అనిల్ డ్యానీ కవితలు చదువుతువుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అవును కదా..అనే భావన, ఒక కూల్ సినిమా చూసినప్పుడు వచ్చే భావన, కవితలో మనము ఒక భాగం అవుతాం…You are blessed Anil.
కవి జాని తక్కెడశిల గారిని ఆశ్వీరదిస్తున్న యీ నాగరాజు గారి (వీరు శ్రీ పప్పు నాగరాజు గారై ఉందురా) పదబంధనాలని ఇలా విశదీకరించుకోవాలని ఉంది. ఆపై దీని టీకా తాత్పర్యాలు మీలాంటి సాహితీ పెద్దలను అడిగి తెలుసుకుంటాను.
పులివెందుల, అనంతపురం, సింగమనేని నారాయణలతో జతపడి ఉన్నాడని తెలిసి మురిసిపోతూ… వర్ధమాన కవి జాని తక్కెడశిల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.
ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.
మొదట సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు.
వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.
ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?
బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?
సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.
కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.
ఈ కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?
చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.
ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.
పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.
విస్తృతముగా వివిధ ఛందోరీతులను శోధిస్తూ , వర్ణిస్తూ, కొత్తవి సృష్టిస్తూ , వాటిలో చక్కని కవితలు చెబుతున్న మీరు ఋషితుల్యులు. పద్యసాహిత్యానికి మీరు చేస్తున్న సేవలకు అభినందన వందనములు.
శ్రీవల్లీ రాధిక గారు “వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను.” అన్నారు. అలాటి వారికి ఈ అభిప్రాయం కలగటం పత్రికకి దురదృష్టకరం. అభ్యంతరకరమైన సూచనల్ని నేరుగా చర్చించి తెలుసుకుని ఇలాటి మంచి రచయితల్ని రాయమని ప్రోత్సహించటం పత్రికకే కాదు, పాఠకులకీ అవసరం. ఇదివరకు వారు ఎన్నో చక్కటి కథలు, కవితలు ఇక్కడ ప్రచురించారు.
ఈమాట సంపాదకులకు:
ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.
అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.
“సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.
ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
అభినందనలు!
[క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్
కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు
కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
తమిళనాడులో జరిగిన నిర్దాక్షిణ్య ఏకపక్ష దాడులని నిరసిస్తూ కృష్ణన్ గారు రాసిన కవితను అనువదించి తెలుగువారికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు. కవితలు విమర్శనాత్మకంగా చక్కగా ఉన్నాయి.
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
ఐసోలేషన్ గురించి Sanjeev అభిప్రాయం:
09/04/2020 9:25 pm
అనిల్ డ్యానీ కవితలు చదువుతువుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అవును కదా..అనే భావన, ఒక కూల్ సినిమా చూసినప్పుడు వచ్చే భావన, కవితలో మనము ఒక భాగం అవుతాం…You are blessed Anil.
ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/17/2020 10:18 am
డా. లైలా ఏర్నేని గారూ.. నమస్కారములు.
కవి జాని తక్కెడశిల గారిని ఆశ్వీరదిస్తున్న యీ నాగరాజు గారి (వీరు శ్రీ పప్పు నాగరాజు గారై ఉందురా) పదబంధనాలని ఇలా విశదీకరించుకోవాలని ఉంది. ఆపై దీని టీకా తాత్పర్యాలు మీలాంటి సాహితీ పెద్దలను అడిగి తెలుసుకుంటాను.
” కవిగారూ ….పద్యమై, గద్యమై, వచనమై, గణయతిప్రాసాను ప్రాసలమయమై …రహితమై… పరహితమైన పదబంధమై… జనరంజిత అక్షరమై… ప్రక్షేపిత కిరణమై… ప్రక్ష్వేడనమై… ( ప్రక్ష్వేడన=బాణములయొక్క ) ప్రతిధ్వనించగలరు….! ”
పులివెందుల, అనంతపురం, సింగమనేని నారాయణలతో జతపడి ఉన్నాడని తెలిసి మురిసిపోతూ… వర్ధమాన కవి జాని తక్కెడశిల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.
ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.
మొదట సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు.
మరొకసారి గంగ నేలకు దిగింది గురించి lyla yerneni అభిప్రాయం:
11/10/2019 1:47 pm
వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.
ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?
బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?
సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.
కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.
ఈ కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?
-Lyla
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
10/07/2019 8:18 pm
చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.
ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.
పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.
వనమయూరము గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
01/06/2019 10:42 pm
విస్తృతముగా వివిధ ఛందోరీతులను శోధిస్తూ , వర్ణిస్తూ, కొత్తవి సృష్టిస్తూ , వాటిలో చక్కని కవితలు చెబుతున్న మీరు ఋషితుల్యులు. పద్యసాహిత్యానికి మీరు చేస్తున్న సేవలకు అభినందన వందనములు.
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/02/2018 8:15 pm
శ్రీవల్లీ రాధిక గారు “వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను.” అన్నారు. అలాటి వారికి ఈ అభిప్రాయం కలగటం పత్రికకి దురదృష్టకరం. అభ్యంతరకరమైన సూచనల్ని నేరుగా చర్చించి తెలుసుకుని ఇలాటి మంచి రచయితల్ని రాయమని ప్రోత్సహించటం పత్రికకే కాదు, పాఠకులకీ అవసరం. ఇదివరకు వారు ఎన్నో చక్కటి కథలు, కవితలు ఇక్కడ ప్రచురించారు.
జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:
06/07/2018 11:30 am
ఈమాట సంపాదకులకు:
ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.
అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.
“సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.
ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
అభినందనలు!
[క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]
సెలవు మాస్టారూ! గురించి Anil అట్లూరి అభిప్రాయం:
06/04/2018 11:28 am
సత్యవతి గారు,
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్
కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు
కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి సంతోష్ అభిప్రాయం:
06/02/2018 5:01 am
తమిళనాడులో జరిగిన నిర్దాక్షిణ్య ఏకపక్ష దాడులని నిరసిస్తూ కృష్ణన్ గారు రాసిన కవితను అనువదించి తెలుగువారికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు. కవితలు విమర్శనాత్మకంగా చక్కగా ఉన్నాయి.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni అభిప్రాయం:
01/18/2018 11:52 am
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
Lyla