హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.
తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.
“శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?
“దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.
“ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.
స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.
ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.
అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!
రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!
ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.
ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ‘అమృతం కురిసిన రాత్రి’ కనిపిస్తే, కొన్ని కవితలు చదివాను. ఆపై, ఆమధ్య ఒకరోజు కూడా ఒకటీ అరా చదివే సందర్భం వచ్చింది. చిన్న వయసులో చదివినందుకో ఏమో కానీ, నాకంత బుర్రకెక్కలేదు అప్పుడు. ఈ వ్యాసాలన్నీ చూస్తూంటే ఇప్పుడు చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙂
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?
Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Memoirs,” Pablo Neruda.
[2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
[3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.
అయితే, రమా భరద్వాజ గారు మిగతా వాళ్ళని చదవకుండా తిట్టిపోస్తారన్న మాట. బాగుందండీ వరస! “ఊరి చివర” మీరు చదివిన ఆధారాలు మీ మాటల్లో లేవు.
సరే, పెడసరం రమ గారు సెలవు పుచ్చుకున్నారు కనుక, ఇక్కడ ఇప్పుడు వేలూరి కి, కాకపోతే సాయి బ్రహ్మానందం గారికి ఒక ప్రశ్న. “ఊరి చివర”లో అఫ్సర్ గారి అమెరికా పద్యాలు వున్నాయా? వుంటే, అవి డయాస్పోరా గురించి మాట్లాడే వేలూరి గారి కంటిలో ఎందుకు పడలేదు? అఫ్సర్ గారి కవిత్వాన్ని శ్రద్ధగా చదివే బ్రహ్మానందం గారు అఫ్సర్ గారిని అమెరికా తెలుగు కవి అని అనడానికి ఆధారాలు చూపగలరా?
నాకు రామారావు గారు చెప్పింది కొంత నిజం కావచ్చుననిపిస్తున్నది. అఫ్సర్ గారికి “అక్కడి” దృస్టి ఎక్కువ. ఆయన తెలంగాణా, దలిత, ముస్లిం కవితలు అట్లా కనిపిస్తాయి. నేను పాఠకుడిని మాత్రమే. విశ్లేషణ చెయ్యలేను. పెద్దలు వేలూరి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా ఎవరయినా చెప్పాలి.
ఈ విషయం విమర్శ వైపు నించే కాక, చాలా కాలం ఆంధ్రాలో వుండి, అమెరికా వలస వచ్చిన కవులు- స్వామి, రవి శంకర్, కన్నెగంటి చంద్ర, రవికిరణ్, మరువం ఉష, యదుభూషణ్, కల్పనా రెంటాల, కె.గీత – వంటి వారున్నారు.
అఫ్సర్ గారు “అక్కడి” పక్షం ఎక్కువ వున్నారా? “ఇక్కడి” అనుభవాలని లోకువ చేస్తున్నారా? “ఊరి చివర” లో “ఇక్కడి” అనుభవం ఎంత?!
మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,
ప్రేమ కవితలు గురించి lalitha అభిప్రాయం:
09/15/2010 7:04 am
నా మనసులొని భావాలు మీ కవితలొ వెల్లువెత్తాయి
నా ప్రేమ కలలు మీ కలమున జాలువారాయి
ప్రేమను ప్రేమతొ ప్రేమిస్తున్న ఓ నేస్తమా నీకు నా జోహార్లు
…నేను మీలాగే ఒక ప్రేమ పిపాసిని,
నా ప్రియుని కోసం ఇలాగే కవితలు రాస్తున్నాను.
లలిత
తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao అభిప్రాయం:
09/07/2010 5:57 am
హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.
తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.
“శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?
“దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.
“ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.
స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.
ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.
అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!
రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!
ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.
మంచి కవి, మంచి స్నేహితుడు గురించి Sowmya అభిప్రాయం:
09/01/2010 8:12 am
ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ‘అమృతం కురిసిన రాత్రి’ కనిపిస్తే, కొన్ని కవితలు చదివాను. ఆపై, ఆమధ్య ఒకరోజు కూడా ఒకటీ అరా చదివే సందర్భం వచ్చింది. చిన్న వయసులో చదివినందుకో ఏమో కానీ, నాకంత బుర్రకెక్కలేదు అప్పుడు. ఈ వ్యాసాలన్నీ చూస్తూంటే ఇప్పుడు చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙂
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/15/2010 2:07 pm
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/15/2010 2:34 am
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
ఈ సందర్భంలో Richard Rorty గుర్తొచ్చాడు:
Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?
Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Memoirs,” Pablo Neruda.
[2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
[3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి శ్రీనివాస్ అభిప్రాయం:
07/11/2010 9:31 am
అయితే, రమా భరద్వాజ గారు మిగతా వాళ్ళని చదవకుండా తిట్టిపోస్తారన్న మాట. బాగుందండీ వరస! “ఊరి చివర” మీరు చదివిన ఆధారాలు మీ మాటల్లో లేవు.
సరే, పెడసరం రమ గారు సెలవు పుచ్చుకున్నారు కనుక, ఇక్కడ ఇప్పుడు వేలూరి కి, కాకపోతే సాయి బ్రహ్మానందం గారికి ఒక ప్రశ్న. “ఊరి చివర”లో అఫ్సర్ గారి అమెరికా పద్యాలు వున్నాయా? వుంటే, అవి డయాస్పోరా గురించి మాట్లాడే వేలూరి గారి కంటిలో ఎందుకు పడలేదు? అఫ్సర్ గారి కవిత్వాన్ని శ్రద్ధగా చదివే బ్రహ్మానందం గారు అఫ్సర్ గారిని అమెరికా తెలుగు కవి అని అనడానికి ఆధారాలు చూపగలరా?
నాకు రామారావు గారు చెప్పింది కొంత నిజం కావచ్చుననిపిస్తున్నది. అఫ్సర్ గారికి “అక్కడి” దృస్టి ఎక్కువ. ఆయన తెలంగాణా, దలిత, ముస్లిం కవితలు అట్లా కనిపిస్తాయి. నేను పాఠకుడిని మాత్రమే. విశ్లేషణ చెయ్యలేను. పెద్దలు వేలూరి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా ఎవరయినా చెప్పాలి.
ఈ విషయం విమర్శ వైపు నించే కాక, చాలా కాలం ఆంధ్రాలో వుండి, అమెరికా వలస వచ్చిన కవులు- స్వామి, రవి శంకర్, కన్నెగంటి చంద్ర, రవికిరణ్, మరువం ఉష, యదుభూషణ్, కల్పనా రెంటాల, కె.గీత – వంటి వారున్నారు.
అఫ్సర్ గారు “అక్కడి” పక్షం ఎక్కువ వున్నారా? “ఇక్కడి” అనుభవాలని లోకువ చేస్తున్నారా? “ఊరి చివర” లో “ఇక్కడి” అనుభవం ఎంత?!
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/10/2010 4:38 pm
మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
సెలవు,
భవదీయ..
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ఉష అభిప్రాయం:
07/09/2010 8:41 am
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి C.S.Rao అభిప్రాయం:
07/07/2010 7:54 pm
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
ప్రేమ కవితలు గురించి annam naidu అభిప్రాయం:
07/06/2010 11:06 am
ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,