ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.
వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.
అఫ్సర్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు – ” మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ?” అని. అఫ్సర్ గారూ, అసలలాటి సర్వేలు జరిగినట్టు కూడా నాకు తెలియదు. దయచేసి వాటి ఫలితాల్ని మా అందరితో పంచుకోండి. ఎంతో మేలు చేసిన వారౌతారు. ముఖ్యంగా మీరన్నట్లు ఇరవై ముప్ఫై ఏళ్ల నాటి అనుభవాల మీద ఆధారపడి ఊహాగానాలు చేస్తున్న వాళ్లకు.
తెలుగు కవిత్వాన్ని చదివే పాఠకుల సంఖ్య ఎంత? రాసే కవుల సంఖ్య ఎంత? ఏ కవుల రచనల్ని ఎంతెంత మంది పాఠకులు చదువుతున్నారు? ఎంతెంత మంది పాఠకులు ఎలాటి కవితలు వస్తే ఇష్టంగా చదువుతామని చెప్తున్నారు? పాఠకుల్లో ఎంతమంది ఏయే రకం కవిత్వాలు తమ జీవితాలకి అనుభవాలకి దగ్గరగా ఉన్నాయంటున్నారు? పాఠకుల ఇష్టానిష్టాలు ఏమిటి? ఇంకా ఎన్నో ఇలాటి సందేహాల్ని మీరు చూసిన/చేసిన సర్వేలు నివృత్తి చేస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరికీ అందించండి. కవులకూ విమర్శకులకూ సాహిత్యాభిమానులకూ ఎంతగానో ఉపయోగించే ఇలాటి సమాచారం మీ దగ్గరే దాచుకోవటం అన్యాయం అండీ.
విదేశీరచయితలు చెయ్యవలసిన సాహసం ఒక్కటేనండి – ఇంకెవరినో మెప్పించటం కోసం కాకుండా తమకు అనుభవంలో వున్న విషయాల గురించి తమ దృష్టిపథాన్నుంచి రాయటం. మీరన్నట్లు బహుశ నా మునుపటి కామెంట్ ఇందుకు వ్యతిరేకం అయుండొచ్చు. మీరు సర్వే ఫలితాలు పంపిన వెంటనే నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను.
అలాగే సాహిత్య సాంద్రత గురించి కూడ సర్వేల్లో ఏం తేలిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి. ఆంధ్రదేశంలోని ఏయే కవుల కవిత్వం సాంద్రత ఎంత ? ఇండియాలోని ఇతర భాషల కవిత్వసాంద్రతతో పోలిస్తే మన మహాకవుల సాంద్రత ఎంత?
అసలు సర్వేలతో సాహిత్యం బరువు తూసెయ్యొచ్చునని ఇన్నాళ్లూ తెలియక సాహిత్యాన్ని చదివీ దాని గురించి ఆలోచించీ ఎంత కాలం వృధా చేసేశానో కదా.
చివరగా, అక్కడి సాంద్రతని అందుకోవటం అమెరికన్ తెలుగు రచయితల లక్ష్యం కావాలని నేననుకోనండి. ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి అనుభవాలు వాళ్లవి. సొంత అనుభవాల్నుంచి పుట్టి హృదయాన్నుంచి వచ్చే సాహిత్యం సర్వేల్లో తేలేంత సాంద్రత లేనిదైనా ఫర్వాలేదండి, కనీసం అరువుబరువు కాదు.
ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.
అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.
ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.
ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.
ఇందులో
ప్రతి ఆలోచనా గరళం
ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
తన్ను తాను తన్నుకుంటూ
ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
ఎందుకో ఇతనికి
ఏదీ నచ్చదు
ఎవరూ నచ్చరు
ఏదో వేదన ఏదో నిస్పృహ
ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
యక్, షరమ్. షరమ్.
ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
ఊరి చివర ఏం పని
కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
రాబందుల రెక్కల తటతటలు.
క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.
చాలా కాలం పట్టింది. ఇన్నాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం వస్తోంది పెద్దలకి కవితలు వినిపించాలంటే! రమ గారూ! అర్థం అయింది మీ మాట! వేలూరిగారూ! కృతజ్ఞతలు.
శారదా పూర్ణ
తెలగాణెము
గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
04/23/2010
10:11 pm
మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం ,విద్వేషాలను పెంచడం ,చివరికి విభజనకు పట్టు బట్టడం. ఇదీ అయాచితంగా అధికారం చేజిక్కించుకోవాలనే నేతల తీరు. వారికి సమాజం సంస్కృతి,భాషలు సర్వనాశనమైనా చీమ కుట్టినట్టయినా ఉండదు. ఈ తరహా రాజకీయాలు ముస్లిం లీగుతో మొదలైనాయి.’సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా ‘అన్న కవిత రాసిన ఇక్బాల్ ఇటువంటి విభజన ఊహలకు బీజం వేశాడు అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగ వచ్చు. తర్వాత బ్రిటిష్ అండదండలతో జిన్నా తన చిరకాల వాంఛితాన్ని నెర వేర్చుకొన్నాడు. తర్వాత పాకిస్తాన్ వేర్పాటు ఇరుదేశాల ప్రజలకు ఎన్ని కష్టాలు కొని తెచ్చిందో అందరికీ తెలిసినదే. ఠాగోర్ నోబెల్ ఉపన్యాసం చూడండి ,ఈ జాతీయవాదం ఎంత దూరం పొగలదో దర్శించాగలిగాడు అనిపిస్తుంది. గాంధి విభజన కు చివరిదాకా వ్యతిరేకి. దానివల్ల జరిగే ఉత్పాతం ఆయన దర్శించగలిగాడు ;దార్శనికులైన కవులు రాజకీయ వేత్తలు తెల్ల కాకుల లాంటి వారు. విభజన ,రక్తపాతం కోరే కవులు మేధావులు నాయకులు వీధికుక్కల్లా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తారు.
తెలంగాణా గురించి మాట్లాడితే దేశ విభజన గురించి మాట్లాడటం ఏమీ బాగా లేదు ,అది వేరు ఇది వేరు అనవచ్చు. ఈ రెంటికి వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే .”మేము వేరు మీరు వేరు ;మనమందరం కలిసి బ్రతకలేము. మీరు మా నేలను వదిలితే ఆస్తులు మావి ఉద్యోగాలు మావి మా పెత్తనం మాది “ఇదీ వరుస . దేశంలో ఉన్న సమస్యలు చాలు ;పనిలేని నేతల పుణ్యమా అని లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతున్నారు సామాన్యులకు . విభజన అన్న ఊహ చాలా ప్రమాదకరమైంది అని చెప్పడానికి ఇదంతా. ఇది తెలంగాణాతో అంతం కాదు.దీని కూకటి వేళ్ళను కదిలిస్తే దేశమే కదిలిపోతుంది.
అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో నాలుగు డబ్బులు వెనుకేసుకుని ,కాస్త తీరిక ఉన్న వాళ్ళు అరాచక శక్తులకు అండ దండలు అందించడం చూస్తూనే ఉన్నాము. అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి వారు చనిపోతే కవితలు రాసే కవిరాబందులకు నిజాయితీ , నైతికత అన్నది చాలా పెద్ద మాట. చేతనైతే ఒక చెట్టు నాటండి ;ఇంకా స్థోమత ఉందా ఒక గ్రంథాలయం మొదలు పెట్టండి.ఒక బడిని ఆసుపత్రిని నిర్వహించండి.ఇందులో ఆకర్షణ లేదు. నానా దేవుళ్ళకు గుళ్ళు కట్టించడం ,మార్క్సుమావోలకు ఇక్కడినుండి జేజేలు కొట్టడం ఇదీ మనవారి తీరు. ఆలోచనను పెంపొందించే ఏ పని చస్తే తలకెత్తుకోరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది మన వారికి చాలా పెద్ద మాట.
భారత ప్రజాస్వామ్యం నాగాలాండ్ ,పంజాబ్ లాంటి సమస్యలనే చల్లార్చింది.ఇక తెలంగాణా అనగా ఎంత ?? ఈ సమస్య పరిష్కారానికి ఎంతో దూరం లేదు అని నా అంచనా ..సమస్య కు పరిష్కారం లభించే లోగా కుహనా కవులు ,ప్రాంతీయవాదులు ,రాజకీయ నాయకులు జన జీవితంలో ఎంత చెత్తను పేరుస్తారో తలచుకోవడానికే మనసొప్పడం లేదు.
చివరిగా, రచయితలలో మేధావిగా గుర్తింపు పొందిన కొ. కు అభిప్రాయం తెలంగాణా మీద “తెలంగాణ చీలదు .చీలితే తెలంగాణ పాట్లు కుక్కలు నక్క పడవు” ‘(కొ. కు లేఖలు పే.101).
ప్రేమ కవితలు గురించి reddy అభిప్రాయం:
07/06/2010 2:58 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/04/2010 2:26 pm
ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.
వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/03/2010 6:25 pm
అఫ్సర్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు – ” మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ?” అని. అఫ్సర్ గారూ, అసలలాటి సర్వేలు జరిగినట్టు కూడా నాకు తెలియదు. దయచేసి వాటి ఫలితాల్ని మా అందరితో పంచుకోండి. ఎంతో మేలు చేసిన వారౌతారు. ముఖ్యంగా మీరన్నట్లు ఇరవై ముప్ఫై ఏళ్ల నాటి అనుభవాల మీద ఆధారపడి ఊహాగానాలు చేస్తున్న వాళ్లకు.
తెలుగు కవిత్వాన్ని చదివే పాఠకుల సంఖ్య ఎంత? రాసే కవుల సంఖ్య ఎంత? ఏ కవుల రచనల్ని ఎంతెంత మంది పాఠకులు చదువుతున్నారు? ఎంతెంత మంది పాఠకులు ఎలాటి కవితలు వస్తే ఇష్టంగా చదువుతామని చెప్తున్నారు? పాఠకుల్లో ఎంతమంది ఏయే రకం కవిత్వాలు తమ జీవితాలకి అనుభవాలకి దగ్గరగా ఉన్నాయంటున్నారు? పాఠకుల ఇష్టానిష్టాలు ఏమిటి? ఇంకా ఎన్నో ఇలాటి సందేహాల్ని మీరు చూసిన/చేసిన సర్వేలు నివృత్తి చేస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరికీ అందించండి. కవులకూ విమర్శకులకూ సాహిత్యాభిమానులకూ ఎంతగానో ఉపయోగించే ఇలాటి సమాచారం మీ దగ్గరే దాచుకోవటం అన్యాయం అండీ.
విదేశీరచయితలు చెయ్యవలసిన సాహసం ఒక్కటేనండి – ఇంకెవరినో మెప్పించటం కోసం కాకుండా తమకు అనుభవంలో వున్న విషయాల గురించి తమ దృష్టిపథాన్నుంచి రాయటం. మీరన్నట్లు బహుశ నా మునుపటి కామెంట్ ఇందుకు వ్యతిరేకం అయుండొచ్చు. మీరు సర్వే ఫలితాలు పంపిన వెంటనే నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను.
అలాగే సాహిత్య సాంద్రత గురించి కూడ సర్వేల్లో ఏం తేలిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి. ఆంధ్రదేశంలోని ఏయే కవుల కవిత్వం సాంద్రత ఎంత ? ఇండియాలోని ఇతర భాషల కవిత్వసాంద్రతతో పోలిస్తే మన మహాకవుల సాంద్రత ఎంత?
అసలు సర్వేలతో సాహిత్యం బరువు తూసెయ్యొచ్చునని ఇన్నాళ్లూ తెలియక సాహిత్యాన్ని చదివీ దాని గురించి ఆలోచించీ ఎంత కాలం వృధా చేసేశానో కదా.
చివరగా, అక్కడి సాంద్రతని అందుకోవటం అమెరికన్ తెలుగు రచయితల లక్ష్యం కావాలని నేననుకోనండి. ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి అనుభవాలు వాళ్లవి. సొంత అనుభవాల్నుంచి పుట్టి హృదయాన్నుంచి వచ్చే సాహిత్యం సర్వేల్లో తేలేంత సాంద్రత లేనిదైనా ఫర్వాలేదండి, కనీసం అరువుబరువు కాదు.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి lyla yerneni అభిప్రాయం:
07/02/2010 12:40 pm
ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.
అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.
ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.
ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.
ఇందులో
ప్రతి ఆలోచనా గరళం
ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
తన్ను తాను తన్నుకుంటూ
ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
ఎందుకో ఇతనికి
ఏదీ నచ్చదు
ఎవరూ నచ్చరు
ఏదో వేదన ఏదో నిస్పృహ
ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
యక్, షరమ్. షరమ్.
ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
ఊరి చివర ఏం పని
కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
రాబందుల రెక్కల తటతటలు.
క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.
లైలా
ప్రేమ కవితలు గురించి purna(mani) అభిప్రాయం:
06/24/2010 12:33 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
ప్రేమ కవితలు గురించి chandu అభిప్రాయం:
06/21/2010 6:33 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
ప్రేమ కవితలు గురించి J.sudha sekhar అభిప్రాయం:
05/09/2010 4:24 am
నాకుఈ కవితలు… మరిచిన క్షణాలు…మల్లి క్షణాలుగా గుర్తుకు వస్తునాయ్. ok T…..you.
పాఠకులకు సూచనలు గురించి Madhu అభిప్రాయం:
05/08/2010 12:18 am
నేను కూడా ‘ఈ మాట’ కు నా కవితలు పంపాలనుకుంటున్నాను. ఎలా పంపాలో వివరాలు తెలియజేయగలరు. కృతజ్ఞుణ్ణి.
[‘రచయితలకు సూచనలు’ చూడండి. – సం]
‘వికృతి’ ఉగాది గురించి Sarada Purna Sonty అభిప్రాయం:
05/04/2010 11:33 am
చాలా కాలం పట్టింది. ఇన్నాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం వస్తోంది పెద్దలకి కవితలు వినిపించాలంటే! రమ గారూ! అర్థం అయింది మీ మాట! వేలూరిగారూ! కృతజ్ఞతలు.
శారదా పూర్ణ
తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
04/23/2010 10:11 pm
మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం ,విద్వేషాలను పెంచడం ,చివరికి విభజనకు పట్టు బట్టడం. ఇదీ అయాచితంగా అధికారం చేజిక్కించుకోవాలనే నేతల తీరు. వారికి సమాజం సంస్కృతి,భాషలు సర్వనాశనమైనా చీమ కుట్టినట్టయినా ఉండదు. ఈ తరహా రాజకీయాలు ముస్లిం లీగుతో మొదలైనాయి.’సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా ‘అన్న కవిత రాసిన ఇక్బాల్ ఇటువంటి విభజన ఊహలకు బీజం వేశాడు అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగ వచ్చు. తర్వాత బ్రిటిష్ అండదండలతో జిన్నా తన చిరకాల వాంఛితాన్ని నెర వేర్చుకొన్నాడు. తర్వాత పాకిస్తాన్ వేర్పాటు ఇరుదేశాల ప్రజలకు ఎన్ని కష్టాలు కొని తెచ్చిందో అందరికీ తెలిసినదే. ఠాగోర్ నోబెల్ ఉపన్యాసం చూడండి ,ఈ జాతీయవాదం ఎంత దూరం పొగలదో దర్శించాగలిగాడు అనిపిస్తుంది. గాంధి విభజన కు చివరిదాకా వ్యతిరేకి. దానివల్ల జరిగే ఉత్పాతం ఆయన దర్శించగలిగాడు ;దార్శనికులైన కవులు రాజకీయ వేత్తలు తెల్ల కాకుల లాంటి వారు. విభజన ,రక్తపాతం కోరే కవులు మేధావులు నాయకులు వీధికుక్కల్లా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తారు.
తెలంగాణా గురించి మాట్లాడితే దేశ విభజన గురించి మాట్లాడటం ఏమీ బాగా లేదు ,అది వేరు ఇది వేరు అనవచ్చు. ఈ రెంటికి వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే .”మేము వేరు మీరు వేరు ;మనమందరం కలిసి బ్రతకలేము. మీరు మా నేలను వదిలితే ఆస్తులు మావి ఉద్యోగాలు మావి మా పెత్తనం మాది “ఇదీ వరుస . దేశంలో ఉన్న సమస్యలు చాలు ;పనిలేని నేతల పుణ్యమా అని లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతున్నారు సామాన్యులకు . విభజన అన్న ఊహ చాలా ప్రమాదకరమైంది అని చెప్పడానికి ఇదంతా. ఇది తెలంగాణాతో అంతం కాదు.దీని కూకటి వేళ్ళను కదిలిస్తే దేశమే కదిలిపోతుంది.
అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో నాలుగు డబ్బులు వెనుకేసుకుని ,కాస్త తీరిక ఉన్న వాళ్ళు అరాచక శక్తులకు అండ దండలు అందించడం చూస్తూనే ఉన్నాము. అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి వారు చనిపోతే కవితలు రాసే కవిరాబందులకు నిజాయితీ , నైతికత అన్నది చాలా పెద్ద మాట. చేతనైతే ఒక చెట్టు నాటండి ;ఇంకా స్థోమత ఉందా ఒక గ్రంథాలయం మొదలు పెట్టండి.ఒక బడిని ఆసుపత్రిని నిర్వహించండి.ఇందులో ఆకర్షణ లేదు. నానా దేవుళ్ళకు గుళ్ళు కట్టించడం ,మార్క్సుమావోలకు ఇక్కడినుండి జేజేలు కొట్టడం ఇదీ మనవారి తీరు. ఆలోచనను పెంపొందించే ఏ పని చస్తే తలకెత్తుకోరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది మన వారికి చాలా పెద్ద మాట.
భారత ప్రజాస్వామ్యం నాగాలాండ్ ,పంజాబ్ లాంటి సమస్యలనే చల్లార్చింది.ఇక తెలంగాణా అనగా ఎంత ?? ఈ సమస్య పరిష్కారానికి ఎంతో దూరం లేదు అని నా అంచనా ..సమస్య కు పరిష్కారం లభించే లోగా కుహనా కవులు ,ప్రాంతీయవాదులు ,రాజకీయ నాయకులు జన జీవితంలో ఎంత చెత్తను పేరుస్తారో తలచుకోవడానికే మనసొప్పడం లేదు.
చివరిగా, రచయితలలో మేధావిగా గుర్తింపు పొందిన కొ. కు అభిప్రాయం తెలంగాణా మీద “తెలంగాణ చీలదు .చీలితే తెలంగాణ పాట్లు కుక్కలు నక్క పడవు” ‘(కొ. కు లేఖలు పే.101).