చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.
మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.
మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?
మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.
“పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”
నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.
ఇక్కడ మరో యుద్ధం మొదలైంది కనక నేనూ ఓ సమిధ వేస్తున్నాను. ముందుగా కొన్ని జెనెరిక్ ప్రశ్నలు. శ్రీశ్రీ కి మహాకవి అని బిరుదు ఎవరిచ్చారు? ఒకట్రెండు కవితలు రాయగానే జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చేయరు. మరింత ముఖ్యం గా చెప్పాల్సినదేమిటంటే అవార్డులు దృష్టిలో పెట్టుకుని రాస్తే అవార్డులు రావు. రాసేదానిమీద ఇంటరెస్టూ, ఇష్టం, శ్రద్ధా ముఖ్యం. అవన్నీ ఉంటే వద్దన్నా అవార్డులు వస్తాయి. మరి అవార్డులిచ్చేటప్పుడు కవిగారి “బయటి” వ్యసనాలు కూడా కమిటీ అంతర్గతంగా తప్పకుండా గుర్తుంచుకుంటుంది – అవి పనికిరాని విషయాలైనప్పటికీ వాటి వల్ల అవార్డు రాకపోవచ్చు. వింతేమీ లేదు. ఫలానా కవిగారు రోడ్డుమీద పోయే ప్రతీవాణ్ణీ అప్పులడిగి సిగరెట్లు కాలుస్తూ తాగుడికి బానిస అయ్యాడు అనేది జ్ఞానపీఠ్ అవార్డు రాకపోవడానికి తప్పకుండా సహకరించే విషయం – ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినాను. మీరే కమిటీలో ఉంటే మీరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే రాసేవాడికి సభ్యతా, సంస్కారం అనేది జీవితంలో ఉండాలి. అయినా జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వాలంటే కవితలు సరిపోవు కదా? ఒక కావ్యం రాయాలి – ఒక మాస్తి, ఒక విశ్వనాథ అలా రాసారు కనక వాళ్ళకు ఇచ్చారు. మహా ప్రస్థానం రాసినందుకు నిజంగా శ్రీశ్రీకి జ్ఞానపీఠ్ ఇచ్చి ఉంటే తెలుగు సర్వనాశనం అయిపోయినందుకు అప్పట్లోనే పత్రికలు రాసి ఉండేవి. ఇది నా బోడి అభిప్రాయం.
ఇకపోతే ఇక్కడ రాసినది వ్యాసమా, కధా అనేది సంపాదకులు వాళ్ల ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తారు. ఇలా కూడదూ అలా ఉండాలి అని చెప్పడానికి తెలుగులో కానీ మరే భాషలో కానీ రూల్స్ లేవు. వ్యాసం అంటే ఏమిటి? గూగిల్ చేస్తే రూల్స్ దొరుకుతాయా? దొరికితే మాత్రం ఆ రూల్స్ రాసినవారెవరు? వాళ్ళు బ్రహ్మ పదార్ధాలా? వాళ్ళూ మనుషులే కదా? అంటే ఒక సంపాదకుడు వాళ్ళు చేసే పత్రిక పని బట్టి నిర్ణయిస్తారు. మీకిష్టం ఉంటే చదవండి లేకపోతే లేదు. ఇలా ఉండాలి అని చెప్పడానికి మీకేమిటి క్వాలిఫికేషన్? మీరు ఎడిటరైతే మీ పుర్రెకి పుట్టినట్టూ మీరు చేస్తారు కదా? ఇది వ్యాసం కింద ప్రచురిస్తే ఇదో వ్యాసమా అనే పెద్దమనుషులు బయల్దేరతారు. మొత్తమ్మీద ఇదో తండ్రీ, కొడుకూ, గాడిద కధలా తయారవుతుంది. ఇంతా చేస్తే ఈమాట సంపాదకుల పని జీతంలేని నౌకరీ. చేతుల దురదా, వచ్చిన చెత్తా చదవడం అనేవి థేంక్ లెస్ ఉద్యోగాలు. తెలుగు మీద మమకారంతో చేస్తామని ఒప్పుకుని ఇలా రెక్కలు ఊడగొట్టుకునే వాళ్ళ మీద ఊరికే నోరు పారేసుకోవద్దు.
సందర్భం వచ్చింది కనక మరో విషయం. మాగంటి గారు అట్టు గురించి. అది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ పారడీ ఎందుకు రాయకూడదు? ఇస్మాయిల్ బతికున్న రోజుల్లోనే మాగంటి గారు రాసి ఉంటే దాన్ని ఎడిటర్లు ప్రచురించేవారని నేను ఘంఠాపధంగా చెప్పగలను. నన్ను అడిగితే నాకు అట్టు నా ఆదర్శమే చెట్టుకన్నా బావుంది.
ఇప్పుడు మీలో ఒక్కోరికీ ప్రశ్నలు.
కేశవులు గారు: ఎన్నారైలు ఏదో చేయట్లేదు – ఇక్కడ నూతులు చాలవన్నట్టూ …అన్నారు. నేను మొదట్లో ఎన్నార్టీ, ఆ తర్వాత ఎన్నారై. ఎప్పుడూ తెలుగు చదవడం రాయడం అనేవి మర్చిపోలేదు. నెలల తరబడి తెలుగుకి మొహం వాచి ఏమీ దొరకనప్పుడు ఆఖరికి కాయితం తీసుకుని పోతన పద్యాలు గుర్తున్నంతలో కాయితం మీద రాసుకుని తృప్తి చెందిన రోజులున్నాయి. తెలుగుకి ఏదో ఒక రకంగా కృషి ఎన్నారైలే చేయాలా? మాకేం పనిలేదా? మీరు ఎన్నారై అయితే ఏమి చేసుండేవారు? మీరు ఆంధ్ర దేశాలు రెండింటిలోనూ ఏదో ఒకచోట ఉంటే ఏం చేస్తారేం? తెలుగు మాట్లాడే దేశంలోనే ఉంటూ ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఎన్నారైలు ఈమాట పత్రిక నడుపుతున్నారు అదే మంచిది కదా? ప్రతీ దానికీ అమెరికా, తానా అని మామీద అరుచుకోవడం కంటే మీరు చేసిన కృషి ఏవిటో శేలవీయండి.
కటకటా: ఈమాట చదవమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? సంపాదకులు మీ నోరు పెగిల్చి చేదు మాత్ర మింగించారా? టెంప్లేట్లు అంటున్నారు. అంటే అవేమిటో మీకు తెలుసా? ఏది వ్యాసం, ఏది కధ అనేది తేల్చడానికి ఎవరిది హక్కు? ఓ ముఖ్యమంత్రి కమిటీవేసి పెద్ద తెలుగు చదువుకున్న ప్రొఫెసర్లందరి చేతా చెప్పించాలా? ఈ ప్రొఫెసర్లకి డిగ్రీలు ఎలా వచ్చాయో మీకు తెలియదా? వాళ్ళ సిద్ధాంత గ్రంధాలు మీరు ఎప్పుడైనా చదివారా? పక్కనే ఉన్న అద్భుతమైన గ్రంధాలు వదిలేసి శ్రీశ్రీ రాసిన కవితలు (నేనుంటే, నీవుంటే, వాడుంటే, వీడుంటే.. ఇలా నాలుగు లైన్లు) వాటి మీద పి.హెచ్.డి చేసి పారేసి కమిటీలో కూర్చుంటారు. వీళ్ళా రూల్స్ చెప్పేది? వాళ్లకి మీటింగుల్లో తాగడానికింతా, తినడానికింతా అని ఇచ్చేస్తే మన ఇష్టం వచ్చినట్టు రాసి పెడతారనేది జగమెరిగిన సత్యం.
లక్ష్మణ్ణగారు: ప్రతీ దానికీ ఒక ధన దృక్కోణం, ఋణ దృక్కోణం ఉంటాయండి. ఒక ప్రోబ్లెం ఓరియెంటెడ్ అప్రోచ్, ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ కూడాను. గంగ భువికి దిగకుండా అక్కడే ఆకాశంలో ఉండిపోతే ఏవిటి ప్రయోజనం? ఏనుగు లక్ష్మణ కవిగారి అనువాదం బాగానే ఉంది చదువుకుని సరదాగా అనుకోవడానికి. భువిమీదకి దిగేముందు గంగాదేవి “మరి నాలో పాపాలు ఎలా పోగుట్టుకోవాలి?” అని అడిగితే భగీరధుడు చెప్తాడు – అన్నిపాపాలనీ నాశనంచేసే తపస్సంపన్నులుంటారు కదా వాళ్ల స్నానంతో నీవు పవితృరాలివౌతావు అని. ఆకాశంలోనే ఉండిపోతే గంగాదేవికి హరుడి శిరస్సుమీద దిగినందుకు కలిగే పుణ్యం, ఆ తర్వాత అనేక పాపాత్ములని మార్చే అవకాశం లభించి ఉండేవి కాదు. “ఒక్క కుక్క ఆకలితో అలమటిస్తున్నా దాని ఆకలి తీర్చడం కోసం వేయి కోట్ల జన్మలెత్తమన్నా నేను సిద్ధం” అని స్వామి వివేకానంద అంటారు. అందుకే కాబోలు గంగ భగీరధుడి కోరికకి వప్పుకుంది. దానితో అనేక కోట్ల మంది ధన్యులౌతున్నారు యుగాల తరబడి. ఇది నా దృష్టిలో సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్. అదలా ఉంచితే ఈమాట బాగా దిగజారిపోయినట్టు మీకనిపించినట్టు చెప్పారు. పాత సంచికలు ఓ సారి తిరగేయండి. నాకు పెద్ద వ్యత్యాసం కనబళ్ళేదు మరి. ఓ వేమూరి గారి వ్యాసం/కధ మరొకరి కంప్యూటర్ సైన్స్ వ్యాసం వాళ్ళు రాస్తే భలే భలే అనే మీరే ఇలా అనడం వింతగా ఉంది. పోనీ మీరే చెప్పండి – ఏ విధంగా ఈమాట ని పైపైకి తీసుకెళ్ళొచ్చు? ఓ సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ చూపించండి
ఇదంతా చేసి నేను సంపాదకులని వెనకేసుకొస్తున్నాని అనుకోకండి. నేనూ వాళ్లమీద కత్తులు నూరుతూ ఉంటా. నేను రాసిన కధకి ఓ సారి వారి కామెంటు చూసి వళ్ళు మండిపోయిండి. “మీరు రాసినది ఎంత అసందర్భంగా ఉందో మీకు తెలియదు. రాస్తూ ఉండండి అనగనగరాగ మతిశయించుచుండు” అన్నారు మరి. చివరిగా మరో మాట. పాతకాలంలో అయితే పత్రికలో ఏదో ప్రచురిస్తే వేసుకునే వారు. దానిమీద వచ్చిన విమర్శలు ఆ పై సంచికలో వేసేవారు. ఆ తర్వాత అంతే. అయితే సంపాదకులనుంచి ఎటువంటి సమాధానం రాదు అప్పట్లో. దానికంటే ఇప్పుడు ఈమాట సంపాదకులు సమాధానం ఇస్తున్నారు కనీసం 24 గంటల్లో. ఏమిటి ఇక్కడ ఉన్న కష్టం మీ అందరికీ?
పోనీ ఈమాట కట్టేయండి. దరిద్రం వదుల్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టూ మీరు నోరు పారేసుకోవచ్చు ఏమంటారు?
నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.
లైలా గారు,
“కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం?”
కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?
“తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?”
శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.
“వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression.”
నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.
“ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు.”
శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.
“గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా?”
అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.
“మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.”
ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
ఇది చాలు నాకు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
05/02/2016 1:11 pm
చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
వార ఫలం గురించి Sasi Priya Vangala అభిప్రాయం:
02/08/2016 1:18 am
మీరు అనువాద కవితలు ప్రచురించకుండా సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలి.
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/18/2016 12:35 pm
రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.
మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.
అరిచే కుక్కలు కరవవు
కరిచే కుక్కలు అరవవు
అరవని కరిచే కుక్కలు తరమవు
కరవని అరిచే కుక్కలు మరలవు
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు
మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?
మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.
“పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”
నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.
రెండు కవితలు గురించి S A RAHMAN అభిప్రాయం:
01/07/2016 2:00 pm
రెండు కవితలు కూడా చాలా బాగున్నాయి.
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/04/2016 11:47 pm
ఇక్కడ మరో యుద్ధం మొదలైంది కనక నేనూ ఓ సమిధ వేస్తున్నాను. ముందుగా కొన్ని జెనెరిక్ ప్రశ్నలు. శ్రీశ్రీ కి మహాకవి అని బిరుదు ఎవరిచ్చారు? ఒకట్రెండు కవితలు రాయగానే జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చేయరు. మరింత ముఖ్యం గా చెప్పాల్సినదేమిటంటే అవార్డులు దృష్టిలో పెట్టుకుని రాస్తే అవార్డులు రావు. రాసేదానిమీద ఇంటరెస్టూ, ఇష్టం, శ్రద్ధా ముఖ్యం. అవన్నీ ఉంటే వద్దన్నా అవార్డులు వస్తాయి. మరి అవార్డులిచ్చేటప్పుడు కవిగారి “బయటి” వ్యసనాలు కూడా కమిటీ అంతర్గతంగా తప్పకుండా గుర్తుంచుకుంటుంది – అవి పనికిరాని విషయాలైనప్పటికీ వాటి వల్ల అవార్డు రాకపోవచ్చు. వింతేమీ లేదు. ఫలానా కవిగారు రోడ్డుమీద పోయే ప్రతీవాణ్ణీ అప్పులడిగి సిగరెట్లు కాలుస్తూ తాగుడికి బానిస అయ్యాడు అనేది జ్ఞానపీఠ్ అవార్డు రాకపోవడానికి తప్పకుండా సహకరించే విషయం – ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినాను. మీరే కమిటీలో ఉంటే మీరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే రాసేవాడికి సభ్యతా, సంస్కారం అనేది జీవితంలో ఉండాలి. అయినా జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వాలంటే కవితలు సరిపోవు కదా? ఒక కావ్యం రాయాలి – ఒక మాస్తి, ఒక విశ్వనాథ అలా రాసారు కనక వాళ్ళకు ఇచ్చారు. మహా ప్రస్థానం రాసినందుకు నిజంగా శ్రీశ్రీకి జ్ఞానపీఠ్ ఇచ్చి ఉంటే తెలుగు సర్వనాశనం అయిపోయినందుకు అప్పట్లోనే పత్రికలు రాసి ఉండేవి. ఇది నా బోడి అభిప్రాయం.
ఇకపోతే ఇక్కడ రాసినది వ్యాసమా, కధా అనేది సంపాదకులు వాళ్ల ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తారు. ఇలా కూడదూ అలా ఉండాలి అని చెప్పడానికి తెలుగులో కానీ మరే భాషలో కానీ రూల్స్ లేవు. వ్యాసం అంటే ఏమిటి? గూగిల్ చేస్తే రూల్స్ దొరుకుతాయా? దొరికితే మాత్రం ఆ రూల్స్ రాసినవారెవరు? వాళ్ళు బ్రహ్మ పదార్ధాలా? వాళ్ళూ మనుషులే కదా? అంటే ఒక సంపాదకుడు వాళ్ళు చేసే పత్రిక పని బట్టి నిర్ణయిస్తారు. మీకిష్టం ఉంటే చదవండి లేకపోతే లేదు. ఇలా ఉండాలి అని చెప్పడానికి మీకేమిటి క్వాలిఫికేషన్? మీరు ఎడిటరైతే మీ పుర్రెకి పుట్టినట్టూ మీరు చేస్తారు కదా? ఇది వ్యాసం కింద ప్రచురిస్తే ఇదో వ్యాసమా అనే పెద్దమనుషులు బయల్దేరతారు. మొత్తమ్మీద ఇదో తండ్రీ, కొడుకూ, గాడిద కధలా తయారవుతుంది. ఇంతా చేస్తే ఈమాట సంపాదకుల పని జీతంలేని నౌకరీ. చేతుల దురదా, వచ్చిన చెత్తా చదవడం అనేవి థేంక్ లెస్ ఉద్యోగాలు. తెలుగు మీద మమకారంతో చేస్తామని ఒప్పుకుని ఇలా రెక్కలు ఊడగొట్టుకునే వాళ్ళ మీద ఊరికే నోరు పారేసుకోవద్దు.
సందర్భం వచ్చింది కనక మరో విషయం. మాగంటి గారు అట్టు గురించి. అది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ పారడీ ఎందుకు రాయకూడదు? ఇస్మాయిల్ బతికున్న రోజుల్లోనే మాగంటి గారు రాసి ఉంటే దాన్ని ఎడిటర్లు ప్రచురించేవారని నేను ఘంఠాపధంగా చెప్పగలను. నన్ను అడిగితే నాకు అట్టు నా ఆదర్శమే చెట్టుకన్నా బావుంది.
ఇప్పుడు మీలో ఒక్కోరికీ ప్రశ్నలు.
కేశవులు గారు: ఎన్నారైలు ఏదో చేయట్లేదు – ఇక్కడ నూతులు చాలవన్నట్టూ …అన్నారు. నేను మొదట్లో ఎన్నార్టీ, ఆ తర్వాత ఎన్నారై. ఎప్పుడూ తెలుగు చదవడం రాయడం అనేవి మర్చిపోలేదు. నెలల తరబడి తెలుగుకి మొహం వాచి ఏమీ దొరకనప్పుడు ఆఖరికి కాయితం తీసుకుని పోతన పద్యాలు గుర్తున్నంతలో కాయితం మీద రాసుకుని తృప్తి చెందిన రోజులున్నాయి. తెలుగుకి ఏదో ఒక రకంగా కృషి ఎన్నారైలే చేయాలా? మాకేం పనిలేదా? మీరు ఎన్నారై అయితే ఏమి చేసుండేవారు? మీరు ఆంధ్ర దేశాలు రెండింటిలోనూ ఏదో ఒకచోట ఉంటే ఏం చేస్తారేం? తెలుగు మాట్లాడే దేశంలోనే ఉంటూ ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఎన్నారైలు ఈమాట పత్రిక నడుపుతున్నారు అదే మంచిది కదా? ప్రతీ దానికీ అమెరికా, తానా అని మామీద అరుచుకోవడం కంటే మీరు చేసిన కృషి ఏవిటో శేలవీయండి.
కటకటా: ఈమాట చదవమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? సంపాదకులు మీ నోరు పెగిల్చి చేదు మాత్ర మింగించారా? టెంప్లేట్లు అంటున్నారు. అంటే అవేమిటో మీకు తెలుసా? ఏది వ్యాసం, ఏది కధ అనేది తేల్చడానికి ఎవరిది హక్కు? ఓ ముఖ్యమంత్రి కమిటీవేసి పెద్ద తెలుగు చదువుకున్న ప్రొఫెసర్లందరి చేతా చెప్పించాలా? ఈ ప్రొఫెసర్లకి డిగ్రీలు ఎలా వచ్చాయో మీకు తెలియదా? వాళ్ళ సిద్ధాంత గ్రంధాలు మీరు ఎప్పుడైనా చదివారా? పక్కనే ఉన్న అద్భుతమైన గ్రంధాలు వదిలేసి శ్రీశ్రీ రాసిన కవితలు (నేనుంటే, నీవుంటే, వాడుంటే, వీడుంటే.. ఇలా నాలుగు లైన్లు) వాటి మీద పి.హెచ్.డి చేసి పారేసి కమిటీలో కూర్చుంటారు. వీళ్ళా రూల్స్ చెప్పేది? వాళ్లకి మీటింగుల్లో తాగడానికింతా, తినడానికింతా అని ఇచ్చేస్తే మన ఇష్టం వచ్చినట్టు రాసి పెడతారనేది జగమెరిగిన సత్యం.
లక్ష్మణ్ణగారు: ప్రతీ దానికీ ఒక ధన దృక్కోణం, ఋణ దృక్కోణం ఉంటాయండి. ఒక ప్రోబ్లెం ఓరియెంటెడ్ అప్రోచ్, ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ కూడాను. గంగ భువికి దిగకుండా అక్కడే ఆకాశంలో ఉండిపోతే ఏవిటి ప్రయోజనం? ఏనుగు లక్ష్మణ కవిగారి అనువాదం బాగానే ఉంది చదువుకుని సరదాగా అనుకోవడానికి. భువిమీదకి దిగేముందు గంగాదేవి “మరి నాలో పాపాలు ఎలా పోగుట్టుకోవాలి?” అని అడిగితే భగీరధుడు చెప్తాడు – అన్నిపాపాలనీ నాశనంచేసే తపస్సంపన్నులుంటారు కదా వాళ్ల స్నానంతో నీవు పవితృరాలివౌతావు అని. ఆకాశంలోనే ఉండిపోతే గంగాదేవికి హరుడి శిరస్సుమీద దిగినందుకు కలిగే పుణ్యం, ఆ తర్వాత అనేక పాపాత్ములని మార్చే అవకాశం లభించి ఉండేవి కాదు. “ఒక్క కుక్క ఆకలితో అలమటిస్తున్నా దాని ఆకలి తీర్చడం కోసం వేయి కోట్ల జన్మలెత్తమన్నా నేను సిద్ధం” అని స్వామి వివేకానంద అంటారు. అందుకే కాబోలు గంగ భగీరధుడి కోరికకి వప్పుకుంది. దానితో అనేక కోట్ల మంది ధన్యులౌతున్నారు యుగాల తరబడి. ఇది నా దృష్టిలో సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్. అదలా ఉంచితే ఈమాట బాగా దిగజారిపోయినట్టు మీకనిపించినట్టు చెప్పారు. పాత సంచికలు ఓ సారి తిరగేయండి. నాకు పెద్ద వ్యత్యాసం కనబళ్ళేదు మరి. ఓ వేమూరి గారి వ్యాసం/కధ మరొకరి కంప్యూటర్ సైన్స్ వ్యాసం వాళ్ళు రాస్తే భలే భలే అనే మీరే ఇలా అనడం వింతగా ఉంది. పోనీ మీరే చెప్పండి – ఏ విధంగా ఈమాట ని పైపైకి తీసుకెళ్ళొచ్చు? ఓ సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ చూపించండి
ఇదంతా చేసి నేను సంపాదకులని వెనకేసుకొస్తున్నాని అనుకోకండి. నేనూ వాళ్లమీద కత్తులు నూరుతూ ఉంటా. నేను రాసిన కధకి ఓ సారి వారి కామెంటు చూసి వళ్ళు మండిపోయిండి. “మీరు రాసినది ఎంత అసందర్భంగా ఉందో మీకు తెలియదు. రాస్తూ ఉండండి అనగనగరాగ మతిశయించుచుండు” అన్నారు మరి. చివరిగా మరో మాట. పాతకాలంలో అయితే పత్రికలో ఏదో ప్రచురిస్తే వేసుకునే వారు. దానిమీద వచ్చిన విమర్శలు ఆ పై సంచికలో వేసేవారు. ఆ తర్వాత అంతే. అయితే సంపాదకులనుంచి ఎటువంటి సమాధానం రాదు అప్పట్లో. దానికంటే ఇప్పుడు ఈమాట సంపాదకులు సమాధానం ఇస్తున్నారు కనీసం 24 గంటల్లో. ఏమిటి ఇక్కడ ఉన్న కష్టం మీ అందరికీ?
పోనీ ఈమాట కట్టేయండి. దరిద్రం వదుల్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టూ మీరు నోరు పారేసుకోవచ్చు ఏమంటారు?
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/03/2015 9:06 pm
లైలా గారు,
“ఈమాట” పత్రికలో క్రింది రెండు కవితలు ముత్యాలసరాలుగా వ్రాయబడినవి (ఇంకా ఉందేమో నాకు తెలియదు) –
జనవరి 2009 – గడ్డిపూవు – హేమ వెంపటి
జనవరి 2011 – మంచుమనిషి – నేను వ్రాసినది
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/03/2015 6:36 pm
తహతహ గారు,
నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.
లైలా గారు,
కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?
శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.
నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.
శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.
అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.
ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
12/02/2015 6:11 pm
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
తోపులో పిల్లలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/14/2015 8:56 am
ఇంద్రాణి:
నాకు కవితల గురించి ఎక్కువ తెలియదు. కానీ, “ఈమాట” లో మీ కవితలు చదువుతూ ఉంటాను. చదివినప్పుడల్లా ఏదో ఒక మంచి దృశ్యం కళ్ళకి కనపడినట్టు ఉంటాయి మీ కవితలు.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
అదే నేను గురించి Damu ndm అభిప్రాయం:
05/22/2015 4:22 am
రాధా మేడం గారు, నాకు కవితలు గురించి అంతగా తెలియదు, కాని ప్రతిఒక్కరి మనసులో దాగివున్న “నేను” అనే విషయాన్ని ఈ కవిత ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.
దాము
కురబలకోట రైల్వే స్టేషన్