ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
విధేయుడు – మోహన
ఉదయకళ గారు ,
మీరు రాసిన ఈ కథ, కథ మధ్యలో వ్రాసిన కవితలు కూడా చాల అర్థవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా పరిస్థితులకు చాల దగ్గరగా ఈ కథ ఉంది. ఆ కథ వ్రాసిన తీరు హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంది. మీరు ఇలాంటి కథలు ఇంకెన్నో వ్రాయాలని కోరుకుంటూ,
ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.
ఇంకో పార్శ్వం:
తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.
నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.
—
తమ్మినేని యదుకులభూషణ్.
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
హనుమంతరావు గారికి
2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.
ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”
ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.
ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.
ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!
సాధారణ పాఠకుడు:
చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు ” ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గు పడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయతల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయతల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.
అసాధారణ పాఠకుడు:
గిడసబారిన సరుకిది. ఎందుకో తెలీదు కానీ “సృజనాత్మక ప్రక్రియ” ఫలానా విధంగానే వుండాలి, ఫలానా పధ్ధతిలోనే రాయాలి, ఫలానా వస్తువు గురించే అని, “రాజు-మహిషి” వర్ధనమ్మ గారి లాగ “రూల్సు” పెట్టుకున్న రకం. “రూల్సు” దాటితే, ఆ ” సృజనాత్మక ప్రక్రియ” ఎంత బాగున్నా “యాక్” అని నిర్భయంగా అని ఋజువు చెయ్యగల రకం. “సాధారణ పాఠకుల్ని” “డామినేట్” చేసే రకం. అలవోకగా వాళ్ళ వాదానికి తగ్గట్టూ ఆంగ్ల/పాత తెలుగు రచయతల్ని “కోట్” చేసి సాధారణ పాఠకుల్ని గజగజలాడించీ రకం.
ఇలాటి పరిస్తుతుల్లో “సాధారణ పాఠకుడికి” ఏదో ఒక “యార్డ్ స్టిక్” వుంటే మంచిదే గదా? మామూలు బతుకుని మరీ మామూలుగా బతుకుతూ, కుదిరినపుడు “సాహిత్య సేవనం” చేస్తూ హాయ్ హాయ్ గా బతకడానికి.
అలాకుదరదు, “త్రిక సంధి” కంఠతా రావాలి, “పదహారు పదహార్లూ” కంఠతా రావాలి, future perfect continuous tense లో కూడా “సొంత వాక్య” ప్రయోగం రావాలి అని “రూల్సు” పెడితే సాధారణ పాఠకుల గతి? సాహిత్యం గతి?
వేలూరి వారు, బహుముఖ ప్రజ్నా(స్పెల్లింగ్?) శాలీయున్నూ, బహు భాషావేత్తయున్నూ, సంస్కృతాంధ్రాంగ్లముల యందు బండితుడున్నూ, సమీక్షా చక్రవర్తీ, విమర్శకాగ్రేసరుడున్నూ, వగైరాలన్నియునూ అయుండొచ్చు. కానీ పై వ్యాసంలో ఆయన వుదహరించిన wide spectrum of కవిత్వాలు/కవితలు ఆయనని “సాధారణ పాఠకుడనే” పట్టించెస్తాయి.
కథ దేని గురించి? గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/19/2009 9:55 am
సీతారామయ్య గారు,
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
మీతో ఏకీభవిస్తాను రమ గారు, గురూ గారన్నట్టు, నవ్వేది, నవ్వించేది, కదిలేది, కదిలించేదే కదా, కవితైనా, కథైనా.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
వానకు తడిసిన పువ్వొకటి గురించి sree rama murthy అభిప్రాయం:
01/28/2009 10:56 pm
ఇంద్రాణి గారికి,
మీ కవితలు పొందికగా ఉన్నాయి.”వానకు తడిసిన పువ్వొకటి” కవిత మంచి పదచిత్రం.ఇలాంటి కవితలు మీరు మరిన్ని రాయాలని ఆశిస్తూ__
శ్రీరామమూర్తి.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి mOhana అభిప్రాయం:
01/26/2009 6:34 am
రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
విధేయుడు – మోహన
ఈ మాసపు పాట గురించి Rajesh Kumar.D అభిప్రాయం:
01/19/2009 4:47 am
ఉదయకళ గారు ,
మీరు రాసిన ఈ కథ, కథ మధ్యలో వ్రాసిన కవితలు కూడా చాల అర్థవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా పరిస్థితులకు చాల దగ్గరగా ఈ కథ ఉంది. ఆ కథ వ్రాసిన తీరు హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంది. మీరు ఇలాంటి కథలు ఇంకెన్నో వ్రాయాలని కోరుకుంటూ,
రాజేష్ కుమార్ దేవభక్తుని.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి శ్రీనివాస్ అభిప్రాయం:
12/12/2008 4:08 am
ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!
తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి తమ్మినేని యదుకులభూషణ్. అభిప్రాయం:
12/02/2008 10:25 pm
ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.
ఇంకో పార్శ్వం:
తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.
నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.
—
తమ్మినేని యదుకులభూషణ్.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/27/2008 1:31 am
“నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” – మో
బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:
11/26/2008 7:52 am
హనుమంతరావు గారికి
2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.
ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”
ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.
కవిత్వాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం “అనంతాన్ని” నిర్ణయించడం లాటిది. గుడ్డివాళ్ళు ఏనుగుని తెలుసుకోడం లాటిది, తెలుసుకుని “సాధారణ” పాఠకులికి విపులీకరించి విశ్లేషించడం లాటిది.
ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.
ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!
సువర్ణభూమిలో … గురించి tavva obul reddy అభిప్రాయం:
11/25/2008 9:00 am
కవితలు చక్కగా ఉన్నాయి.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:
11/25/2008 8:42 am
సాధారణ పాఠకుడు:
చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు ” ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గు పడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయతల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయతల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.
అసాధారణ పాఠకుడు:
గిడసబారిన సరుకిది. ఎందుకో తెలీదు కానీ “సృజనాత్మక ప్రక్రియ” ఫలానా విధంగానే వుండాలి, ఫలానా పధ్ధతిలోనే రాయాలి, ఫలానా వస్తువు గురించే అని, “రాజు-మహిషి” వర్ధనమ్మ గారి లాగ “రూల్సు” పెట్టుకున్న రకం. “రూల్సు” దాటితే, ఆ ” సృజనాత్మక ప్రక్రియ” ఎంత బాగున్నా “యాక్” అని నిర్భయంగా అని ఋజువు చెయ్యగల రకం. “సాధారణ పాఠకుల్ని” “డామినేట్” చేసే రకం. అలవోకగా వాళ్ళ వాదానికి తగ్గట్టూ ఆంగ్ల/పాత తెలుగు రచయతల్ని “కోట్” చేసి సాధారణ పాఠకుల్ని గజగజలాడించీ రకం.
ఇలాటి పరిస్తుతుల్లో “సాధారణ పాఠకుడికి” ఏదో ఒక “యార్డ్ స్టిక్” వుంటే మంచిదే గదా? మామూలు బతుకుని మరీ మామూలుగా బతుకుతూ, కుదిరినపుడు “సాహిత్య సేవనం” చేస్తూ హాయ్ హాయ్ గా బతకడానికి.
అలాకుదరదు, “త్రిక సంధి” కంఠతా రావాలి, “పదహారు పదహార్లూ” కంఠతా రావాలి, future perfect continuous tense లో కూడా “సొంత వాక్య” ప్రయోగం రావాలి అని “రూల్సు” పెడితే సాధారణ పాఠకుల గతి? సాహిత్యం గతి?
వేలూరి వారు, బహుముఖ ప్రజ్నా(స్పెల్లింగ్?) శాలీయున్నూ, బహు భాషావేత్తయున్నూ, సంస్కృతాంధ్రాంగ్లముల యందు బండితుడున్నూ, సమీక్షా చక్రవర్తీ, విమర్శకాగ్రేసరుడున్నూ, వగైరాలన్నియునూ అయుండొచ్చు. కానీ పై వ్యాసంలో ఆయన వుదహరించిన wide spectrum of కవిత్వాలు/కవితలు ఆయనని “సాధారణ పాఠకుడనే” పట్టించెస్తాయి.