అడివిమనుషులంమనము.( కుంచెం వేరే రకమైన అడవిలో
తప్పిపోయి ఉన్నాముకదా.) అందుకే అడివి కవితలు
తొందరగా ఇష్టపడలేము.అలాగే కృష్ణగారి విమర్శ
కూడా స్వాగతించదగ్గదే. నాలుగు మినీ కవితలను కలిపి
ఒకేచోట వేసినట్టుంది. ఎక్కడో చదివిన భావంకలిగినా
మంచిపాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా తప్పులేదు కదా.
జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.
కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.
“నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.
నాకు ఈ కవిత అర్ధం కాలేదో లేక అసలు ఈ మధ్య కవిత అనే పేరుతో వచ్చేవి ఇలా ఉంటున్నాయో తెలీదు. అసలు ఏముంది ఈ కవితలో? బాగుందో బాలేదో తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా కాస్త వివరించే పుణ్యం కట్టుకోరూ దయచేసి.
వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? అడవి అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఏం రాసినా చెల్లిపోతుందనే భావన మాత్రమే ఉంది ఈ కవితలో. మనసును హత్తుకునే భావమ్ ఒక్కటి లేదు, ఒక అందమైన భావాన్ని అందంగా వివరించడం లేదు, చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు. మొత్తానికి అసలు కవిత అంటే ఏమిటో నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది.
ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది. కవులూ కాస్త చదవడం కూడా చేయండి. లేకపోతే అరిగిపోయిన భావాలే చర్విత చర్వణం అవుతాయి. శేషేంద్ర శర్మ గారి గురించి వారి శిష్యులు ఒకాయన వ్రాస్తూ అరిగిపోయిన భావాలు నింపిన ఒక అనువాదాన్ని చూపిస్తే ఆయనేమన్నారటో తెలుసా? “కిళ్ళీ బాగా నమిలి నమిలి నమిలీ రసమంతా అయిపోయాక థుపుక్కున ఉమ్మిన పిప్పిలా ఉంది” అని. కొత్త భావాల్లేని కవితలు చదివితే అలానే అనిపిస్తుంది. అందుకే కాస్త చదవండీ దయచేసి.
రచయిత నొచ్చుకుంటారని తెలుసు. అయినా ఇంత ఘాటుగా వ్రాయడానికి కారణం, ఈ మధ్య కవితలు వ్రాసే వారు జాగ్రత్తలు తీసుకోవట్లేదన్న బాధే. అలాంటి కవితలే వస్తే ఇక సంపాదకులూ ఏం చేస్తారు? వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వేయడం తప్ప.. ఈ మధ్య ఆన్ లైన్ పత్రికలన్నిటిలో కవితలు ఇలానే ఉంటున్నాయి. కవులు జాగ్రత్త తీసుకోకపోతే కవిత్వం మీద ఆసక్తి చచ్చిపోయి భాష చచ్చిపోతుందన్నదే నా బాధ.
చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.
ఉదాహరణకు: పైన కవిత
పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?
ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?
అప్పుడే పుట్టిన పసికందును
ముద్దాడే మాతృమూర్తిలా
ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?
అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
పవన్
పునశ్చరణం
గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
04/20/2007
7:10 pm
అయ్యా శివ గారు,
రసభంగాలూ, కొంపలంటుకోవడాల దాకా మీ అలోచనలు వెళ్ళిడానికి నా అభిప్రాయాలలో ఏవుందో నాకు ఎంత వెతుకున్నా అర్థం కాలేదు. నాకు నచ్చిన కవితలు కనుక రెండింటికీ చెరి ఒక (చిన్న) సవరణ సూచించాను. అవి,
1. విన్నకోట రవి శంకర్ గారు కవితని (భావం ఏ మాత్రం దెబ్బ తినకుండా) ఇంకొంత concise గా చెప్పి ఉండవచ్చని
2. వైదేహి గారు పోలికలని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో చెప్పినట్లైతే structural uniformity వల్ల కవిత మరింత రక్తి కట్టేదని
వచనకవిత్వానికి ఏ నియమాలులేవు కనుక నా సూచనలు అంత సమంజసమైనవి కావని వచన కవిత్వం రాసే వాళ్ళూ, చదివేవాళ్ళూ అనుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో కూడా సందర్భోచితంగా కొన్ని లక్షణాల విషయంలో శ్రధ్ధ చూపించడం అవసరం అని నా నమ్మకం. ఒక్క Economy of words మాత్రం అన్ని సందర్భాలలోనూ సముచితమైనది (We will have to agree to disagree here).
చివరగా, ఎవరి రచనలు వారికి అపురూపం కనుక పై రెండు కవితలనీ (నా సూచనలు మీకు అర్థం అవడం కోసం) నాకు తోచినట్లుగా మార్పులు చేసి ఇక్కడ చూపెట్టడం అంత సబబు కాదు నా అభిప్రాయం.
శలవు,
కా.రా
రాజశంకర్ గారు,
ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.
ఈమాటలో అప్పట్లో చాలా కామెంట్లు ” ఈ కథ బాగుందనో, ఈ కథ బాగోలేదనో వచ్చేవి. మన సంపాదకులు గారే ఇలాంటివి బదులు, బాగుంటే ఎందుకు బాగుందో, బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో సవివరంగా సెలవిస్తే మిగిలిన వారికి బాగుంటుందని సెలవిచ్చారు.
ఈ వ్యాసంలో మాత్రం సంపాదకులు అలాంటి తప్పేచేసినట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా రెండు విషయాల్లో.
1.ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం. (ఏ కవితలు/హైకూలు ఇస్మాయిల్ గారి తరహాలో లేవో, వ్యాసకర్త పై అభిప్రాయాన్ని corroborate చేయడమో, కొంతచర్చ చేయడమో చేస్తే బాగుండేది.)
2. ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను! (ఇదీ అంతే. చదువరికి పుస్తకంలో ఏం సులువుగా లేదో నాకైతే అర్థం కాలేదు. సరైన చర్చ లేకపోవడం వల్ల “ఇస్మాయిల్ గారి భక్తుల్ని” ఏదో ఒకటి అనడం కోసం రాసినట్టనిపించింది. అలాగే తెలుగులో ఎవరైనా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తేనో, ఎవర్నో ఒకరిని మెచ్చుకుంటేనో, వాళ్ళందరిని ఒకగాటన కట్టి ఒక లేబిల్ అంటించే దురాచారం రొచ్చులో సంపాదకులు పడడం ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగు సంప్రదాయాలతో బాటు దీనినీ తు.చ. తప్పకుండా పాటించినట్టున్నారు. ఇస్మాయిల్ గారే ఈ లేబిల్స్ అంటించే సంప్రాదాయాన్ని తీవ్రంగా గర్హించినట్టు గుర్తు.
ఇక వ్యాసకర్తతో నేనీకభవించిన ఒక సూచన తెలుగులో వచ్చిన చాలా అనువాదపుస్తకాలకు వర్తిస్తుంది. అనువాద కవితతో బాటు, original write name, poem name ఆంగ్లంలో రాస్తే చాలా మందికి original చదివే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట రోజుల్లో. ఉదా: జోర్గె లూయిస బోర్గెస కవితలు అని రాస్తే ఆయనెవరో కనుక్కోవడానికి మరో పరిశోధన మొదలెట్టాలి.
పుస్తకం చదివిన తరువాత నాకు తోచిన మరో విషయం. ఒక పుస్తకం మరణాంతరం ప్రచురించేటప్పుడు, ప్రచురణ కర్తలు, ఆ కవితల్ని ఎలా సేకరించిందీ? (రచయిత ఎవరికైనా ప్రచురించమని ఇచ్చారా? లేక డైరీలో, చిత్తు కాగితాలో వెతికి సంపాదకులే ప్రచురించారా? ఇక ఈ సంపాదకవర్గం ఎవరు? ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇలాంటివి ముందుమాటలో రాస్తే బాగుండేది.
ప్రద్యుమ్న
(ఆచార్యుల, పీఠాధిపతుల, రకరకాల రసాల -భక్తుల -బాధితుడు).
మనసులోని భావాలను సిరా చేసి కాగితం పై నింపితే కవితలు ఉద్భవిస్తయి
సంఘటనలల జీవితాన్ని కాగితం పై పెట్టి కనికట్టు చెస్తే ఒక మంచి కధ జనిస్తుంది
దాంట్లో శివం లంటి పాత్ర ఊపిరి పొసుకుంటుంది
పేజీ చివరన వ్రాసిందెవరని చూస్తే తెలుగు భాష కి కొత్త ఊపిరి పోస్తున్న ఒక నవకిరణం నామం కనిపిస్తుంది
అరణ్య కవితలు గురించి తెలుగుఅభిమాని అభిప్రాయం:
09/07/2007 12:01 am
అడివిమనుషులంమనము.( కుంచెం వేరే రకమైన అడవిలో
తప్పిపోయి ఉన్నాముకదా.) అందుకే అడివి కవితలు
తొందరగా ఇష్టపడలేము.అలాగే కృష్ణగారి విమర్శ
కూడా స్వాగతించదగ్గదే. నాలుగు మినీ కవితలను కలిపి
ఒకేచోట వేసినట్టుంది. ఎక్కడో చదివిన భావంకలిగినా
మంచిపాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా తప్పులేదు కదా.
అరణ్య కవితలు గురించి chavakiran అభిప్రాయం:
09/05/2007 9:29 pm
ఆర్యా!
కృష్ణాజీ,
ఓ నాలుగు మంచి కవితలు చెపితే చదివి ఆనందించాలనుంది.
ఇహ పోతే (ఎవరు అని అడగరు అని ఆశిస్తూ 🙂 )
నాకు ఈ కవిత చదవగానే అర్జంటుగా అడవిలో తప్పిపోవాలనిపించింది (ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగిందిలేండి)
అందుకనే నచ్చినది.
అందుకు కాకపొయినా ఈ కవితలో పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ ఉన్నది. ఆశావాదం వైపు నడిపిస్తుంది.
—
మీ విమర్శ బాగుంది, ఇలాగే కొనసాగించండి మీ దాడి.
అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
09/05/2007 9:07 pm
కృష్ణ గారు…
జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.
కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.
“నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.
ఏమైనా మీ విమర్శ కి ధన్యవాదాలు.
శెలవు.
అరణ్య కవితలు గురించి krishna అభిప్రాయం:
09/05/2007 2:05 pm
నాకు ఈ కవిత అర్ధం కాలేదో లేక అసలు ఈ మధ్య కవిత అనే పేరుతో వచ్చేవి ఇలా ఉంటున్నాయో తెలీదు. అసలు ఏముంది ఈ కవితలో? బాగుందో బాలేదో తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా కాస్త వివరించే పుణ్యం కట్టుకోరూ దయచేసి.
వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? అడవి అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఏం రాసినా చెల్లిపోతుందనే భావన మాత్రమే ఉంది ఈ కవితలో. మనసును హత్తుకునే భావమ్ ఒక్కటి లేదు, ఒక అందమైన భావాన్ని అందంగా వివరించడం లేదు, చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు. మొత్తానికి అసలు కవిత అంటే ఏమిటో నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది.
ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది. కవులూ కాస్త చదవడం కూడా చేయండి. లేకపోతే అరిగిపోయిన భావాలే చర్విత చర్వణం అవుతాయి. శేషేంద్ర శర్మ గారి గురించి వారి శిష్యులు ఒకాయన వ్రాస్తూ అరిగిపోయిన భావాలు నింపిన ఒక అనువాదాన్ని చూపిస్తే ఆయనేమన్నారటో తెలుసా? “కిళ్ళీ బాగా నమిలి నమిలి నమిలీ రసమంతా అయిపోయాక థుపుక్కున ఉమ్మిన పిప్పిలా ఉంది” అని. కొత్త భావాల్లేని కవితలు చదివితే అలానే అనిపిస్తుంది. అందుకే కాస్త చదవండీ దయచేసి.
రచయిత నొచ్చుకుంటారని తెలుసు. అయినా ఇంత ఘాటుగా వ్రాయడానికి కారణం, ఈ మధ్య కవితలు వ్రాసే వారు జాగ్రత్తలు తీసుకోవట్లేదన్న బాధే. అలాంటి కవితలే వస్తే ఇక సంపాదకులూ ఏం చేస్తారు? వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వేయడం తప్ప.. ఈ మధ్య ఆన్ లైన్ పత్రికలన్నిటిలో కవితలు ఇలానే ఉంటున్నాయి. కవులు జాగ్రత్త తీసుకోకపోతే కవిత్వం మీద ఆసక్తి చచ్చిపోయి భాష చచ్చిపోతుందన్నదే నా బాధ.
రెండు కవితలు గురించి kbssarma అభిప్రాయం:
08/25/2007 6:38 am
కవితలు చాలా బాగున్నాయి. అల్పం లో అనల్పం.
పునశ్చరణం గురించి Pavan garikapati అభిప్రాయం:
04/30/2007 8:36 am
చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.
ఉదాహరణకు: పైన కవిత
పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?
ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?
అప్పుడే పుట్టిన పసికందును
ముద్దాడే మాతృమూర్తిలా
ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?
అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
పవన్
పునశ్చరణం గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
04/20/2007 7:10 pm
అయ్యా శివ గారు,
రసభంగాలూ, కొంపలంటుకోవడాల దాకా మీ అలోచనలు వెళ్ళిడానికి నా అభిప్రాయాలలో ఏవుందో నాకు ఎంత వెతుకున్నా అర్థం కాలేదు. నాకు నచ్చిన కవితలు కనుక రెండింటికీ చెరి ఒక (చిన్న) సవరణ సూచించాను. అవి,
1. విన్నకోట రవి శంకర్ గారు కవితని (భావం ఏ మాత్రం దెబ్బ తినకుండా) ఇంకొంత concise గా చెప్పి ఉండవచ్చని
2. వైదేహి గారు పోలికలని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో చెప్పినట్లైతే structural uniformity వల్ల కవిత మరింత రక్తి కట్టేదని
వచనకవిత్వానికి ఏ నియమాలులేవు కనుక నా సూచనలు అంత సమంజసమైనవి కావని వచన కవిత్వం రాసే వాళ్ళూ, చదివేవాళ్ళూ అనుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో కూడా సందర్భోచితంగా కొన్ని లక్షణాల విషయంలో శ్రధ్ధ చూపించడం అవసరం అని నా నమ్మకం. ఒక్క Economy of words మాత్రం అన్ని సందర్భాలలోనూ సముచితమైనది (We will have to agree to disagree here).
చివరగా, ఎవరి రచనలు వారికి అపురూపం కనుక పై రెండు కవితలనీ (నా సూచనలు మీకు అర్థం అవడం కోసం) నాకు తోచినట్లుగా మార్పులు చేసి ఇక్కడ చూపెట్టడం అంత సబబు కాదు నా అభిప్రాయం.
శలవు,
కా.రా
పునశ్చరణం గురించి P. Siva అభిప్రాయం:
04/19/2007 6:40 am
రాజశంకర్ గారు,
ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.
“పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి ప్రద్యుమ్న అభిప్రాయం:
03/05/2007 11:36 am
ఈమాటలో అప్పట్లో చాలా కామెంట్లు ” ఈ కథ బాగుందనో, ఈ కథ బాగోలేదనో వచ్చేవి. మన సంపాదకులు గారే ఇలాంటివి బదులు, బాగుంటే ఎందుకు బాగుందో, బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో సవివరంగా సెలవిస్తే మిగిలిన వారికి బాగుంటుందని సెలవిచ్చారు.
ఈ వ్యాసంలో మాత్రం సంపాదకులు అలాంటి తప్పేచేసినట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా రెండు విషయాల్లో.
1.ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం. (ఏ కవితలు/హైకూలు ఇస్మాయిల్ గారి తరహాలో లేవో, వ్యాసకర్త పై అభిప్రాయాన్ని corroborate చేయడమో, కొంతచర్చ చేయడమో చేస్తే బాగుండేది.)
2. ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను! (ఇదీ అంతే. చదువరికి పుస్తకంలో ఏం సులువుగా లేదో నాకైతే అర్థం కాలేదు. సరైన చర్చ లేకపోవడం వల్ల “ఇస్మాయిల్ గారి భక్తుల్ని” ఏదో ఒకటి అనడం కోసం రాసినట్టనిపించింది. అలాగే తెలుగులో ఎవరైనా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తేనో, ఎవర్నో ఒకరిని మెచ్చుకుంటేనో, వాళ్ళందరిని ఒకగాటన కట్టి ఒక లేబిల్ అంటించే దురాచారం రొచ్చులో సంపాదకులు పడడం ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగు సంప్రదాయాలతో బాటు దీనినీ తు.చ. తప్పకుండా పాటించినట్టున్నారు. ఇస్మాయిల్ గారే ఈ లేబిల్స్ అంటించే సంప్రాదాయాన్ని తీవ్రంగా గర్హించినట్టు గుర్తు.
ఇక వ్యాసకర్తతో నేనీకభవించిన ఒక సూచన తెలుగులో వచ్చిన చాలా అనువాదపుస్తకాలకు వర్తిస్తుంది. అనువాద కవితతో బాటు, original write name, poem name ఆంగ్లంలో రాస్తే చాలా మందికి original చదివే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట రోజుల్లో. ఉదా: జోర్గె లూయిస బోర్గెస కవితలు అని రాస్తే ఆయనెవరో కనుక్కోవడానికి మరో పరిశోధన మొదలెట్టాలి.
పుస్తకం చదివిన తరువాత నాకు తోచిన మరో విషయం. ఒక పుస్తకం మరణాంతరం ప్రచురించేటప్పుడు, ప్రచురణ కర్తలు, ఆ కవితల్ని ఎలా సేకరించిందీ? (రచయిత ఎవరికైనా ప్రచురించమని ఇచ్చారా? లేక డైరీలో, చిత్తు కాగితాలో వెతికి సంపాదకులే ప్రచురించారా? ఇక ఈ సంపాదకవర్గం ఎవరు? ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇలాంటివి ముందుమాటలో రాస్తే బాగుండేది.
ప్రద్యుమ్న
(ఆచార్యుల, పీఠాధిపతుల, రకరకాల రసాల -భక్తుల -బాధితుడు).
బస్సెడు దూరం గురించి Ashish.R.Katta అభిప్రాయం:
11/04/2006 3:56 am
మనసులోని భావాలను సిరా చేసి కాగితం పై నింపితే కవితలు ఉద్భవిస్తయి
సంఘటనలల జీవితాన్ని కాగితం పై పెట్టి కనికట్టు చెస్తే ఒక మంచి కధ జనిస్తుంది
దాంట్లో శివం లంటి పాత్ర ఊపిరి పొసుకుంటుంది
పేజీ చివరన వ్రాసిందెవరని చూస్తే తెలుగు భాష కి కొత్త ఊపిరి పోస్తున్న ఒక నవకిరణం నామం కనిపిస్తుంది