ.

దుఃఖితుల గాయాలకు చలించి
చెమర్చు చెమరింపులే చందన లేపనాలు
పురివిప్పిన నెమలి పింఛాల అందాలు
మానవాతను పెంచే హృదయాలు!

విలాయత్‌ఖాన్ సితార్ కచేరీ మొదటిసారిగా మద్రాసులో 1965లో. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ స్వయంగా మొదటి వరసలో కూర్చుని, విని ఆనందించిన ఆ కచేరీకి చిట్టిబాబు కూడా హాజరయారు. అందులో విలాయత్‌ఖాన్ పిలూ రాగంలో తన తాతగారు ఇమ్‌దాద్‌ఖాన్, తండ్రి ఇనాయత్‌ఖాన్ వాయించిన పిలూ రాగపు గత్‌లను సగర్వంగా వాయించారు.

మాటలు పద్యాన్ని చెప్పవు. పద్యంలో మాటలు అర్థాన్నివ్వవు. ఆకారం అసలే ఉండదు. రూపం శూన్యం. మాటల్ని గట్టిగా పట్టుకొని చలిమిడి ముద్దలా పిసకండి. పోనీ, మాటల్ని పంచరంగుల ప్లే డౌ లా పిసకండి. పిసకగా పిసకగా పద్యానికి ఆకారం వస్తుంది. అప్పుడు కనిపిస్తుంది కవితలో విశ్వరూపం.