Nice to read the details of Marconi’s contribution. In our science books, there were 2-3 sentences and the effort was not highlighted. Very interesting.
మీ యాత్రానుభవం చదవడం ఇదే మొదటిసారి. చాలా చక్కగా వ్రాసారు. కవి అన్నట్లు “నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం”. లేకపోతే ఉప్పు తక్కువైందంటే గంజిలో ఉచ్చ పోయడేమేంటి.
హనుమంతరావు గారు ముఖాముఖి నాకు పరిచయం లేకపోయినా మా వారి మాటల ద్వారా, రవీంద్ర మాటల ద్వారా నాకు తెలుసు. హనుమంతరావు గారు కష్టపడే వ్యక్తిత్వం కలవారని, కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్నారని, 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారని, సొంత గ్రామంలో గ్రంథాలయం స్థాపించారని మాత్రమే నాకు తెలుసు.
కానీ తనకి ఇప్పుడా తెలుగు భాష అన్నా, తెలుగు గ్రంథాలన్నా, తెలుగు సాహిత్యం అన్నా మక్కువ అని తెలుసుకున్నాను. మహిమాలయం చదువుతూ తన చిన్న వయసు నుంచి చదివిన పుస్తకాలను మననం చేసుకుంటూ ఇప్పుడు మహిమాలయానికి మంచి వివరణ ఇచ్చారు. వివరణ చెప్పే ముందు హనుమంతరావు గారి ద్వారా చాలా పుస్తకముల పేర్లు, కవుల పేర్లు నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. ఎలిజబెత్ బిషప్ అనే కవయిత్రి గురించి, సంజీవ్ దేవ్ గారి గురించి, బ్రిటన్కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ గురించి, నాయని సుబ్బారావు గారి గురించి… చాలా మంది కవుల పేర్లు తెలుసుకున్నాను.
మహిమాలయం గురించి హనుమంతరావు గారి వివరణ… అటజని కాంచె కృషీవలుడు అన్నారు. కృషీవలుడు ఇక్కడ వర్ణన చాలా బాగుందనిపించింది. ఎలిజబెత్ బిషప్ హిమాలయాల ప్రశ్నల వర్షాన్ని తను మననం చేసుకుంటూ మనందరికీ మరొకసారి తెలియజేశారు. ఇది కూడా బాగుంది. త్రిభువన్ చూసినప్పుడు మీకు గుర్తుకు వచ్చిన మీరు రాసిన కవితను రాస్తూ అందులో మిమ్మల్ని కూడా చేర్చారు. భావకవుల ప్రేయసి ఊహలలో అని, అభిమన్యు ప్రణయగీతి శశిరేఖ అని, నాయని సుబ్బారావుకు తన మేనమామ కూతురే తన భార్య అని, రవీంద్రుడికి ప్రేరణ సరోజిని అని, ఇక్కడ ప్రేరణ అంటే ప్రేయసి అని చాలా బాగా రాశారు.
మిగతా పుస్తకాలతో పోలిస్తే మీది రెండు గుణాలలో విలక్షణంగా ఉందన్నారు. ప్రతి అధ్యాయంలోనూ తనది కానీ తను చదివినది కానీ కవితా రూపంలో రాయడం ఒకటైతే, రెండవది అక్కడి జనుల జీవనరీతిని తన బాల్యపు అనుభవాలకు అన్వయించుకుంటూ రాశారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన విషయాలను తన వివరణలో చాలా బాగా వివరించారు. జన్మభూమి జ్ఞాపకాల పరంపర. నాయని సుబ్బారావు గారికి జన్మభూమి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మీకు కూడా ఉందని ఉదాహరణలతో చెప్పారు.
తెగిన జ్ఞాపకాలు. హనుమంతరావు గారు యుక్త వయసులో చదివిన సంజీవ్ దేవ్ రాసిన తెగిన జ్ఞాపకాలు అనే పుస్తకం మననకు రావడం, గుండెలలో గూడు కట్టుకున్న విషాదం, దేశాటనకై నాలో చెలరేగిన ఆరాటం అన్న అధ్యాయంలో మానసంలోని తమస్సును తొలగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళడానికి సంజీవ్ దేవ్ నిర్ణయించుకున్నారని, అతను హిమాలయాలకు 16 ఏళ్ళ వయసులో వెళ్లి రాసిన అతని భావోద్వేగం మరలా రవీంద్రలో కనిపించిందని రాశారు. ఇక్కడ కూడా వివరణ చాలా బాగుంది.
శస్త్రకారుని సూక్ష్మ పరిశీలన. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాతి గాంచిన న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ తన 65వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి తన మిత్రుడు దేవ్తో కలిసి నేపాల్లో పని చేస్తూ హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాలను చూసి వాటి అందాలు, అక్కడ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, జీవన విధానం ఎలా వివరించారో మీరు కూడా చాలా బాగా వివరించి రాశారని వివరణ ఇచ్చారు. వివరణ విభాగలుగా చాలా బాగా ఇచ్చారు.
ఇక విమర్శ గురించి చెప్పాలంటే హనుమంతరావు గారు వినయంతో కూడిన విమర్శ ఇచ్చారు. మొదటిది కవిత్వం పై ఉన్న మోహం వచనం మీద లేదని అన్నారు. కానీ నాకనిపించింది వచనం రాయడం కన్నా కవిత్వం రాయడం చాలా కష్టం కదా అని. రెండోది కళ్ళ ముందు ఉన్నది వర్ణించబోయి అంతలోనే జ్ఞాపకాల దొంతర్లోకి వెళ్లడం అని రాశారు. అది కవులకు సహజ లక్షణమే కదా అని నాకనిపించింది. మీ గత స్మృతులు వర్తమానాన్ని ముంచివేయకూడదని, వర్తమానంలో మీరు సాధించవలసింది చాలా ఉందని మరొక్కసారి మీ ఆప్త మిత్రునిగా మీకు తన సూచన తెలియజేశారు.
అభినందన. అందరి అభినందనలు చాలా బాగున్నాయని పేరుపేరునా రాశారు. నేను కూడా చివర్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. రవీంద్రుడు రాహులుడైన వేళ అని సాంకృత్యాయన్తో పోల్చారు సరస్వతీ పుత్రులైన కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత మొదట అందరి అభినందనలు చదివాను. అందరూ చాలా బాగా రాశారు కదా అనుకున్నాను. నాకు మొదట భూసరపల్లి గారు రాసిన రవీంద్రుడు రాహులుడైన వేళ అనేది అర్థం కాలేదు. తర్వాత పరిశీలించాను. పరిశీలిస్తే రాహుల్ సాంకృత్యాయన్ చాలా పెద్ద కవి అని, అతని గురించి తెలుసుకోవాలంటే నా జీవితం సరిపోదని తెలుసుకున్నాను. అంత పెద్ద కవితో మిమ్మల్ని పోల్చారు. ఇది చాలా గొప్ప విషయం. కాలం ఉన్నంత కాలం నిలిచిపోయే కవిగా మహిమాలయాన్ని రాసి అందించినందుకు మీకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుతున్నాను.
స్వంత ప్రాణం కన్నా బంధాలు ముఖ్యం కాదు అనే కనిపించని సత్యాన్ని చూపించారు రచయిత. కథానాయకుడి మానసిక స్థితి చిత్రణ నాకు నచ్చింది. కథ ఏకబిగిన చదివింప చేసింది. రచయితకు అభినందనలు.
>> నెల చివరి గడువు దగ్గరకొచ్చే కొలదీ, ఆఁ, ఈవ్యాసాలు ఎవరు చదువుతారులే అని ఉపేక్షిస్తుంటే, మీ వ్యాఖ్య ఎంతో ఉత్తేజాన్నిచ్చింది.
మీరు ఎలా తిట్టుకున్నా సరే ఈ మాట చెప్పేస్తున్నాను. ఇది సంపాదకులు పబ్లిష్ చేయరు అని నా ధీమా.
ఎవరో చదివి చప్పట్లు కొట్టడానికి మీరు ఏమీ రాయక్కర్లేదు. మీకు రాయలని ఉండి, అందరికీ మీకు తెల్సినది పంచాలని ఉంటే, నా లాంటి అర్భకులకి తెలిసేలా చెప్తున్నారు కనక రాయండి. చదివే వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టరు, కొట్టాలని ఉన్నా. అందరికీ తెలిసిన విషయాలు కావు మీరు రాసేవి. సులువుగా అర్ధం అయ్యేలా రాస్తున్నారని చదువుతాము. చదివిన వెంఠనే చప్పట్లు కొట్టడానిక్కానీ, ఒక వ్యాఖ్య రాయడానిక్కానీ అనేకానేక అడ్డంకులు ఉంటాయి. మీరు రాయకపోతే ఎవరికండీ నష్టం? కొన్నాళ్ళు చూసి చూసి అడుగుతాము సంపాదకులని. వాళ్ళు “మేము కూడా ఎదురు చూస్తున్నాం రచయిత దగ్గిర్నుంచి’ అంటారు. ఆ తర్వాత ఎవరి తలనెప్పులు వాళ్లకి ఉంటాయి కనక నోరు మూసుకుంటాం. ఆ తర్వాత మర్చిపోతాం. ఇహనో ఎప్పుడో ఎలాగా చచ్చేపోతాం కూడా ఏళ్ళు వస్తున్నాయి కనక. ఆ తర్వాత చదవడం అదీ ఎలాగా దిక్కు లేదు కదా?
కొంతకాలం క్రితం కంప్యూటర్ గురించి రాయడం మొదలుపెట్టారు. అద్భుతంగా ఉంది అంటూ నాతో సహా చాలా మంది, మహాప్రభో అది కొనసాగించండి అని అడిగి అడిగి నోరు నెప్పెట్టేదాకా చెప్పాం. మీరు ఏ కళనున్నారో అది అర్ధాంతరంగా ఆపి ఇది మొదలుపెట్టారు. ఫలానా ఇన్ని కామెంట్లు వస్తే గానీ, ఇన్నేసి జేజేలు పలికితే గానీ, మరో కొన్ని చప్పట్లు కొడితేగానీ రాయను అని నియమం పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసాండి? మీకు తెల్సిన విషయాలు అక్కడే (మీ మెదడులో) ఉంటాయి. ఎవరికీ జేరవు. అదే మీకు కావాల్సినది అయితే అసలు రాయడం మొదలుపెట్టడమే అనవసరం కదా. ఆఖరికి మనందరికీ పితామహుల వంటి వేమూరి గారు కూడా రాయండి, రాయండి అంటూ ఎన్నో సార్లు చెప్పారు మీరు రాసినది మెచ్చుకుంటూ.
లైకులు, నవ్వులూ కావాలంటే ఫేస్ బుక్కు అనే దరిద్రం ఒకటి ఉంది కదా. అక్కడ చూడండి.
ఇంత నాలెడ్జ్ ఉండి, ఇన్నేళ్ళు పనిచేసి ఆఖరికి మీరు కూడా ఎవరు చదువుతారులే అని ఇలా ఉపేక్షిస్తున్నారు అంటే ‘ఏమిటి నేను చదివిన ఈ వాక్యం నిజమేనా, హనుమంతరావు గారు అన్నదేనా” అని చేతి మీద గిల్లుకుని చూసుకునే పరిస్థితి కల్పించారు మీరు. ఇదే ట్రెండ్ కన్నేగంటి రామారావు గారిది కూడా. ఏదో అద్భుతంగా మొదలుపెడతారు. ఈయన భలే రాస్తున్నారు, తప్పకుండా చదవాలి అని చూస్తూ ఉంటే ఒకటో రెండో వ్యాసాలు రాయడం ఆ తర్వాత నిశ్శబ్దం. ఏదైనా అడిగితే నేను బిజీ అంటారు. ఎవరండీ బిజీ కానిది? సురేష్ కొలిచాల గారు, మొన్నటివరకూ పనిచేసిన సంపాదకుడు మాధవ్ మాచవరం బిజీ కాదా? అయినా అంత బిజీ అయితే మొదలు పెట్టడం ఎందుకు? మమ్మల్ని ఏడిపించడానికా? ఏడిపించడానికి ఇంకా అనేక దార్లు ఉన్నాయి. అయినా మా ఏడుపులు మాకు ఉండనే ఉన్నాయి కదా మరోటి ఎందుకు లెండి?
ఎందుకండీ ఈ తలనెప్పులు? పోనీ సగం రాసి ఆపేస్తే మీకేమైనా సంతోషమా? నాలాంటి అర్భకులు ఏదో కధో కవితో రాసి పంపిస్తే ‘ఛీ, పో’ అంటారు సంపాదకులు. మీరు రాస్తే వేయడానికి ఎర్ర తివాసీ పరుస్తున్నప్పుడు ఏమిటి మీ కష్టం? రామారావు గారు, మీరు కూడా చదువుతున్నారా? వింటున్నారా? ఇది మీ ఇద్దర్నీ దెప్పడానికే.
మీరు ఏ భాషలో ఎలా తిట్టుకున్నా నేను పట్టించుకోను. చెప్పాల్సినది చెప్పేసాను వళ్ళు మండిపోయి. మీ ఇష్ట ప్రకారం కానీయండి. 🙂
ఇది చాలా చక్కని రచన. తెలుగులో ఇంత స్పష్టంగా రాయగలగడం నిజంగా అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆంగ్ల పదాలు తెలుగు పదాలతో కలిపి మాట్లాడతారు. కానీ మీరు చక్కని తెలుగులో మీ యాత్రా విశేషాలను రాసారు. సౌత్ ఆఫ్రికా చూస్తున్న అనుభూతి కలిగింది. మరిన్ని రచనలు మీ నుండి ఆశిస్తూ
బడిగంటి శారద
కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి Srinivas అభిప్రాయం:
04/11/2026 12:38 pm
Nice to read the details of Marconi’s contribution. In our science books, there were 2-3 sentences and the effort was not highlighted. Very interesting.
Thank you Hanumantha rao Garu and EEMATA team.
As usual, waiting for next installment.
సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం గురించి Ramesh అభిప్రాయం:
04/11/2026 1:05 am
మీ యాత్రానుభవం చదవడం ఇదే మొదటిసారి. చాలా చక్కగా వ్రాసారు. కవి అన్నట్లు “నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం”. లేకపోతే ఉప్పు తక్కువైందంటే గంజిలో ఉచ్చ పోయడేమేంటి.
అటజని కాంచె కృషీవలుడు గురించి పద్మావతి వడ్లవల్లి అభిప్రాయం:
04/10/2026 4:59 pm
హనుమంతరావు గారు ముఖాముఖి నాకు పరిచయం లేకపోయినా మా వారి మాటల ద్వారా, రవీంద్ర మాటల ద్వారా నాకు తెలుసు. హనుమంతరావు గారు కష్టపడే వ్యక్తిత్వం కలవారని, కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్నారని, 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారని, సొంత గ్రామంలో గ్రంథాలయం స్థాపించారని మాత్రమే నాకు తెలుసు.
కానీ తనకి ఇప్పుడా తెలుగు భాష అన్నా, తెలుగు గ్రంథాలన్నా, తెలుగు సాహిత్యం అన్నా మక్కువ అని తెలుసుకున్నాను. మహిమాలయం చదువుతూ తన చిన్న వయసు నుంచి చదివిన పుస్తకాలను మననం చేసుకుంటూ ఇప్పుడు మహిమాలయానికి మంచి వివరణ ఇచ్చారు. వివరణ చెప్పే ముందు హనుమంతరావు గారి ద్వారా చాలా పుస్తకముల పేర్లు, కవుల పేర్లు నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. ఎలిజబెత్ బిషప్ అనే కవయిత్రి గురించి, సంజీవ్ దేవ్ గారి గురించి, బ్రిటన్కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ గురించి, నాయని సుబ్బారావు గారి గురించి… చాలా మంది కవుల పేర్లు తెలుసుకున్నాను.
మహిమాలయం గురించి హనుమంతరావు గారి వివరణ… అటజని కాంచె కృషీవలుడు అన్నారు. కృషీవలుడు ఇక్కడ వర్ణన చాలా బాగుందనిపించింది. ఎలిజబెత్ బిషప్ హిమాలయాల ప్రశ్నల వర్షాన్ని తను మననం చేసుకుంటూ మనందరికీ మరొకసారి తెలియజేశారు. ఇది కూడా బాగుంది. త్రిభువన్ చూసినప్పుడు మీకు గుర్తుకు వచ్చిన మీరు రాసిన కవితను రాస్తూ అందులో మిమ్మల్ని కూడా చేర్చారు. భావకవుల ప్రేయసి ఊహలలో అని, అభిమన్యు ప్రణయగీతి శశిరేఖ అని, నాయని సుబ్బారావుకు తన మేనమామ కూతురే తన భార్య అని, రవీంద్రుడికి ప్రేరణ సరోజిని అని, ఇక్కడ ప్రేరణ అంటే ప్రేయసి అని చాలా బాగా రాశారు.
మిగతా పుస్తకాలతో పోలిస్తే మీది రెండు గుణాలలో విలక్షణంగా ఉందన్నారు. ప్రతి అధ్యాయంలోనూ తనది కానీ తను చదివినది కానీ కవితా రూపంలో రాయడం ఒకటైతే, రెండవది అక్కడి జనుల జీవనరీతిని తన బాల్యపు అనుభవాలకు అన్వయించుకుంటూ రాశారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన విషయాలను తన వివరణలో చాలా బాగా వివరించారు. జన్మభూమి జ్ఞాపకాల పరంపర. నాయని సుబ్బారావు గారికి జన్మభూమి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మీకు కూడా ఉందని ఉదాహరణలతో చెప్పారు.
తెగిన జ్ఞాపకాలు. హనుమంతరావు గారు యుక్త వయసులో చదివిన సంజీవ్ దేవ్ రాసిన తెగిన జ్ఞాపకాలు అనే పుస్తకం మననకు రావడం, గుండెలలో గూడు కట్టుకున్న విషాదం, దేశాటనకై నాలో చెలరేగిన ఆరాటం అన్న అధ్యాయంలో మానసంలోని తమస్సును తొలగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళడానికి సంజీవ్ దేవ్ నిర్ణయించుకున్నారని, అతను హిమాలయాలకు 16 ఏళ్ళ వయసులో వెళ్లి రాసిన అతని భావోద్వేగం మరలా రవీంద్రలో కనిపించిందని రాశారు. ఇక్కడ కూడా వివరణ చాలా బాగుంది.
శస్త్రకారుని సూక్ష్మ పరిశీలన. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాతి గాంచిన న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ తన 65వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి తన మిత్రుడు దేవ్తో కలిసి నేపాల్లో పని చేస్తూ హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాలను చూసి వాటి అందాలు, అక్కడ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, జీవన విధానం ఎలా వివరించారో మీరు కూడా చాలా బాగా వివరించి రాశారని వివరణ ఇచ్చారు. వివరణ విభాగలుగా చాలా బాగా ఇచ్చారు.
ఇక విమర్శ గురించి చెప్పాలంటే హనుమంతరావు గారు వినయంతో కూడిన విమర్శ ఇచ్చారు. మొదటిది కవిత్వం పై ఉన్న మోహం వచనం మీద లేదని అన్నారు. కానీ నాకనిపించింది వచనం రాయడం కన్నా కవిత్వం రాయడం చాలా కష్టం కదా అని. రెండోది కళ్ళ ముందు ఉన్నది వర్ణించబోయి అంతలోనే జ్ఞాపకాల దొంతర్లోకి వెళ్లడం అని రాశారు. అది కవులకు సహజ లక్షణమే కదా అని నాకనిపించింది. మీ గత స్మృతులు వర్తమానాన్ని ముంచివేయకూడదని, వర్తమానంలో మీరు సాధించవలసింది చాలా ఉందని మరొక్కసారి మీ ఆప్త మిత్రునిగా మీకు తన సూచన తెలియజేశారు.
అభినందన. అందరి అభినందనలు చాలా బాగున్నాయని పేరుపేరునా రాశారు. నేను కూడా చివర్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. రవీంద్రుడు రాహులుడైన వేళ అని సాంకృత్యాయన్తో పోల్చారు సరస్వతీ పుత్రులైన కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత మొదట అందరి అభినందనలు చదివాను. అందరూ చాలా బాగా రాశారు కదా అనుకున్నాను. నాకు మొదట భూసరపల్లి గారు రాసిన రవీంద్రుడు రాహులుడైన వేళ అనేది అర్థం కాలేదు. తర్వాత పరిశీలించాను. పరిశీలిస్తే రాహుల్ సాంకృత్యాయన్ చాలా పెద్ద కవి అని, అతని గురించి తెలుసుకోవాలంటే నా జీవితం సరిపోదని తెలుసుకున్నాను. అంత పెద్ద కవితో మిమ్మల్ని పోల్చారు. ఇది చాలా గొప్ప విషయం. కాలం ఉన్నంత కాలం నిలిచిపోయే కవిగా మహిమాలయాన్ని రాసి అందించినందుకు మీకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుతున్నాను.
— వడ్లవల్లి పద్మావతి, హైదరాబాదు.
గడినుడి గురించి Murty అభిప్రాయం:
04/09/2026 11:29 am
గడినుడి పునః ప్రారంభం ఎప్పుడు?
కొత్త రాతి యుగం గురించి యామిని యామినీస్ అభిప్రాయం:
04/09/2026 9:16 am
పోయమ్ మొత్తం చాలా బావుందండి.
నీలో నిన్ను ప్రతిష్టించుకున్నప్పుడు నీకు నువ్వు దొరక్కపోవడమే అర్థం👌🏻👌🏻
సూట్కేస్ గురించి పల్లె దేవప్రియం అభిప్రాయం:
04/09/2026 2:07 am
స్వంత ప్రాణం కన్నా బంధాలు ముఖ్యం కాదు అనే కనిపించని సత్యాన్ని చూపించారు రచయిత. కథానాయకుడి మానసిక స్థితి చిత్రణ నాకు నచ్చింది. కథ ఏకబిగిన చదివింప చేసింది. రచయితకు అభినందనలు.
వైరముత్తు – జ్ఞానపీఠ పురస్కారం 2025 గురించి పెద్దిపాగ పున్నారావు అభిప్రాయం:
04/09/2026 1:06 am
చాలా మంచి కవితలు. జ్ఞానపీఠానికి అర్హత కలవి.
కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్జియన్ తరంగాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
04/08/2026 9:57 pm
>> నెల చివరి గడువు దగ్గరకొచ్చే కొలదీ, ఆఁ, ఈవ్యాసాలు ఎవరు చదువుతారులే అని ఉపేక్షిస్తుంటే, మీ వ్యాఖ్య ఎంతో ఉత్తేజాన్నిచ్చింది.
మీరు ఎలా తిట్టుకున్నా సరే ఈ మాట చెప్పేస్తున్నాను. ఇది సంపాదకులు పబ్లిష్ చేయరు అని నా ధీమా.
ఎవరో చదివి చప్పట్లు కొట్టడానికి మీరు ఏమీ రాయక్కర్లేదు. మీకు రాయలని ఉండి, అందరికీ మీకు తెల్సినది పంచాలని ఉంటే, నా లాంటి అర్భకులకి తెలిసేలా చెప్తున్నారు కనక రాయండి. చదివే వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టరు, కొట్టాలని ఉన్నా. అందరికీ తెలిసిన విషయాలు కావు మీరు రాసేవి. సులువుగా అర్ధం అయ్యేలా రాస్తున్నారని చదువుతాము. చదివిన వెంఠనే చప్పట్లు కొట్టడానిక్కానీ, ఒక వ్యాఖ్య రాయడానిక్కానీ అనేకానేక అడ్డంకులు ఉంటాయి. మీరు రాయకపోతే ఎవరికండీ నష్టం? కొన్నాళ్ళు చూసి చూసి అడుగుతాము సంపాదకులని. వాళ్ళు “మేము కూడా ఎదురు చూస్తున్నాం రచయిత దగ్గిర్నుంచి’ అంటారు. ఆ తర్వాత ఎవరి తలనెప్పులు వాళ్లకి ఉంటాయి కనక నోరు మూసుకుంటాం. ఆ తర్వాత మర్చిపోతాం. ఇహనో ఎప్పుడో ఎలాగా చచ్చేపోతాం కూడా ఏళ్ళు వస్తున్నాయి కనక. ఆ తర్వాత చదవడం అదీ ఎలాగా దిక్కు లేదు కదా?
కొంతకాలం క్రితం కంప్యూటర్ గురించి రాయడం మొదలుపెట్టారు. అద్భుతంగా ఉంది అంటూ నాతో సహా చాలా మంది, మహాప్రభో అది కొనసాగించండి అని అడిగి అడిగి నోరు నెప్పెట్టేదాకా చెప్పాం. మీరు ఏ కళనున్నారో అది అర్ధాంతరంగా ఆపి ఇది మొదలుపెట్టారు. ఫలానా ఇన్ని కామెంట్లు వస్తే గానీ, ఇన్నేసి జేజేలు పలికితే గానీ, మరో కొన్ని చప్పట్లు కొడితేగానీ రాయను అని నియమం పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసాండి? మీకు తెల్సిన విషయాలు అక్కడే (మీ మెదడులో) ఉంటాయి. ఎవరికీ జేరవు. అదే మీకు కావాల్సినది అయితే అసలు రాయడం మొదలుపెట్టడమే అనవసరం కదా. ఆఖరికి మనందరికీ పితామహుల వంటి వేమూరి గారు కూడా రాయండి, రాయండి అంటూ ఎన్నో సార్లు చెప్పారు మీరు రాసినది మెచ్చుకుంటూ.
లైకులు, నవ్వులూ కావాలంటే ఫేస్ బుక్కు అనే దరిద్రం ఒకటి ఉంది కదా. అక్కడ చూడండి.
ఇంత నాలెడ్జ్ ఉండి, ఇన్నేళ్ళు పనిచేసి ఆఖరికి మీరు కూడా ఎవరు చదువుతారులే అని ఇలా ఉపేక్షిస్తున్నారు అంటే ‘ఏమిటి నేను చదివిన ఈ వాక్యం నిజమేనా, హనుమంతరావు గారు అన్నదేనా” అని చేతి మీద గిల్లుకుని చూసుకునే పరిస్థితి కల్పించారు మీరు. ఇదే ట్రెండ్ కన్నేగంటి రామారావు గారిది కూడా. ఏదో అద్భుతంగా మొదలుపెడతారు. ఈయన భలే రాస్తున్నారు, తప్పకుండా చదవాలి అని చూస్తూ ఉంటే ఒకటో రెండో వ్యాసాలు రాయడం ఆ తర్వాత నిశ్శబ్దం. ఏదైనా అడిగితే నేను బిజీ అంటారు. ఎవరండీ బిజీ కానిది? సురేష్ కొలిచాల గారు, మొన్నటివరకూ పనిచేసిన సంపాదకుడు మాధవ్ మాచవరం బిజీ కాదా? అయినా అంత బిజీ అయితే మొదలు పెట్టడం ఎందుకు? మమ్మల్ని ఏడిపించడానికా? ఏడిపించడానికి ఇంకా అనేక దార్లు ఉన్నాయి. అయినా మా ఏడుపులు మాకు ఉండనే ఉన్నాయి కదా మరోటి ఎందుకు లెండి?
ఎందుకండీ ఈ తలనెప్పులు? పోనీ సగం రాసి ఆపేస్తే మీకేమైనా సంతోషమా? నాలాంటి అర్భకులు ఏదో కధో కవితో రాసి పంపిస్తే ‘ఛీ, పో’ అంటారు సంపాదకులు. మీరు రాస్తే వేయడానికి ఎర్ర తివాసీ పరుస్తున్నప్పుడు ఏమిటి మీ కష్టం? రామారావు గారు, మీరు కూడా చదువుతున్నారా? వింటున్నారా? ఇది మీ ఇద్దర్నీ దెప్పడానికే.
మీరు ఏ భాషలో ఎలా తిట్టుకున్నా నేను పట్టించుకోను. చెప్పాల్సినది చెప్పేసాను వళ్ళు మండిపోయి. మీ ఇష్ట ప్రకారం కానీయండి. 🙂
ఏప్రిల్ 2026 గురించి రాధకృష్ణ కర్రి అభిప్రాయం:
04/07/2026 1:15 pm
ఉపయోగకరమైన సంపాదకీయం. నిజంగానే కృత్రిమ మేధ ప్రామాణికంగా మారిపోతుందేమో అనే భయం ఉంది. అది ఇప్పుడు ఈ వ్యాసం వలన కొంత మేరకు తగ్గింది. ధన్యవాదాలు.
సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం గురించి Badiganti Sarada అభిప్రాయం:
04/07/2026 10:56 am
ఇది చాలా చక్కని రచన. తెలుగులో ఇంత స్పష్టంగా రాయగలగడం నిజంగా అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆంగ్ల పదాలు తెలుగు పదాలతో కలిపి మాట్లాడతారు. కానీ మీరు చక్కని తెలుగులో మీ యాత్రా విశేషాలను రాసారు. సౌత్ ఆఫ్రికా చూస్తున్న అనుభూతి కలిగింది. మరిన్ని రచనలు మీ నుండి ఆశిస్తూ
బడిగంటి శారద