బాబా గారి మాటే నాదీను. సంతోషంగా వుంది యధాలాపంగా ఇటు వచ్చి ఈ శీర్షిక చదవగలిగినందుకు. నా కవితనిక్కడ ప్రస్తావించటం దుస్సాహసమేమో తెలియదు కానీ మీరు చర్చించిన ఆ రెండు కవితలు చదవక మునుపే అసలు వాటి వునికినెరుగక మునుపే నేను వ్రాసుకున్న కవిత “దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా,” http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html
వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు 🙂
[కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి – సం. ]
నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….
అఫ్సర్ గారికి,
అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
మరోసారి అభినందనలతో,
నండూరి వెంకట సుబ్బారావు.
మొన్న ఆదివారం నాడు పుణె లో ప్రసిధ్ధ ఆంగ్ల కవయిత్రి కమలాదాస్ తన 75వ ఏట [చిన్న కుమారుని ఇంట్లో] తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె రాసిన అనేక కవితలు చాలా ప్రఖ్యాతినందినవి. ఆమె మాధవికుట్టి పేరుతో మళయాళంలో కధలు రాసేరు. ఆమె ఆత్మకధ my story చాలా సంచలనం రేపింది. వ్యక్తిగతంగా సూటిగా..సున్నిత స్వభావిగా ఉండే కమలాదాస్ జీవితం చివరి దశకంలో ఇస్లాం స్వీకరించి కమలా సురయ్యా గా పేరు మార్చుకున్నారు. ఆమె మళయాళీ నాయర్ కుటుంబంలో హిందువుగా పుట్టి..కృష్ణ భక్తురాలిగా గడిపి..చివర్లో ముస్లింగా మారటం..కేరళ సమాజాన్ని విభ్రాంతి పరిచింది. తన రచనల ద్వారానూ..తన జీవితం ద్వారానూ కమలాదాస్ ఒక రెబెల్ గానే చివరిదాకా కొనసాగారు. ఆమెని భారతీయులెందరో స్త్రీ మనోకామనల్ని ఎటువంటి సంకోచమూ లేకుండా వ్యక్తీకరించిన తొలి indian modern poetess గా గుర్తుపెట్టుకుంటారు.
సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.
ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?
అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర – అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
రవీందర్
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి
కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి ఉష అభిప్రాయం:
08/21/2009 1:55 am
బాబా గారి మాటే నాదీను. సంతోషంగా వుంది యధాలాపంగా ఇటు వచ్చి ఈ శీర్షిక చదవగలిగినందుకు. నా కవితనిక్కడ ప్రస్తావించటం దుస్సాహసమేమో తెలియదు కానీ మీరు చర్చించిన ఆ రెండు కవితలు చదవక మునుపే అసలు వాటి వునికినెరుగక మునుపే నేను వ్రాసుకున్న కవిత “దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా,” http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html
కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:54 am
వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు 🙂
[కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి – సం. ]
నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:50 am
నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri అభిప్రాయం:
07/02/2009 6:59 am
అఫ్సర్ గారికి,
అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
మరోసారి అభినందనలతో,
నండూరి వెంకట సుబ్బారావు.
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి rama bharadwaj అభిప్రాయం:
06/01/2009 10:14 pm
మొన్న ఆదివారం నాడు పుణె లో ప్రసిధ్ధ ఆంగ్ల కవయిత్రి కమలాదాస్ తన 75వ ఏట [చిన్న కుమారుని ఇంట్లో] తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె రాసిన అనేక కవితలు చాలా ప్రఖ్యాతినందినవి. ఆమె మాధవికుట్టి పేరుతో మళయాళంలో కధలు రాసేరు. ఆమె ఆత్మకధ my story చాలా సంచలనం రేపింది. వ్యక్తిగతంగా సూటిగా..సున్నిత స్వభావిగా ఉండే కమలాదాస్ జీవితం చివరి దశకంలో ఇస్లాం స్వీకరించి కమలా సురయ్యా గా పేరు మార్చుకున్నారు. ఆమె మళయాళీ నాయర్ కుటుంబంలో హిందువుగా పుట్టి..కృష్ణ భక్తురాలిగా గడిపి..చివర్లో ముస్లింగా మారటం..కేరళ సమాజాన్ని విభ్రాంతి పరిచింది. తన రచనల ద్వారానూ..తన జీవితం ద్వారానూ కమలాదాస్ ఒక రెబెల్ గానే చివరిదాకా కొనసాగారు. ఆమెని భారతీయులెందరో స్త్రీ మనోకామనల్ని ఎటువంటి సంకోచమూ లేకుండా వ్యక్తీకరించిన తొలి indian modern poetess గా గుర్తుపెట్టుకుంటారు.
రమ.
రెండో పాత్ర గురించి M.S.Prasad అభిప్రాయం:
05/15/2009 11:50 pm
చాలా బాగుంది. వచన కవితలు కూడా వాటిని అణుమాత్రమూ ఇష్టపడని అరసికుల మనసులను అలరింపచేయగలవని ఇటువంటి కొన్ని కవితలు ఋజువు చేస్తాయి.
భవదీయుడు
ఇంట్లో ఎవరూ లేరు గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
05/01/2009 3:26 pm
ఇంద్రాణిగారి కవితలు ఏవి చదివినా ఒక అనిర్వచనీయమైన అనుభూతి. This poem is no exception.
రాజాశంకర్ కాశీనాథుని.
బోడి పద్యం గురించి ravinder posani అభిప్రాయం:
03/28/2009 8:56 am
http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=22306&subcatid=3&categoryid=1
బాబ్జీలు గారు:
సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.
ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?
అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర – అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
రవీందర్
బోడి పద్యం గురించి sreelata raavuri అభిప్రాయం:
03/26/2009 11:56 am
http://www.pranahita.org/2009/03/nallanallani_navvu/
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
శ్రీలత
బోడి పద్యం గురించి sarma rallapalli అభిప్రాయం:
03/26/2009 8:39 am
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి