మొన్నామధ్య విజయవాడ వెళ్ళినప్పుడు అటక మీద నా పాత కవితల పుస్తకం దొరికింది.
నాకు పదేళ్ళ వయసప్పుడు రాసిన కవితలు,కొన్ని కధలు,బొమ్మలు ఉన్నాయందులో.
వ్రాద్దామని కలం తీయగా
స్ఫురించింది ఇంకు లేదని
పోద్దామని సీసా తీయగా
గుర్తుకొచ్చింది అయిపోయిందని
కొందామని షాపుకెళ్ళగా
ఙ్ఞాపకమొచ్చింది ఆదివారమని
ఇంటికొచ్చి లైటు వేయగా
తెలియజొచ్చింది కరెంటు లేదని
అప్పుడు తెలిసింది
తాను ఏమీలేని బికారినని
ఇది తన కల మాత్రమేనని. (30.06.87)
మనస్సు మందిరంలో మరచిన సత్యం
గుండె గదుల్లో ప్రతిధ్వనించగా
ఉప్పొంగిన ఆవేశం
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
అదుపు తప్పిన మనసును
ఆపలేకపోతుంటే
గుండెల్లో బరువు
భరించలేక
విశ్రాంతి కోసం నేను
మృత్యు మందిరంలోకి
వెళ్ళిపోయాను. (5.07.87)
ఇది చదువుకుంటుంటే భలే నవ్వు వచ్చింది.మనస్సుకొక మందిరం,మృత్యువుకొక మందిరం.
రెండు మందిరాలు కట్టించాను!
మూతి మీద మీసకట్టు
చేతిలో కిళ్ళీ పాకెట్టు
ఎందుకోయి ఈ కనికట్టు
తిన్నావా పెసరట్టు
నీ అబద్ధ్హాలు కట్టిపెట్టు
వెళ్ళి రుబ్బురోలు పట్టు
ఇడ్లీ ప్యాకెట్టు కట్టు
ఇక మీద ఈ వేషాలు కట్టు
మళ్ళీ వచ్చావో పడతా నీ పట్టు!
(11.06.87)
ఇలాంటి మాటల గారడీలు ఇంకా బోలెడున్నాయి.
వాన-వాన-వాన
చిన్నారి వాన-పొన్నారి వాన
వాన-వాన-వాన
చక్కటి వాన-చుక్కల వాన
పూల వాన-నీళ్ళ వాన
వాన-వాన-వాన
చిన్నారి చినుకులు లేపెలే జగమును
నదులను,చెరువులను నింపుతూ వచ్చెలే
నెమ్మిలి తకధిమి నృత్యం చేసే
చిన్నారి లేళ్ళు గంతులు వేసే
కప్పలు సైతం తెలిపె సంతోషం
బెకబెకమంటూ ఆనందపడెను
వాన-వాన-వాన
చిన్నారి వాన-పొన్నారి వాన
చక్కటి వాన-చుక్కల వాన
పూల వాన-నీళ్ళ వాన.
(30.06.87)
పూల మీద,సూర్యుడి మీద,చెట్ల మీద ఇంకా బోల్డు కవితలు.
దీని “తవికలు” మళ్ళీ తెచ్చింది బాబోయ్! అని మా మేనత్తలు ఎగతాళి చేస్తున్నా,”నాయనా, ఇంద్రా,నీ కవిత ఏదీ వినిపించు” అని అడిగే తాత గారి కోసం,ఆయన పక్కన కూచుని,ఆయనకే కాకుండా ఇంట్లో ఉన్న అందరూ తమ తమ పనులు వదిలిపెట్టి పరిగెత్తుకు వచ్చేలా గట్టి గట్టిగా ఈ పుస్తకంలోని కవితలు చదివి వినిపించేదాన్ని.
పుస్తకంలో పేజీలు పసుప్పచ్చ రంగుకి తిరిగిపోయాయి.
దాన్ని తిరిగి బస్తాలో పెట్టేసి,బస్తా మూతి బిగించి అటక మీద పారేసాను.
మీ కవితలు భలే బాగున్నాయండి. మీ బ్లాగు పేజీలో కూడా మఱికొన్ని కవితలు చదివాను. బాగా రాస్తున్నారు! మీ చేత ఇంకా ఇంకా మదిని ఆకట్టుకునే ఆనందమైన కవితలు రాయగలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకోవాలని ఆశిస్తూన్నాను 🙂
హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలుకవితలు ..తక్కెడ కొలతన.:)
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు. కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
చక్కగా చెప్పారు కామేశ్వరరావు గారూ! ఈ చర్చ ద్వారా తెలుసుకునే కొసరు విషయాలే ఎక్కువ. లక్షణ నిరూపణమే ప్రధానమైన ఈ చర్చలో పాదవిభజన ప్రయోజనం గురించి చర్చ లేదు. అయినా, ఆ దిశలో ఈ చర్చ కొన్ని కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. ఈమధ్యనే వెల్చేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకమాటన్నారు. (ఇది నామాటల్లో) ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది అని. ఆధునిక వచన కవిత్వానికి పాద బద్ధత ప్రయోజనం కూడా అదేనని నాకనిపిస్తుంది. ఇంగువ కట్టిన గుడ్డకి ఆ వాసన అంటినట్టు, పాద విభజన ద్వారానో, పద్యరూపం ద్వారానో కవితగా ఒక రచనని కనీసం స్ఫురింపచేయవచ్చు. ఇది రూపానికి సంబంధించిన వివరమే గానీ కవితాంశ (poesy)కు సంబంధించింది కాదనుకోండి.
పాదబద్ధత లేని వచనకవిత్వం అనగానే నాకు చప్పున గుర్తుకొచ్చింది కన్నెగంటి చంద్ర రాసిన దుఃఖం కవిత. ఆయన ఆ కవితని ఒక పేరాగ్రాఫులా రాశారు. (కానీ అందులో కామాలు పాదాంత విరామాలుగానూ, పాదాంతాలు అంత్యప్రాసతోనూ ఉంటాయి. అందువల్ల అది పేరాగ్రాఫులా ఉన్నా చదివేటప్పుడు ఒరవడి ద్వారా ఒక అంతర్లయ ఆ కవితలో స్పష్టమవుతుంది.) ఇంకో ఉదాహరణ, శ్రీకాంత్ అనే కవి కొంతకాలం కింద ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించిన కవితలు, పూర్తి వచనంలా రాయబడినవి. ఇలా పాదబద్ధత ఏ మాత్రమూ లేని కవితలని ఉదాహరణలుగా చూపించి పాదవిభజన కేవలం కవి ఐచ్ఛికమే అని ఒప్పుకోవచ్చు. కానీ, సంపత్కుమార ప్రతిపాదించిన భావగణాల వివరణ, ఒక కవి పాదవిభజన – ఐచ్ఛికంగానే – చేయదలచుకుంటే, ఆ విభజనలో కవికి కొంతైనా సహాయపడుతుందని నాకనిపిస్తుంది. కానీ, ప్రయోజనం అన్నమాట వచ్చేటప్పటికి కవికి తన రచనపైన స్పష్టత ఉండాలనేది నిర్వివాదం.
నాకిప్పటికీ ఎంతో ఆశ్చర్యాన్ని (కించిత్తు బాధనీ) కలిగించే విషయం ఒకటుంది. అది కవిత్వం అనేది హృదయాన్నుంచి ఒక భావావేశంలో ఉబికేదనీ, అందువల్ల దానికో సహజమైన స్వరూపం ఉంటుందనీ దానికి ఏరకమైన మార్పులు, పరిష్కరణలు చేసినా (అంటే మేధని ఉపయోగించడంతో) ఆ ఉద్వేగం పోతుందనీ ఇప్పటికీ నూటికి తొంభై మంది (ఎక్కువమంది కవులే) పైనే నమ్మడం. ఆవేశంలో తడబడుతూ మాట్లాడినప్పుడు, తన తడబాటు తనకే తెలియటం లేదనీ, కవి ఆవేశం మనకు అర్థమయినా తను ఏం మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం కాదనీ, ఈ రెంటికీ తేడా ఉందనీ గమనించకపోవడం. అంటే చెప్పాలన్న ఆవేశమే తప్ప ఎలా చెపితే బలంగా ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించడమే.
కవితాంశను పక్కనపెడితే, ఈ నమ్మకం వల్ల కలిగే పెద్ద నష్టం, కవిత నిర్మాణంలో కొట్టొచ్చినట్టు కనపడే లోపాలు, అస్పష్టతానూ. ఉదాహరణకి, మీరన్నట్టే పాద విభజన ఒక విరామం కోసం అనే అనుకున్నా, అది కవి ఒక స్పష్టమైన ఆలోచనతో చేయవలసిందే కదా! అందరి విషయంలో కాకపోయినా, కవిత్వమనేది కేవలం హృదయ సంబంధి అనే నమ్మకం వల్ల, ఈ స్పష్టత కవికి అవసరం లేదు అని తప్పించుకునే వీలు ఒకటి ఏర్పడింది. పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా! (పాదవిభజన నియతమైనంత మాత్రాన వచన కవిత్వం ఛందోబద్ధమైనదన్న వాదన నాకు మింగుడు పడని విషయం.) అందువల్ల, ఈ చర్చ కవికి తన కవితను నిర్మాణ సంబంధమైన దృష్టితో మరొక్కసారి పరిశీలించడానికి, ఆ నిర్మాణాన్ని సరిదిద్దుకోడానికీ (అది ఎంత ఐచ్ఛికమైనా) కొంతైనా తోడ్పడుతుందని నా అభిప్రాయం. (నా స్నేహితులు వాళ్ళ కవితలని నాకు చూపించినప్పుడు, నేను గమనించే ఒక లక్షణం పాదం ఎక్కడ ఎందుకు విరిచారా అని. నేను అర్థం చేసుకోలేని ప్రతిసారి, ఆ విరుపు వెనకాల గల కారణాన్ని వివరించమనీ అడిగేవాణ్ణి. నాకు అర్థమైనా కాకపోయినా కవికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలన్నది నా అభిప్రాయం.) మొదటిసారి చదివినప్పుడూ, మళ్ళీ ఈ సంచికకోసం తయారు చేస్తున్నప్పుడూ, వచన కవిత్వ రూపంపై నా ఆలోచనలకి మరికొంత స్పష్టతనిచ్చింది ఈ చర్చ.
ఉదా: వచనకవిత్వానికి ప్రాస, గతి, లయ ఇత్యాది నియమాలేవీ లేవు కాబట్టి అవి స్పష్టంగా ఉన్నా, అంతర్లీనంగా ఉన్నా పట్టింపేమీ లేదు అనుకోవచ్చు. అసలు లేక పోతే ఏ నష్టమూ లేదు. కానీ ఉన్న పక్షంలో కవితలో వాటికి ఒక సౌష్టవం ఉండాలా, అక్కర్లేదా? సౌష్టవం కేవలం శబ్దసంబంధిగానే కాదు, భావసంబంధిగా కూడా. ఒకే భావం లేదా పదం లేదా ఒక ఎక్స్ప్రెషన్ రికర్సివ్ ఎలిమెంట్గా ఉంటే ఆ రికరెన్స్ లో యూనిఫార్మిటీ ఉండాలా? అక్కర్లేదా? అలాగే, ఒక కవిత మొత్తం వేర్వేరు అలంకారాలతోనో, భావవ్యక్తీకరణలతోనో ఒకే అంశం గురించి పునః ప్రస్తావించే సందర్భాల్లో ఈ సౌష్టవం రూపంలోకానీ భావపునశ్చరణలో గానీ ఉండటం అవసరమా? ఉంటే అందువల్ల నిర్మాణం మరింత బలంగా ఉంటుందా? ఇది సౌష్టవం వల్ల స్ఫురించే లయ ప్రభావమా? (నిర్మాణం బలంగా ఉండటమంటే, కవి ఉద్దేశించిన భావం పాఠకుడికి మరింత స్పష్టంగా చేరడానికి సహాయపడేట్టుగా ఉండటం.) కనకప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో తక్కువవుతుందా? ఇలా ఎన్నో.
వచన కవిత్వ రూపం గురించి మరింత చర్చ జరగాలన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఇందుకు ముందడుగు వేయాల్సింది కవులు. (రమ గారనుకుంటున్నట్టు వారినెవరూ ‘అటుంచ’లేదు, ‘అడగకుండా ఉండా’ లేదు. వారే ఏమీ మాట్లాడ్డం లేదు ఈ విషయం గురించి. ఎవరైనా మాట్లాడి వుంటే నాకు తెలిపితే చాలా సంతోషిస్తాను.) సమర్ధులైన కవులకి ఇవన్నీ సహజప్రతిభతో అర్థమయిన అంశాలై, అవి వారి కవితల్లో ప్రతిఫలిస్తాయని అనుకుందాం. అటువంటి కవితల నిర్మాణాన్ని పరిశీలించి విమర్శించాల్సిన బాధ్యత సాటి కవులదే ముందుగా. అయితే చేరాగారన్నట్లు కవిత్వం గురించి కవిత్వంలొ చెప్తే అది లక్షణం కాదు. ఆ విమర్శల ద్వారా ఏ నిర్మాణ లక్షణాలని ఉపయోగించుకోడం ద్వారా కవిత మరింత బలంగా తయారవుతుందో సామాన్య కవులకు, ఔత్సాహికులకు అర్థమవుతుంది. (కవులు అంటే కవితలు అచ్చువేసినవారే అని కాదు, కవిత్వాన్ని ఆనందించి, దాని లక్షణాలను గురించి ఆలోచించేవారు కూడానూ.) ఈ నిర్మాణ లక్షణాలని వాడినంత మాత్రాన ఇత్తడి బంగారమవదు. కానీ, బంగారం ఇత్తడిలా కనిపించకుండా పోడానికి చిన్న ఆస్కారం ఉంటుంది.
సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:
1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.
2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?
3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:
ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.
రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.
ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.
పిల్లల కోసం గురించి Seetha Kumari అభిప్రాయం:
05/02/2011 5:39 am
ఎంత బాగున్నాయో….. మీ కవితలు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటాయి….
ప్రేమ కవితలు గురించి mani kumar అభిప్రాయం:
04/30/2011 5:44 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
అనుభూతి కవిత్వం గురించి indrani Palaparthy అభిప్రాయం:
04/14/2011 3:43 am
మొన్నామధ్య విజయవాడ వెళ్ళినప్పుడు అటక మీద నా పాత కవితల పుస్తకం దొరికింది.
నాకు పదేళ్ళ వయసప్పుడు రాసిన కవితలు,కొన్ని కధలు,బొమ్మలు ఉన్నాయందులో.
వ్రాద్దామని కలం తీయగా
స్ఫురించింది ఇంకు లేదని
పోద్దామని సీసా తీయగా
గుర్తుకొచ్చింది అయిపోయిందని
కొందామని షాపుకెళ్ళగా
ఙ్ఞాపకమొచ్చింది ఆదివారమని
ఇంటికొచ్చి లైటు వేయగా
తెలియజొచ్చింది కరెంటు లేదని
అప్పుడు తెలిసింది
తాను ఏమీలేని బికారినని
ఇది తన కల మాత్రమేనని. (30.06.87)
మనస్సు మందిరంలో మరచిన సత్యం
గుండె గదుల్లో ప్రతిధ్వనించగా
ఉప్పొంగిన ఆవేశం
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
అదుపు తప్పిన మనసును
ఆపలేకపోతుంటే
గుండెల్లో బరువు
భరించలేక
విశ్రాంతి కోసం నేను
మృత్యు మందిరంలోకి
వెళ్ళిపోయాను. (5.07.87)
ఇది చదువుకుంటుంటే భలే నవ్వు వచ్చింది.మనస్సుకొక మందిరం,మృత్యువుకొక మందిరం.
రెండు మందిరాలు కట్టించాను!
మూతి మీద మీసకట్టు
చేతిలో కిళ్ళీ పాకెట్టు
ఎందుకోయి ఈ కనికట్టు
తిన్నావా పెసరట్టు
నీ అబద్ధ్హాలు కట్టిపెట్టు
వెళ్ళి రుబ్బురోలు పట్టు
ఇడ్లీ ప్యాకెట్టు కట్టు
ఇక మీద ఈ వేషాలు కట్టు
మళ్ళీ వచ్చావో పడతా నీ పట్టు!
(11.06.87)
ఇలాంటి మాటల గారడీలు ఇంకా బోలెడున్నాయి.
వాన-వాన-వాన
చిన్నారి వాన-పొన్నారి వాన
వాన-వాన-వాన
చక్కటి వాన-చుక్కల వాన
పూల వాన-నీళ్ళ వాన
వాన-వాన-వాన
చిన్నారి చినుకులు లేపెలే జగమును
నదులను,చెరువులను నింపుతూ వచ్చెలే
నెమ్మిలి తకధిమి నృత్యం చేసే
చిన్నారి లేళ్ళు గంతులు వేసే
కప్పలు సైతం తెలిపె సంతోషం
బెకబెకమంటూ ఆనందపడెను
వాన-వాన-వాన
చిన్నారి వాన-పొన్నారి వాన
చక్కటి వాన-చుక్కల వాన
పూల వాన-నీళ్ళ వాన.
(30.06.87)
పూల మీద,సూర్యుడి మీద,చెట్ల మీద ఇంకా బోల్డు కవితలు.
దీని “తవికలు” మళ్ళీ తెచ్చింది బాబోయ్! అని మా మేనత్తలు ఎగతాళి చేస్తున్నా,”నాయనా, ఇంద్రా,నీ కవిత ఏదీ వినిపించు” అని అడిగే తాత గారి కోసం,ఆయన పక్కన కూచుని,ఆయనకే కాకుండా ఇంట్లో ఉన్న అందరూ తమ తమ పనులు వదిలిపెట్టి పరిగెత్తుకు వచ్చేలా గట్టి గట్టిగా ఈ పుస్తకంలోని కవితలు చదివి వినిపించేదాన్ని.
పుస్తకంలో పేజీలు పసుప్పచ్చ రంగుకి తిరిగిపోయాయి.
దాన్ని తిరిగి బస్తాలో పెట్టేసి,బస్తా మూతి బిగించి అటక మీద పారేసాను.
పాలపర్తి ఇంద్రాణి.
రెండు కవితలు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
04/10/2011 6:36 am
మీ కవితలు భలే బాగున్నాయండి. మీ బ్లాగు పేజీలో కూడా మఱికొన్ని కవితలు చదివాను. బాగా రాస్తున్నారు! మీ చేత ఇంకా ఇంకా మదిని ఆకట్టుకునే ఆనందమైన కవితలు రాయగలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకోవాలని ఆశిస్తూన్నాను 🙂
-ఆవినేని భాస్కర్.
ప్రేమ కవితలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/28/2011 1:16 pm
హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలు కవితలు ..తక్కెడ కొలతన.:)
రమ.
ప్రేమ కవితలు గురించి sasi అభిప్రాయం:
03/27/2011 2:32 am
కవితలు కవితలు కవితలు కవితలు…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
ప్రేమ ఫలిస్తే, వాన కురిస్తే,
చిటికెన వేలుకు చీమ కరిస్తే…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
01/29/2011 7:34 am
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు.
కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
కలిశాం గురించి Narayana అభిప్రాయం:
01/29/2011 3:58 am
“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
విధేయుడు,
నారాయణ
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav అభిప్రాయం:
01/25/2011 4:25 pm
చక్కగా చెప్పారు కామేశ్వరరావు గారూ! ఈ చర్చ ద్వారా తెలుసుకునే కొసరు విషయాలే ఎక్కువ. లక్షణ నిరూపణమే ప్రధానమైన ఈ చర్చలో పాదవిభజన ప్రయోజనం గురించి చర్చ లేదు. అయినా, ఆ దిశలో ఈ చర్చ కొన్ని కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. ఈమధ్యనే వెల్చేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకమాటన్నారు. (ఇది నామాటల్లో) ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది అని. ఆధునిక వచన కవిత్వానికి పాద బద్ధత ప్రయోజనం కూడా అదేనని నాకనిపిస్తుంది. ఇంగువ కట్టిన గుడ్డకి ఆ వాసన అంటినట్టు, పాద విభజన ద్వారానో, పద్యరూపం ద్వారానో కవితగా ఒక రచనని కనీసం స్ఫురింపచేయవచ్చు. ఇది రూపానికి సంబంధించిన వివరమే గానీ కవితాంశ (poesy)కు సంబంధించింది కాదనుకోండి.
పాదబద్ధత లేని వచనకవిత్వం అనగానే నాకు చప్పున గుర్తుకొచ్చింది కన్నెగంటి చంద్ర రాసిన దుఃఖం కవిత. ఆయన ఆ కవితని ఒక పేరాగ్రాఫులా రాశారు. (కానీ అందులో కామాలు పాదాంత విరామాలుగానూ, పాదాంతాలు అంత్యప్రాసతోనూ ఉంటాయి. అందువల్ల అది పేరాగ్రాఫులా ఉన్నా చదివేటప్పుడు ఒరవడి ద్వారా ఒక అంతర్లయ ఆ కవితలో స్పష్టమవుతుంది.) ఇంకో ఉదాహరణ, శ్రీకాంత్ అనే కవి కొంతకాలం కింద ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించిన కవితలు, పూర్తి వచనంలా రాయబడినవి. ఇలా పాదబద్ధత ఏ మాత్రమూ లేని కవితలని ఉదాహరణలుగా చూపించి పాదవిభజన కేవలం కవి ఐచ్ఛికమే అని ఒప్పుకోవచ్చు. కానీ, సంపత్కుమార ప్రతిపాదించిన భావగణాల వివరణ, ఒక కవి పాదవిభజన – ఐచ్ఛికంగానే – చేయదలచుకుంటే, ఆ విభజనలో కవికి కొంతైనా సహాయపడుతుందని నాకనిపిస్తుంది. కానీ, ప్రయోజనం అన్నమాట వచ్చేటప్పటికి కవికి తన రచనపైన స్పష్టత ఉండాలనేది నిర్వివాదం.
నాకిప్పటికీ ఎంతో ఆశ్చర్యాన్ని (కించిత్తు బాధనీ) కలిగించే విషయం ఒకటుంది. అది కవిత్వం అనేది హృదయాన్నుంచి ఒక భావావేశంలో ఉబికేదనీ, అందువల్ల దానికో సహజమైన స్వరూపం ఉంటుందనీ దానికి ఏరకమైన మార్పులు, పరిష్కరణలు చేసినా (అంటే మేధని ఉపయోగించడంతో) ఆ ఉద్వేగం పోతుందనీ ఇప్పటికీ నూటికి తొంభై మంది (ఎక్కువమంది కవులే) పైనే నమ్మడం. ఆవేశంలో తడబడుతూ మాట్లాడినప్పుడు, తన తడబాటు తనకే తెలియటం లేదనీ, కవి ఆవేశం మనకు అర్థమయినా తను ఏం మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం కాదనీ, ఈ రెంటికీ తేడా ఉందనీ గమనించకపోవడం. అంటే చెప్పాలన్న ఆవేశమే తప్ప ఎలా చెపితే బలంగా ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించడమే.
కవితాంశను పక్కనపెడితే, ఈ నమ్మకం వల్ల కలిగే పెద్ద నష్టం, కవిత నిర్మాణంలో కొట్టొచ్చినట్టు కనపడే లోపాలు, అస్పష్టతానూ. ఉదాహరణకి, మీరన్నట్టే పాద విభజన ఒక విరామం కోసం అనే అనుకున్నా, అది కవి ఒక స్పష్టమైన ఆలోచనతో చేయవలసిందే కదా! అందరి విషయంలో కాకపోయినా, కవిత్వమనేది కేవలం హృదయ సంబంధి అనే నమ్మకం వల్ల, ఈ స్పష్టత కవికి అవసరం లేదు అని తప్పించుకునే వీలు ఒకటి ఏర్పడింది. పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా! (పాదవిభజన నియతమైనంత మాత్రాన వచన కవిత్వం ఛందోబద్ధమైనదన్న వాదన నాకు మింగుడు పడని విషయం.) అందువల్ల, ఈ చర్చ కవికి తన కవితను నిర్మాణ సంబంధమైన దృష్టితో మరొక్కసారి పరిశీలించడానికి, ఆ నిర్మాణాన్ని సరిదిద్దుకోడానికీ (అది ఎంత ఐచ్ఛికమైనా) కొంతైనా తోడ్పడుతుందని నా అభిప్రాయం. (నా స్నేహితులు వాళ్ళ కవితలని నాకు చూపించినప్పుడు, నేను గమనించే ఒక లక్షణం పాదం ఎక్కడ ఎందుకు విరిచారా అని. నేను అర్థం చేసుకోలేని ప్రతిసారి, ఆ విరుపు వెనకాల గల కారణాన్ని వివరించమనీ అడిగేవాణ్ణి. నాకు అర్థమైనా కాకపోయినా కవికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలన్నది నా అభిప్రాయం.) మొదటిసారి చదివినప్పుడూ, మళ్ళీ ఈ సంచికకోసం తయారు చేస్తున్నప్పుడూ, వచన కవిత్వ రూపంపై నా ఆలోచనలకి మరికొంత స్పష్టతనిచ్చింది ఈ చర్చ.
ఉదా: వచనకవిత్వానికి ప్రాస, గతి, లయ ఇత్యాది నియమాలేవీ లేవు కాబట్టి అవి స్పష్టంగా ఉన్నా, అంతర్లీనంగా ఉన్నా పట్టింపేమీ లేదు అనుకోవచ్చు. అసలు లేక పోతే ఏ నష్టమూ లేదు. కానీ ఉన్న పక్షంలో కవితలో వాటికి ఒక సౌష్టవం ఉండాలా, అక్కర్లేదా? సౌష్టవం కేవలం శబ్దసంబంధిగానే కాదు, భావసంబంధిగా కూడా. ఒకే భావం లేదా పదం లేదా ఒక ఎక్స్ప్రెషన్ రికర్సివ్ ఎలిమెంట్గా ఉంటే ఆ రికరెన్స్ లో యూనిఫార్మిటీ ఉండాలా? అక్కర్లేదా? అలాగే, ఒక కవిత మొత్తం వేర్వేరు అలంకారాలతోనో, భావవ్యక్తీకరణలతోనో ఒకే అంశం గురించి పునః ప్రస్తావించే సందర్భాల్లో ఈ సౌష్టవం రూపంలోకానీ భావపునశ్చరణలో గానీ ఉండటం అవసరమా? ఉంటే అందువల్ల నిర్మాణం మరింత బలంగా ఉంటుందా? ఇది సౌష్టవం వల్ల స్ఫురించే లయ ప్రభావమా? (నిర్మాణం బలంగా ఉండటమంటే, కవి ఉద్దేశించిన భావం పాఠకుడికి మరింత స్పష్టంగా చేరడానికి సహాయపడేట్టుగా ఉండటం.) కనకప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో తక్కువవుతుందా? ఇలా ఎన్నో.
వచన కవిత్వ రూపం గురించి మరింత చర్చ జరగాలన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఇందుకు ముందడుగు వేయాల్సింది కవులు. (రమ గారనుకుంటున్నట్టు వారినెవరూ ‘అటుంచ’లేదు, ‘అడగకుండా ఉండా’ లేదు. వారే ఏమీ మాట్లాడ్డం లేదు ఈ విషయం గురించి. ఎవరైనా మాట్లాడి వుంటే నాకు తెలిపితే చాలా సంతోషిస్తాను.) సమర్ధులైన కవులకి ఇవన్నీ సహజప్రతిభతో అర్థమయిన అంశాలై, అవి వారి కవితల్లో ప్రతిఫలిస్తాయని అనుకుందాం. అటువంటి కవితల నిర్మాణాన్ని పరిశీలించి విమర్శించాల్సిన బాధ్యత సాటి కవులదే ముందుగా. అయితే చేరాగారన్నట్లు కవిత్వం గురించి కవిత్వంలొ చెప్తే అది లక్షణం కాదు. ఆ విమర్శల ద్వారా ఏ నిర్మాణ లక్షణాలని ఉపయోగించుకోడం ద్వారా కవిత మరింత బలంగా తయారవుతుందో సామాన్య కవులకు, ఔత్సాహికులకు అర్థమవుతుంది. (కవులు అంటే కవితలు అచ్చువేసినవారే అని కాదు, కవిత్వాన్ని ఆనందించి, దాని లక్షణాలను గురించి ఆలోచించేవారు కూడానూ.) ఈ నిర్మాణ లక్షణాలని వాడినంత మాత్రాన ఇత్తడి బంగారమవదు. కానీ, బంగారం ఇత్తడిలా కనిపించకుండా పోడానికి చిన్న ఆస్కారం ఉంటుంది.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao అభిప్రాయం:
01/25/2011 9:15 am
సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:
1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.
2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?
3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:
ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.
రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.
ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.